విద్వేషాలతో జాతి మనుగడకు ప్రమాదం
ప్రజలంతా సోదరభావంతో కలిసి ముందుకు సాగాలని జయహో సంస్థ జాతీయ అధ్యక్షుడు విజయ శంకర స్వామి పేర్కొన్నారు.
మాట్లాడుతున్న విజయ శంకర స్వామి, చిత్రంలో జయహో సంస్థ సభ్యులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ప్రజలంతా సోదరభావంతో కలిసి ముందుకు సాగాలని జయహో సంస్థ జాతీయ అధ్యక్షుడు విజయ శంకర స్వామి పేర్కొన్నారు. ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్లో శనివారం నిర్వహించిన సంస్థ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో మత ద్వేషాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా మతాల సారాన్ని సరిగా అర్థం చేసుకోకుండా కొందరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జాతి మనగడ కష్టమవుతుందన్నారు. అన్ని మతాలు ప్రేమనే బోధించాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. జాతీయ ప్రధాన కార్యదర్శి అహ్మద్ అభిలాష్ మాట్లాడుతూ... ఏటా డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు ఐక్యతా దినాలుగా పాటిస్తూ, దేశ వ్యాప్తంగా హిందూ ముస్లింల సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సంఘం నాయకులు లోక్నాథ్, సలార్, అబ్దుల్ రెహ్మాన్, జిలానీ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిట్టితల్లి వేడుక చూడకుండానే..
[ 24-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పుష్పాలంకరణ వేడుక చూడకుండానే ఆ తండ్రి దూర తీరాలకు చేరుకున్నారు. సామగ్రి తీసుకొస్తుండగా, కారు చక్రాలు కర్కశంగా ఆయన్ను చిదిమేశాయి. -
ఉత్సవ విగ్రహాల్లా మార్చేశావ్.. జగన్
[ 24-04-2024]
గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అంటే ఎంతో గౌరవంగా ఉండేది. చెక్ పవర్తో నిధులను ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. -
రోడ్లు ఛిద్రం.. ఒళ్లు హూనం
[ 24-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఎక్కడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ దారుల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనమవుతుందో రామచంద్రా అని ప్రజలు బాధ వెలబోసుకున్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. -
భూచోళ్ల అవినీతి రూ.201.33 కోట్లు
[ 24-04-2024]
ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని భూ పరిపాలన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్