ఎవరు చెప్పినా.. వినేదే లేదు!
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణంలో ఉంది. ఇందుకుగాను జిల్లాలోని చీమకుర్తి గ్రానైట్ డంప్ల నుంచి రాళ్ల తరలింపు ప్రక్రియ నిత్యం కొనసాగుతోంది.
జాతీయ రహదారిపై అదే దండుయాత్ర
అమలుకు నోచని అధికారుల సూచనలు
ప్రమాదకరంగానే గ్రానైట్ రాళ్ల తరలింపు
పట్ట కప్పకుండా ఒంగోలు నగరంలోని కర్నూలు పైవంతెన వద్ద రాళ్లను తీసుకెళ్తున్న ఓ టిప్పర్
ఒంగోలు అర్భన్, న్యూస్టుడే: పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణంలో ఉంది. ఇందుకుగాను జిల్లాలోని చీమకుర్తి గ్రానైట్ డంప్ల నుంచి రాళ్ల తరలింపు ప్రక్రియ నిత్యం కొనసాగుతోంది. దాదాపు 300 టిప్పర్లతో వీటిని రవాణా చేస్తున్నారు. వాస్తవానికి ఒక్కో వాహనంలో 28 టన్నుల బరువునే రవాణా చేయాల్సి ఉన్నప్పటికీ 40 టన్నులకు మించి ఎక్కిస్తున్నారు. పరిమితికి మించిన బరువు కారణంగా రోడ్లు దెబ్బతింటున్నా.. వాహనాలు తరచూ మొరాయిస్తూ రహదారులపై నిలిచిపోతున్నా ఎవరికీ పట్టడంలేదు. వీటి వేగంతో కొద్దిరోజుల వ్యవధిలోనే వేర్వేరు ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుని నలుగురి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిశాయి. అధికార పార్టీలోని ఓ కీలక నేతకు చెందిన బంధువు కంపెనీ నిర్మిస్తున్న ప్రాజెక్టు కావడంతో గనులు, రవాణా, పోలీసు శాఖల అధికారులు కిమ్మనడం లేదు. ఈ విషయాన్ని తెలుపుతూ ‘ఈనాడు’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు జిల్లా యంత్రాంగం స్పందించింది. చీమకుర్తిలో ఇటీవల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహన చోదకులకు అధికారులు పలు సూచనలు చేశారు. అయినప్పటికీ ఆచరణలో అవేమీ అమలు కావడం లేదు.
ఆగని ప్రమాదాల పరంపర...
గ్రానైట్ రాళ్ల కారణంగా ఒంగోలు- కర్నూలు రహదారిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాల పరంపరకు అడ్డుకట్ట పడటంలేదు. అధికారులు చేస్తోన్న సూచనలను కొందరు డ్రైవర్లు పట్టించుకోవడం లేదు. ఎవరు చెప్పినా వినేదే లేదు అన్నట్టుగా ఆచణలో వ్యవహరిస్తున్నారు. తాజాగా పొదిలి మండలం ఉప్పలపాడు సమీపంలో చోటుచేసుకున్న ప్రమాదంలో మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవన్ ప్రయాణిస్తున్న కారును టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలవ్వగా.. చోదకుడు, వ్యక్తిగత సహాయకుడు, అటెండర్లు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించి మరిన్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా రాళ్ల తరలింపులో నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.
క్షతగాత్రులకు అధికారుల పరామర్శ...
డ్రైవర్ బాషాను పరామర్శిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ అభిషిక్త్ కిషోర్
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ఒంగోలులోని సమావేశానికి హాజరయ్యేందుకు వస్తుండగా మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవన్ వాహనం పొదిలి మండలం ఉప్పలపాడు విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో శనివారం ప్రమాదానికి గురైంది. గ్రానైట్ కర్మాగారంలోకి వెళ్తున్న టిప్పర్, కారు ఢీకొన్నాయి. దీంతో సబ్ కలెక్టర్కు స్వల్ప గాయాలయ్యాయి. వాహన చోదకుడు, వ్యక్తిగత సహాయకుడు, అటెండర్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఒంగోలులోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేర్పించారు. వీరిని కలెక్టర్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, మార్కాపురం ఉప కలెక్టర్ సేతు మాధవన్ పరామర్శించారు. బాధితులకు ఎలాంటి ప్రాణపాయం లేదని... డ్రైవర్ బాషా చేతులకు, అటెండర్ బెనహర్ కంటికి తీవ్ర గాయాలైనట్టు వైద్యులు కలెక్టర్కు వివరించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన టిప్పర్ డ్రైవర్పై కేసు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఒంగోలు ఆర్డీవో విశ్వేశ్వరరావు, తహసీల్దార్ మురళి, ఇతర అధికారులు ఉన్నారు.
సదస్సులో అధికారులు చెప్పిందేమిటి...
* గ్రానైట్ రాళ్లను తరలిస్తున్న లారీల చోదకులు కచ్చితంగా రహదారి భద్రతా నియమాలు పాటించాలి. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్త వహించాలి.
* లారీల్లో పరిమితికి మించి ప్రమాదకర స్థితిలో ఎత్తుగా పేర్చి రవాణా చేయొద్దు. రాళ్లపై టార్పాల్పిన్ పట్ట కప్పుకొని రహదారిపై తీసుకెళ్లాలి.
* టిప్పర్ల చోదకులు కచ్చితంగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
* మితిమీరిన వేగంతో నడపొద్దు.
* రహదారి అంచుల్లో నిలిపి ప్రమాదాలకు కారణం కారాదు.
* నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు.
ఆచరణలో డ్రైవర్లు చేస్తున్నదేమిటి...
* అనుమతికి మించిన బరువులతోనే ప్రమాదకరంగా రాళ్ల రవాణా ఇంకా సాగుతోంది.
* ఒక్కటంటే ఒక్క టిప్పర్కు కూడా రాళ్లపై టార్పాలిన్ పట్ట కప్పిన దాఖలాలు లేవు.
* పరిమితికి మించి వాహనం పైకి కనిపించేలా రాళ్లను వాహనాల్లోకి ఎక్కిస్తున్నారు.
* అధిక బరువుతో టైర్లు పేలి.. ఇంజిన్లు మరమ్మతులకు గురై వాహనాలు మొరాయిస్తున్నాయి. వీటిని రహదారి అంచుల్లోనే నిలపడం పరిపాటిగా మారింది.
* రోజుకు రెండు ట్రిప్పులు నడపాలనే లక్ష్యం విధించడంతో కొందరు డ్రైవర్లు మితిమీరిన వేగంతో పరుగులు తీయిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాలకు కారణమవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాలంటీర్ల మెడపై వైకాపా కత్తి
[ 24-04-2024]
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేతను మించిన వారుండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. -
అన‘కొండలు’ తిన్న మన్ను.. రూ.860 కోట్లు
[ 24-04-2024]
తవ్వుకు‘న్నోళ్ల’కు తవ్వుకున్నంత.. మేసి‘నోళ్ల’కు మేసినంత. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో సహజ వనరుల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. నేతల ముసుగులో ఉన్న గుంట నక్కలు బరితెగించాయి. -
ఇది కాదా.. జగన్నాటకం!
[ 24-04-2024]
అబద్ధపు హామీలు గుప్పించడం.. మాయమాటలు చెప్పడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని మించినవారుండరు. అయిదేళ్లు పట్టించుకోకుండా ఉండటం. -
నామినేషన్ల వేళ మారిన పేర్లు
[ 24-04-2024]
నామినేషన్ల దాఖలు సమయంలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రకటించిన వారికి కాకుండా కొన్నిచోట్ల ఇతరులకు సీట్లు కేటాయించారు. -
అరవీర ‘రంగు’ మార్తాండ
[ 24-04-2024]
మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు. -
క్యాషియర్ జగన్.. నొక్కవేం బటన్
[ 24-04-2024]
రాష్ట్రంలో సంక్షేమం కోసం తరచూ బటన్లు నొక్కుతున్నాను. ప్రతి గడపకూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేరుస్తున్నానంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రివన్నీ ఉత్తుతి మాటలేనని అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సర్పంచులపై గురి.. పల్లెలకు ఉరి
[ 24-04-2024]
పల్లెవాసుల ఆశల్ని చిదిమేశారు..పట్టుగొమ్మలనూ నరికేశారు..నిధుల్ని దిగమింగేశారు..చిల్లిగవ్వ కోసం దేబిరించాల్సిన దుస్థితిలోకి పంచాయతీల్ని నెట్టేశారు. -
అయిదో రోజు 46 నామపత్రాల దాఖలు
[ 24-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అయిదో రోజైన మంగళవారం 46 మంది తమ నామపత్రాలు దాఖలు చేశారు. -
తెదేపాలో చేరికల జోరు
[ 24-04-2024]
తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. మంగళవారం వైకాపా సర్పంచి కోమలి భర్త బొల్లినేని మధు అనుచర గణంతో సహా పార్టీలో చేరారు. -
కరోనాతో ఆర్థికంగా కుదేలై.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య
[ 24-04-2024]
కరోనాతో ఆర్థికంగా కుదేలైన ఓ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం సింగరాయకొండలో చోటు చేసుకుంది. -
చిట్టితల్లి వేడుక చూడకుండానే..
[ 24-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పుష్పాలంకరణ వేడుక చూడకుండానే ఆ తండ్రి దూర తీరాలకు చేరుకున్నారు. సామగ్రి తీసుకొస్తుండగా, కారు చక్రాలు కర్కశంగా ఆయన్ను చిదిమేశాయి. -
ఉత్సవ విగ్రహాల్లా మార్చేశావ్.. జగన్
[ 24-04-2024]
గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అంటే ఎంతో గౌరవంగా ఉండేది. చెక్ పవర్తో నిధులను ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. -
రోడ్లు ఛిద్రం.. ఒళ్లు హూనం
[ 24-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఎక్కడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ దారుల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనమవుతుందో రామచంద్రా అని ప్రజలు బాధ వెలబోసుకున్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. -
‘భూ’చోళ్ల అవినీతి రూ.201.33 కోట్లు
[ 24-04-2024]
ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని భూ పరిపాలన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి