logo

చెరువులో దూకి మహిళ బలవన్మరణం

వేడుకలో జరిగిన వివాదంతో మనస్తాపానికి గురైన మహిళ చెరువులో దూకి బలవన్మరణం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 01 Feb 2023 01:50 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: వేడుకలో జరిగిన వివాదంతో మనస్తాపానికి గురైన మహిళ చెరువులో దూకి బలవన్మరణం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టంగుటూరు మండలం జమ్ములపాలేనికి చెందిన పాదర్తి లక్ష్మీ ప్రవీణ (40)... హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న కుమారుడి వద్ద ఉంటున్నారు. ఆమె భర్త కృష్ణారావు కరోనా సమయంలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఓ వేడుకకు కుమారుడితో పాటు మంగళవారం హాజరయ్యారు. అక్కడ చిన్న వివాదం చోటు చేసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై... ఒంగోలు వచ్చారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో రంగారాయుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తొమ్మిది గంటల సమయంలో మృత దేహాన్ని వెలికితీయించి... రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని