ఆన్లైన్ అక్రమాలకు పరిష్కారమెన్నడో!
భూముల అడ్డగోలు ఆన్లైన్ దందాకు అడ్డులేకుండా పోతోంది. పైసలిస్తే ఒకరి భూమి మరొకరి పేరుతో సునాయాసంగా మార్చేస్తున్నారు. స్థానికంగా నివసించని వారి భూములను ఇతరుల పేరిట ఆన్లైన్లో మార్పులు చేసి క్రయవిక్రయాలకు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇతరుల పేరిట మార్పులు చేయడంపై బాధితుల ఆవేదన
అన్యాక్రాంతమైన వెలుగొండ కాలువ భూములివే...
హనుమంతునిపాడు, న్యూస్టుడే: భూముల అడ్డగోలు ఆన్లైన్ దందాకు అడ్డులేకుండా పోతోంది. పైసలిస్తే ఒకరి భూమి మరొకరి పేరుతో సునాయాసంగా మార్చేస్తున్నారు. స్థానికంగా నివసించని వారి భూములను ఇతరుల పేరిట ఆన్లైన్లో మార్పులు చేసి క్రయవిక్రయాలకు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం కనిగిరి నియోజకవర్గంలోని అనేక మండలాల్లో ఈ తరహా అక్రమాల్లో మోసపోయిన బాధితులు ఇప్పటికీ అధికారుల చుట్టూ సమస్య పరిష్కరించాలని తిరుగుతూనే ఉన్నారు. నియోజకవర్గం పరిధిలో గతంలో పనిచేసిన కొందరు రెవెన్యూ అధికారులు భూముల అక్రమ ఆన్లైన్ దందా ద్వారా భారీగా సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గత కలెక్టర్ చర్యలు తీసుకున్నా...
2021 జులై 30న ఓ పార్టీకి చెందిన వ్యక్తికి హెచ్ఎంపాడు మండలంలోని మహమ్మదాపురంలో అక్రమ ఆన్లైన్ చేశారని, తమ పార్టీకి చెందిన వ్యక్తికి చేయలేదని కొందరు అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఆయన అప్పటి కలెక్టర్ ప్రవీణ్ కుమార్కు విషయం చెప్పడంతో విచారణ చేసి అప్పటి తహసీల్దారు ఎన్.సుధాకరరావు, ఆర్ఐ పి.శివప్రసాద్, వీఆర్వో నరసింహులును సస్పెండ్ చేశారు. అయితే ఆ సమయంలో జరిగిన ఆన్లైన్ అక్రమాలను ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి పరిష్కరించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగే ‘స్పందన’ కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోతున్నారు. హెచ్ఎంపాడు మండలంలోని మహమ్మదాపురం, ఉమ్మనపల్లి, హెచ్ఎంపాడు, హాజీపురం, నందనవనం, వాలిచెర్ల, గొల్లపల్లి రెవెన్యూ పరిధిలోని గ్రామాల్లో ఆన్లైన్ బాధితులు ఎక్కువమంది ఉన్నారు.
వలసదారుల భూములు మాయం...
మండలంలో పనులు లేక పక్క జిల్లాలకు, తెలంగాణా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారి భూములను అధికంగా ఆన్లైన్లో మార్పులు చేశారు. అసైన్డ్ భూములను సైతం ఇతరుల పేరుతో మార్చేశారు. ప్రస్తుతం మండలంలో వెలిగొండ కాలువ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కొందరు వలసదారులు వచ్చి తమ పాస్ పుస్తకాలను పరిశీలించుకోగా అక్రమాలు వెలుగుచూశాయి. విజయవాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, కడప, కర్నూలు జిల్లాకు చెందిన స్థానికేతరుల పేరిట ఎక్కువగా వీటిని మార్చారు. జరిగిన మోసం తెలియని వారు ఎప్పటికైనా వెలుగొండ ప్రాజెక్టు వస్తే తమకు లబ్ధి వస్తుందని ఎకరా రూ.2 లక్షలరే కొనుగోలు చేసేశారు.
బతుకుతెరువుకు వెళితే నా భూమి కాజేశారు...
మాది హెచ్ఎంపాడు గ్రామం. బతుకుతెరువు కోసం బొబ్బిలి వెళ్లాం. 30 ఏళ్ల క్రితం ఉమ్మనపల్లి రెవెన్యూలో సర్వే నం:115/2లో ప్రభుత్వం మాకు అయిదెకరాల భూమి ఇచ్చింది. దీన్ని ప్రస్తుతం ఇతరులకు ఆన్లైన్ చేశారు. ఈ విషయమైన అధికారులకు పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం కలగలేదు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు.
వెంకట సత్యనారాయణ, హెచ్ఎంపాడు
రెండేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా
మా స్వగ్రామం. ఉమ్మనపల్లి. సర్వే నం: 367/1లో నాకు అయిదెకరాల అసైన్డ్ భూమి ఉంది. రెండేళ్ల క్రితం ఇతరులకు ఆన్లైన్ చేశారు. నాకు పట్టాదారు పుస్తకాలు కూడా ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల్లో మాత్రం తారుమారు చేసి స్థానికేతరులకు ఆన్లైన్ చేశారు. ఎన్ని అర్జీలు ఇచ్చినా ఫలితం లేదు. రెండేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా.
సయ్యద్ అబ్దుల్, ఉమ్మనపల్లి
భూ సర్వేలో సమస్యలు పరిష్కరిస్తున్నాం...
మండలంలో 27 రెవెన్యూ గ్రామాల్లో గతంలో జరిగిన ఆన్లైన్ తప్పులను భూ సర్వేలో సరిదిద్దుతున్నాం. ఇప్పటికే ఏపీ అగ్రహారం రెవెన్యూలో సర్వే పూర్తి చేశాం. అభ్యంతరాలు ఉంటే ఆయా గ్రామాల్లో సర్వే సమయంలో ఫిర్యాదు చేస్తే విచారించి నమోదు చేస్తాం. గతంలో జరిగిన అవకతవకలపై జిల్లా అధికారులకు గతంలోనే నివేదిక ఇచ్చారు. విచారణ జరుగుతోంది.
హరిబాబు, తహసీల్దారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్