పద్దు... మనకెంత ప్రయోజనం దక్కు!
‘కొవిడ్’ పరిణామాల అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో రూ.45 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
‘కొవిడ్’ పరిణామాల అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్లో రూ.45 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్పై అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అందులోని అంశాలు, వాటి ప్రభావంపై జిల్లా వాసుల్లో ఎనలేని ఆసక్తి నెలకొంది. వ్యవసాయ రంగంపై అధికంగా ఆధారపడిన జిల్లా కావడంతో ఎలాంటి ప్రోత్సాహకాలు దక్కనున్నాయోనని అన్నదాతలు ఆశించారు. రహదారులు, పథకాలు, రంగాలవారీగా ఎటువంటి ప్రయోజనాలు ఒనగూరుతాయోనని ఎదురుచూశారు. మొత్తానికి కేంద్రం ప్రవేశపెట్టిన పద్దు కొన్ని రంగాలకు ఊతమివ్వగా.. మరికొన్నింటిని విస్మరించిందనే విమర్శలు వినిపించాయి.
ఈనాడు డిజిటల్, ఒంగోలు
ఔత్సాహిక మహిళలకు లబ్ధి...
దీన్దయాళ్ అంత్యోదయ యోజన కింద స్వయం సహాయక సంఘాల మహిళలు చిన్నస్థాయి పరిశ్రమలు ఏర్పాటుచేసుకునేందుకు, నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయడంతో పాటు మార్కెటింగ్కు అవకాశాలు కల్పించేలా బడ్జెట్లో ప్రోత్సాహాలు ప్రకటించారు. జిల్లాలో 5.5 లక్షల మంది స్వయం సహాయ మహిళలున్నారు. వీరిలో ఔత్సాహికులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా లబ్ధి పొందనున్నారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకంలో భాగంగా రెండేళ్లకు డిపాజిట్పై 7.5 శాతం స్థిర వడ్డీ ప్రకటన కూడా మహిళకు లబ్ధి చేకూర్చనుంది.
తృణధాన్యాలకు ‘చిరు’సాయం...
గతేడాది బడ్జెట్లో తృణధాన్యాల సాగుకు పెద్దపీట వేసిన ఆర్థిక మంత్రి.. ఈ ఏడాది కూడా అదే పంథా కొనసాగించారు. పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు, మార్కాపురం, దర్శి, కనిగిరి తదితర ప్రాంతాల్లో జొన్న, సజ్జలు, రాగులు, కొర్రలు, అరికెలు వంటి పంటల సాగు ఎక్కువ. దాదాపు 4 వేల హెక్టార్లలో వీటిని పండిస్తుంటారు. బడ్జెట్లో వీటికి పెద్దపీట వేయడంతో ఆ విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.
1.5 లక్షల మంది వేతన జీవులకు ఊరట...
జిల్లాలో ఆదాయ పన్ను చెల్లింపు జాబితాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు దాదాపు 1.5 లక్షల మంది వరకు ఉన్నారు. కొత్తగా ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకున్న ఉద్యోగులకు ప్రస్తుతం రూ.5 లక్షల వరకు ఉన్న ఆదాయ పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. గతంలో ఉన్న ఆరు శ్లాబులను అయిదుకు తగ్గించారు. తద్వారా పన్ను చెల్లించే ఉద్యోగులకు కొంత ఊరట కలగనుంది. వేతనాన్ని బట్టి ఏడాదికి రూ.12 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదా కానున్నట్లు ఉద్యోగులు అంచనా వేస్తున్నారు.
రొయ్య.. మళ్లీ మీసం మెలేసేనా..!
పీఎం మత్స్య సంపద యోజనకు అదనంగా రూ.6 కోట్లు కేటాయించడం, బడ్జెట్లో వీటి ఉత్పత్తులు, దాణాపై పన్నుల తగ్గింపు అంశాలు ఆక్వా రైతుకు కొంత ఊరట. జిల్లాలో సముద్ర తీర ప్రాంతం ఎక్కువ. టంగుటూరు, సింగరాయకొండ, కొత్తపట్నం తదితర ప్రాంతాల్లో దాదాపు 18 వేల ఎకరాలకు పైగా ఆక్వా సాగు ఉంది. ఏటా 30 వేల టన్నుల వరకు రొయ్య ఉత్పత్తి అవుతోంది. మూడు వేల మందికి పైగా రైతులు సాగు చేస్తున్నారు. కొన్నాళ్లుగా వాతావరణ మార్పులు, ధరలు లేకపోవడం వంటి కారణాలతో ఆందోళన చెందుతున్నారు. బడ్జెట్లో ప్రకటనతో వీరికి కొంతైనా ప్రయోజనం చేకూరనుంది.
వీటి ఊసేదీ...
* మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కేటాయింపుల తగ్గింపుతో వ్యవసాయ రైతులు, కూలీలకు పనిదినాల సంఖ్య తగ్గనుంది. * రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు కేటాయించినప్పటికీ జిల్లాకు సంబంధించి నూతన రైల్వే లైన్ల ప్రస్తావన, నడికుడి-శ్రీకాళహస్తి మార్గానికి సంబంధించిన ఎలాంటి ప్రకటనలు లేవు.
ఆవాసాలు పొందేందుకు కాస్త అనువు..
పీఎం ఆవాస్ యోజన కింద ఈసారి రూ.79 వేల కోట్లకు నిధులు పెంచారు. ఆ మేరకు జిల్లాలో పేదలు ప్రయోజనం పొందనున్నారు. గృహం కొనుగోలు చేయాలనుకునే వారికీ ఊరట లభించనుంది. జిల్లాలో
1.20 లక్షల మంది ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 68 వేల మందికి జగనన్న కాలనీల్లో పట్టాలిచ్చారు. వీరిలో కూడా సగానికి పైగా వివిధ కారణాలతో ఇళ్లు నిర్మించుకోలేక పోతున్నారు. పీఎం ఆవాస్ యోజన కింద జిల్లాలో 20 వేల మంది వరకు ఇళ్లను నిర్మించుకునే అవకాశాలున్నాయని అంచనా.
రహదారుల విస్తరణ ఎంత...
జాతీయ, రాష్ట్ర అంతర్గత రహదారులకు బడ్జెట్లో కేటాయింపులతో జిల్లా కూడా ప్రయోజనాలుంటాయా? ఉంటే ఏ మేరకు రహదారులు విస్తరించనున్నాయన్న చర్చ సాగుతోంది. జిల్లాలో నలువైపులా జాతీయ రహదారులున్నాయి. జాతీయ రహదారి 16, 544డితో పాటు వినుకొండ- గిద్దలూరు మధ్య 112 కిలోమీటర్ల, కావలి- సీతారామాపురం మధ్య 105 కిలో మీటర్ల, విజయవాడ- బెంగళూరు వయా పొదిలి, అద్దంకి మార్గంలో జాతీయ రహదారుల నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీఎస్పీలొస్తుంటారు.. పోతుంటారు ఆ కంత్రీ కానిస్టేబుళ్లు లోకల్
[ 28-03-2024]
పశ్చిమంలోని కీలకమైన పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలో ఇద్దరు కానిస్టేబుళ్లు దీర్ఘకాలికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అధికార పార్టీ నేతలపై ఎనలేని స్వామి భక్తి చాటుకుంటున్నారు. కార్యాలయంలోని కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్నారు. -
కారు, లారీ ఢీ.. ముగ్గురు మృతి
[ 28-03-2024]
టంగుటూరు టోల్ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
తలుపు తట్టనున్న ఓటు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల శంఖం మోగింది. ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. మే 13న పోలింగ్ ఉండనుంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి ఓ సువర్ణావకాశానికి తెర లేపింది. -
రూ.45 లక్షల విలువైన డబ్బు, మద్యం స్వాధీనం
[ 28-03-2024]
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్నట్లుగా అనుమానించిన సుమారు రూ.45 లక్షల విలువైన డబ్బు, మద్యం, ఇతర వస్తువులను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
దర్శి బరిలో నిలిచేదెవరు!
[ 28-03-2024]
జిల్లా రాజకీయాలను ఉత్కంఠతో ఊపేస్తున్న నియోజకవర్గం దర్శి. ఇక్కడి నుంచి తెదేపా కూటమి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. -
త్వరలో మూడు చోట్ల జనసేన సభలు, రోడ్షోలు
[ 28-03-2024]
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జనసేన అధినేత పవన్కల్యాణ్ను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
కీలుబొమ్మల స్వామిభక్తి
[ 28-03-2024]
ప్రజాధనాన్ని తాము వేతనంగా పొందుతున్నామనే విషయాన్ని పలువురు వాలంటీర్లు విస్మరిస్తున్నారు. ఫక్తు వైకాపా కార్యకర్తల అవతారమెత్తారు. -
ఎన్నికల వేళ.. ఎన్ని విచిత్రాలో అన్నా
[ 28-03-2024]
అయిదేళ్లుగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. చిన్నపాటి మరమ్మతులు.. వీధి దీపాల ఏర్పాటు వంటి వాటిని కూడా గాలికొదిలేసిన పాలకులకు ఎన్నికల వేళ జ్ఞానోదయం అయింది. -
ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు
[ 28-03-2024]
ఎన్నికల ప్రచారం, ఇతరత్రా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కొందరు వాలంటీర్లు బేఖాతరు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిపై వేటు చేసినా.. వారు గడిన పడటం లేదు. -
భారీగా అక్రమ మద్యం స్వాధీనం
[ 28-03-2024]
అర్థవీడు మండలం పోతురాజుటూరు- యాచవరం గ్రామాల నడుమ కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఇద్దరి వ్యక్తులను అరెస్టు చేసినట్లు మార్కాపురం సెబ్ డీఎస్పీ దుర్గాప్రసాద్ తెలిపారు. -
ఆక్వాలో ఉపాధికి అపార అవకాశం
[ 28-03-2024]
ఆక్వారంగం నేడు ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదుకుంటోందని, ఇందులో ఉపాధికి అపార అవకాశాలున్నాయని ఆంధ్రకేసరి విశ్వ విద్యాలయం ఉప కులపతి ఎం.అంజిరెడ్డి అన్నారు. -
విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిలకు దేహశుద్ధి
[ 28-03-2024]
పదో తరగతి పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థినులను కొందరు ఆకతాయిలు వేధిస్తుండగా, బాలికల బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
ఒంగోలు ఆర్వోపై కలెక్టర్ ఆగ్రహం
[ 28-03-2024]
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఒంగోలు ఆర్డీవో, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జీవీ.సుబ్బారెడ్డిపై కలెక్టర్ దినేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కమనీయం.. ప్రతిష్ఠా మహోత్సవం
[ 28-03-2024]
శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని సంతనూతలపాడులో బుధవారం కనులపండువగా నిర్వహించారు. -
ముగిసిన పదో తరగతి ప్రధాన పరీక్షలు
[ 28-03-2024]
పదో తరగతి ప్రధాన పరీక్షలు బుధవారంతో ముగిశాయి. సంస్కృతం, వృత్తి విద్యకు సంబంధించినవి ఈ నెల 30 వరకు కొనసాగుతాయి. -
జీజీహెచ్లో రోగుల భోజనంపై విచారణ
[ 28-03-2024]
సర్వజన ఆసుపత్రిలో రోగులకు నాణ్యతలేని భోజనం పెడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై వైద్య విద్య డైరెక్టరేట్ విభాగం అధికారులు స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే