స్తంభాన్ని ఢీకొట్టి... యువకుడి దుర్మరణం
వేగంగా వెళ్తున్న బుల్లెట్ అదుపు తప్పి టెలిఫోన్ స్తంభాన్ని డీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: వేగంగా వెళ్తున్న బుల్లెట్ అదుపు తప్పి టెలిఫోన్ స్తంభాన్ని డీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కేశవరాజుకుంటకు చెందిన ఉమ్మడిశెట్టి అంకబాబు కుమారుడు వెంకటేష్ (18)... గద్దలగుంటలోని స్నేహితులను కలిసేందుకు శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో బుల్లెట్ వాహనంపై ఇంటికి తిరిగి బయలుదేరాడు. వేగంగా వెళ్తున్న వాహనం... వీఐపీ రోడ్డులో అదుపుతప్పి టెలిఫోన్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి యువకుడి తల రెండుగా చీలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో పెద్ద శబ్ధం రావడంతో పరిసర నివాసితులు... వెంటనే 108కు సమాచారం ఇచ్చి, రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాలిక మృతిపై ఆందోళన
కందుకూరు పట్టణం, న్యూస్టుడే: కందుకూరు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ఆరేళ్ల బాలిక మృతి వివాదానికి దారి తీసింది. వైద్యులు సక్రమంగా వైద్య సేవలందించనందునే బాలిక మృతి చెందారంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం బాలిరెడ్డిపాలేనికి చెందిన నల్లపు వీరనారాయణ, ఆదిలక్ష్మి కుమార్తె పుష్పవల్లి(6) జ్వరంతో బాధపడుతున్నారు. శుక్రవారం వాంతులు అయి నీరసంగా ఉందని కందుకూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. శనివారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో బాలిక మృతిచెందారు. ముక్కు పచ్చలారని తమ బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నా వైద్యులు పట్టించుకోలేదని చిన్నారి తల్లి, బంధువులు ఆరోపించారు. శుక్రవారం ఉదయం జూనియర్ వైద్యుడు పరీక్షించారని, అదేరోజు రాత్రి నర్సులు ఇంజెక్షన్ వేశారు మినహా ఏ వైద్యుడు మా బిడ్డకు వైద్యం చేయలేదని వారు తెలిపారు. అసలు ఏం బాగా లేదో కూడా చెప్పలేదని వాపోయారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శకుంతల మాట్లాడుతూ చిన్నారికి శనివారం వేకువజామున నిద్రలో పిడుసు లేదా గుండె సంబంధిత సమస్య తలెత్తి మృతి చెందినట్లు భావిస్తున్నామన్నారు. వైద్యుల నిర్లక్ష్యమేమీ లేదని, వైద్య సేవలు సక్రమంగా అందించినట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కోతల’రాయుడు
[ 18-04-2024]
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆచరణలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల వారీగా ఇప్పటికే కోతలు పెట్టారు. -
కీలక ఘట్టం ఆరంభం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకఘట్టం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆర్వోలు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
జగనా‘సుర’ కుట్రలు
[ 18-04-2024]
-
వాలంటీర్లతో.. రాజకీయ నాటకాలు
[ 18-04-2024]
ఈ నెల 10న ఒంగోలు సమతానగర్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఒకటో లైన్లో నివసిస్తున్న చప్పిడి ప్రభావతి నివాసానికి వెళ్లారు. -
రాహుల్.. సాధించి చూపెన్
[ 18-04-2024]
దేశంలోనే అత్యున్నత సర్వీస్.. కఠిన పరీక్షగా చెప్పుకొనే సివిల్స్ సాధించడం అంటే అంత సులువేమీ కాదు. కొలువులందరికీ అంత తేలిగ్గా దక్కవు. లక్షల మందికి అదో చిరకాల స్వప్నం.. సాకారం కాని కలగానే మిగిలిపోతుంటుంది మరి. -
నాడు అద్దం.. నేడు అధ్వానం
[ 18-04-2024]
ఒంగోలు నగరంలోని కర్నూలు పై వంతెన నాడు ఆహ్లాదానికి చిరునామాగా ఉండేది. కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ..ఆంధ్రుల రాజసానికి అద్దంపట్టేలా రూపుదిద్దారు. -
పర్యాటకాన్ని చిదిమేసిన పాలకుడు
[ 18-04-2024]
-
నామపత్రాల ప్రక్రియకు పటిష్ఠ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి నామపత్రాల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఆయా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అధికారులను ఆదేశించారు. -
వేటగాళ్ల ఉచ్చు.. వన్యప్రాణులు బలి
[ 18-04-2024]
నల్లమల అటవీ పరిధి లోయ పల్లెల్లో వేటగాళ్ల దుశ్చర్యలు హద్దు మీరుతున్నాయి. వేటగాళ్లపై అటవీశాఖ నిఘా పూర్తిగా కరువైంది. దీనికి విద్యుత్తు సిబ్బంది సహకారం తోడవడంతో రెండు రోజుల క్రితం రెండు చుక్కల దుప్పులను విద్యుదాఘాతంతో చంపారు. -
వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
రాములోరి కల్యాణం బుధవారం వాడ, వాడలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
అభివృద్ధి మరిచి.. పర్యాటకానికి పాతర
[ 18-04-2024]
-
ప్రమాదవశాత్తూ మంటలంటుకొని రైతు సజీవ దహనం
[ 18-04-2024]
ఎండిపోయిన పంటకు నిప్పంటించగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని రైతు సజీవ దహనమైన సంఘటన తాళ్లూరులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98కోట్ల ఆస్తులు అటాచ్
-
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
-
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు