బరితెగించిన అధికారం
దర్శి నగర పంచాయతీ పరిధిలో విలువైన ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు అధికార పార్టీ నేతలు వాలిపోతున్నారు. స్థిరాస్తి రంగం ఊపందుకోవడం, అడుగు జాగా కూడా మంచి ధర పలుకుతుండటంతో కబ్జా చేసేందుకు వెనుకాడటం లేదు.
దర్శిలో ప్రభుత్వ భూముల స్వాహాకు యత్నాలు
న్యూస్టుడే, దర్శి
దర్శి-అద్దంకి రోడ్డులోని 340/5 సర్వే నంబరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి పునాదుల కోసం తవ్విన గుంత
దర్శి నగర పంచాయతీ పరిధిలో విలువైన ప్రభుత్వ భూములు కనిపిస్తే చాలు అధికార పార్టీ నేతలు వాలిపోతున్నారు. స్థిరాస్తి రంగం ఊపందుకోవడం, అడుగు జాగా కూడా మంచి ధర పలుకుతుండటంతో కబ్జా చేసేందుకు వెనుకాడటం లేదు.
దర్శి-అద్దంకి ప్రధాన రహదారి పక్కనే 340/5 సర్వే నంబరులో 93 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. ఇక్కడ సెంటు స్థలం విలువ రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల పైమాటే. గతంలో కొందరు ఈ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు కట్టేందుకు బోరు తీసి పునాదులు వేశారు. ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకురావడంతో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ఈ స్థలంలో కొంతభాగాన్ని పీడీసీసీ భవన నిర్మాణానికి కేటాయించారు. మరికొంత భాగాన్ని పై భూములకు వెళ్లడానికి దారి కోసం వదిలారు. ఇప్పుడు దానిని ఆక్రమించడానికి ప్రయత్నాలు జరిగాయి. తాజాగా మట్టి డంప్ చేయడంతో పాటు పునాదులు తవ్వారు. విషయం తెలిసి అధికారులు వాటిని తొలగించి బోర్డు ఏర్పాటు చేశారు. టీచర్స్ కాలనీ సమీపంలోని సర్వే నం 789లో 25 నుంచి 30 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. ఈ స్థలంపై ప్రస్తుతం వివాదం నడుస్తోంది. ఇదే కాలనీలో సర్వేనంబరు 779 లో 35 సెంట్ల ప్రభుత్వ భూమి ఉండగా తాజాగా ఆక్రమణకు నేతలు రంగం సిద్ధంచేశారు. ఇక్కడ సెంటు స్థలం విలువ రూ.8 లక్షల వరకు ఉంది. అలాగే పొదిలి రోడ్డులోని కాటేరు వాగు స్థలం, కురిచేడు రోడ్డులో డొంక పోరంబోకు స్థలాల్లో కబ్జాలు జోరందుకున్నాయి.
టీచర్స్ కాలనీ సర్వే నంబరు 779 లో ప్రభుత్వ భూమిని చదును చేసిన దృశ్యం
వివాదాలు ముదిరి
ప్రభుత్వ స్థలాల ఆక్రమణకు ఒకరికొకరు పోటీ పడటంతో వివాదాలు ముదురుతున్నాయి. అద్దంకి రోడ్డు, టీచర్స్ కాలనీ స్థలాల విషయంలో అక్రమార్కులు రెవెన్యూ అధికారుల ముందు పంచాయతీలు పెడుతున్నారు. కురిచేడు రోడ్డులో డొంక పోరంబోకు దాదాపు 8 ఎకరాలు ఉంది. కొంతభాగం రైతులు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇదే స్థలంలో కొంత గతంలోనే ఓ విద్యాలయం వారు ఆక్రమించుకున్నారని, అనంతరం వెంచర్లు వేసి పలువురు అమ్మకాలు కూడా జరిపారని రైతులు ఆరోపిస్తున్నారు. వారిని వదిలి తమను ఎందుకు అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న స్థలాలను కొందరు ఆక్రమించి దుకాణాలు, భవనాలు ఏర్పాటుచేశారు. సాయినగర్లో ఈ తంతు ఎక్కువగా ఉంది.
చర్యలు తీసుకుంటాం
- శ్రావణకుమార్, తహసీల్దార్, దర్శి.
ప్రభుత్వ భూములు ఆక్రమణ నేరం.. వాటి జోలికి ఎవరు వెళ్లినా శిక్షార్హులే. కబ్జాల విషయం తెలిసిన వెంటనే ఆ స్థలాల్లో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. అక్రమార్కులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!