విహారానికి వచ్చి.. అన్నా చెల్లెళ్ల గల్లంతు
కొద్దిరోజుల్లో ఆ ఇంట శుభకార్యం జరగాల్సి ఉంది.. ఇప్పటికే బంధువులంతా చేరుకుంటున్నారు. అంతా సందడిగా ఉంది.
బాలికను రక్షించిన మత్స్యకారులు.. కానరాని మరొకరి ఆచూకీ
పాకల తీరంలో ఘటన
కుమారుడు సిద్ధిఖీ ఆచూకీ లేక తీరం ఒడ్డున వేదనలో తండ్రి హమీద్
సింగరాయకొండ గ్రామీణం, న్యూస్టుడే: కొద్దిరోజుల్లో ఆ ఇంట శుభకార్యం జరగాల్సి ఉంది.. ఇప్పటికే బంధువులంతా చేరుకుంటున్నారు. అంతా సందడిగా ఉంది. సమీపంలో ఉన్న సముద్ర తీరానికి విహారం కోసం వారంతా వచ్చారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. స్నానాలు చేస్తున్న సమయంలో రాకాసి అలల ఉద్ధృతికి ఇద్దరు చిన్నారులు గల్లంతవగా వారిలో ఒకరిని మత్స్యకారులు రక్షించగలిగారు. మరొకరి ఆచూకీ ఇప్పటికీ కానరాలేదు. ఈ ఘటన పాకల తీరం వద్ద చోటుచేసుకుంది. రామాయపట్నం మెరైన్ సీఐ కిషోర్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాయకొండ మండలం సోమరాజుపల్లి పరిధి ఫకీర్పాలెంలో షేక్ అబ్దుల్ హమీద్ దంపతులు నివసిస్తున్నారు. పదేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడకు వచ్చిన వీరికి అయిదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. స్థానిక మసీదులో హమీద్ ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ఫిబ్రవరి మొదటివారంలో వీరి నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఉండటంతో బంధువులు వచ్చారు. ఆదివారం హమీద్ కుమారుడు అబ్దుల్ హమీద్ సిద్ధిఖీ(15), కుమార్తె అమల్, మరికొందరు బంధువులు కలిసి మొత్తం ఆరుగురు పాకల తీరం వద్దకు వచ్చారు. అంతా స్నానాలు చేస్తున్న వేళ రాకాసి వలలు విరుచుకుపడటంతో అన్నాచెల్లెలిద్దరూ కొట్టుకుపోయారు. బంధువులు పెద్దగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న మత్స్యకారులు అమల్ను రక్షించి ఒడ్డుకు చేర్చారు. సిద్ధిఖీ మాత్రం గల్లంతయ్యాడు. అపస్మారక స్ధితికి చేరుకున్న అమల్ను 108లో ఒంగోలు రిమ్స్కు.. అక్కడినుంచి మరో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.
బోట్లతో గాలింపు
సిద్ధిఖీ ఆచూకీ కోసం మెరైన్ సిబ్బంది, మత్స్యకారులు బోట్లతో గాలిస్తున్నారు. మెరైన్ ఎస్సై ఈశ్వరయ్య, స్థానిక ఎస్సై ఫిరోజఫాతిమా, పోలీసు సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు తీరం వద్దకు చేరుకొని రోదించారు. సిద్ధిఖీ స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. కాగా గత నాలుగైదు రోజులుగా ఈ తీరం వద్ద రాకాసి అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. ఈ సమయంలో సందర్శకులు ఆ ప్రాంతంలో లోపలికి వెళ్లడం ప్రమాదకరం. ఈ విషయం మెరైన్ సిబ్బందికి తెలుసు. ఘటన జరిగిన సమయంలో అక్కడకు వచ్చినవారికి గస్తీ సిబ్బంది అవగాహన కల్పించి హెచ్చరించాల్సి ఉన్నా అటువంటివేవీ జరగలేదని తెలుస్తోంది. చిన్నారులు కాస్త ఒడ్డునే ఉన్నప్పటికీ అల రూపంలో ముప్పు విరుచుకుపడిందని స్థానికులు తెలిపారు.
మత్స్యకారులు రక్షించిన బాలిక అమల్
సిద్ధిఖీ (పాతచిత్రం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ