ధాన్యం.. ధరహాసం
ఖరీఫ్ సీజన్లో వరి పంటలో సన్న రకాలు సాగు చేసిన కర్షకులకు ధర కలిసివస్తోంది. బహిరంగ మార్కెట్లో రోజు రోజుకు ధర పెరుగుతుండటం ఊరట కలిగిస్తోంది.
పోటీపడి కొనుగోళ్లు
త్రిపురాంతకంలో ధాన్యాన్ని బస్తాలకు నింపుతున్న రైతు
త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్టుడే: ఖరీఫ్ సీజన్లో వరి పంటలో సన్న రకాలు సాగు చేసిన కర్షకులకు ధర కలిసివస్తోంది. బహిరంగ మార్కెట్లో రోజు రోజుకు ధర పెరుగుతుండటం ఊరట కలిగిస్తోంది.
సాగర్ ఆయకట్టులోని త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాల్లో ఖరీఫ్ సీజన్లో 13 వేల ఎకరాల్లో వరి సాగైంది. బీపీటీని అధిక విస్తీర్ణంలో వేశారు. సన్న రకాలైనందున డిమాండ్ ఉండటంతో తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యాన్ని పొలాల్లోనే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. 75 కిలోల బస్తా ధాన్యం రూ.1,750కు తీసుకుంటుండటంతో రైతులకు ఇతర ఖర్చులు సైతం తప్పాయి. ధరలు పెరుగుతున్న దృష్ట్యా కొందరు నిల్వ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. సన్న రకాలకు ప్రభుత్వ మద్దతు ధర కంటే అధికంగా ఇచ్చి వ్యాపారులు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ‘ఏ’గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు రూ.2060, సాధారణ రకానికి రూ.2040 ప్రకటించింది. 75 కిలోల బస్తా ‘ఏ’గ్రేడ్ రకానికి రూ.1545, సాధారణ గ్రేడ్కు రూ.1530 ఉన్నాయి. అదే బహిరంగ మార్కెట్లో 75 కిలోల బస్తా ధాన్యం రూ.1,600-1700 వరకు కొనుగోలు చేస్తున్నారు.
కేంద్రాలు వెల వెల
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసింది. ఉదాహరణకు త్రిపురాంతకం మండలంలో విశ్వనాథపురం, దూపాడు, వెల్లంపల్లి, గణపవరం, కంకణాలపల్లి.. ప్లుల్లలచెరువు మండలంలో మానేపల్లి, ఐటివరంలో ఇవి ఉన్నాయి. విశ్వనాథపురంలో 57, దూపాడు కేంద్రంలో 58, మానేపల్లిలో 165 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఆర్బీకేల్లో ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో రూ.100- 200 ఎక్కువగా ఉంది. తేమ 17 శాతం, వ్యర్థాలు, నాణ్యత ప్రమాణాలు వంటి నిబంధనలు లేకుండా వచ్చిన ధాన్యం వచ్చినట్లే లారీలకు ఎత్తుతున్నారు. గోతాలు, హమాలీలు, రవాణా ప్రయాసలతో సంబంధం లేకపోవడంతో రైతులూ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలకు ఆర్బీకేలు దూరంగా ఉన్నాయి. గణపవరానికి చెందిన రైతు తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ‘‘నాలుగెకరాల్లో బీపీటీ-5204 వరి రకం వేశాను. ఎకరాకు 35 బస్తాల దిగుబడి లభించింది. 75 కిలోల బస్తా రూ.1,650కి విక్రయించాను. ఇప్పుడు రూ.1700 ఉంది’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా