పర్యాటకం మాటున పొరుగు మద్యం!
జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు దొరుకుతున్న మద్యాన్ని కొన్ని బృందాలు ఏర్పాటుచేసుకుని రైళ్ల ద్వారా తీసుకొచ్చి స్థానికంగా అధిక రేటుకు విక్రయిస్తున్నారు.
యథేచ్ఛగా గోవా, పుదుచ్చేరిల నుంచి రవాణా
గోవా మద్యం విక్రయిస్తూ పామూరులో పట్టుబడిన నిందితులతో సెబ్ అధికార్లు
కనిగిరి, న్యూస్టుడే: జిల్లాలో అక్రమ మద్యం వ్యాపారులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు దొరుకుతున్న మద్యాన్ని కొన్ని బృందాలు ఏర్పాటుచేసుకుని రైళ్ల ద్వారా తీసుకొచ్చి స్థానికంగా అధిక రేటుకు విక్రయిస్తున్నారు. అయినా ఎక్సైజ్, సెబ్ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పశ్చిమ ప్రకాశంలో ఈ తరహా మద్యం ఎక్కడికక్కడ కనిపిస్తోంది. గోవా, పుదుచ్చేరి, ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని దిగుమతి చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఆ రాష్ట్రాల్లో రూ.500కు కొనుగోలు చేసిన మద్యం బాటిల్ను కనిగిరి ప్రాంతంలో రూ.1500కు పైగా విక్రయిస్తున్నారు. గోవాలో ఓ కంపెనీ మద్యం బాటిల్ రూ.680 ఉండగా ఇక్కడ రూ.1600 ఉంది. నేరుగా రైలు ద్వారా నెల్లూరు చేర్చి తర్వాత మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, ఇతర మండలాల్లోని డాబాలు, రెస్టారెంట్లకు తరలిస్తున్నారు. ఇటీవల కనిగిరి ప్రాంతంలోని దాబాల్లో ముగ్గురిని విచారించగా ఓ వాలంటీర్, కొందరు చోటా మోటా నాయకుల పేర్లు చెప్పడం విశేషం. ఇదే తరహాలో రావినూతల, పామూరులోనూ స్వాధీనం చేసుకున్నారు.
అనుమానం రాకుండా..
ముఠా సభ్యులు పర్యాటకుల మాదిరి గోవా, పుదుచ్చేరి వెళ్తారు. అక్కడ నచ్చిన సరకు కొనుగోలు చేసి బ్యాగుల్లో నింపుకొని రైళ్లలో ప్రయాణిస్తారు. అలా కొందరు మార్కాపురం మీదుగా రైలులో తీసుకువచ్చి అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా కనిగిరి ప్రాంతంలోని కొన్ని గృహాల్లో రహస్యంగా భద్రపరుస్తున్నారు. మరో ముఠా సభ్యులు సింగరాయకొండకు తొలుత తరలించి అక్కడినుంచి కందుకూరు, పామూరు తీసుకువెళ్తున్నారు. ఏజెంట్లను ఏర్పాటుచేసుకుని దాబాలు, దుకాణాలకు అమ్ముతున్నారు. ఎవరైనా తనిఖీ చేస్తున్నారని తెలిస్తే మామూళ్లు ఇచ్చి తప్పించుకుంటున్నారు. ఎక్సైజ్, సెబ్ అధికారులు పట్టుకుంటే అధికార పార్టీ నాయకులతో ఫోన్లు చేయిస్తున్నారు. ఇటీవల పామూరు మండలంలో ఈ దందాలో ప్రమేయం ఉన్న వాలంటీర్తో పాటు మరొకరిని పట్టుకుని నేతల నుంచి ఫోన్ రాగానే విడిచిపెట్టేశారు.
నిఘా పెట్టాం
ఇతర రాష్ట్రాల మద్యాన్ని ఇక్కడ విక్రయించడం నేరం. ఎవరైనా ఇలా అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే పామూరులో పట్టుకుని నిందితులను జైలుకు పంపించాం. ఓ వాలంటీర్ను అదుపులోకి తీసుకుని విచారించాం. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్న 20 మందిపై నిఘా పెట్టాం. ఎవరినీ వదిలేది లేదు.
అబ్దుల్ జలీల్, సెబ్ సీఐ, కనిగిరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?