logo

వైభవంగా శివపార్వతుల కల్యాణం

శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో యర్రగొండపాలెంలోని స్టేట్‌ బ్యాంకు కూడలిలో శనివారం రాత్రి శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు.

Published : 05 Feb 2023 04:58 IST

కల్యాణం నిర్వహిస్తున్న వేద పండితులు

యర్రగొండపాలెం పట్టణం: శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో యర్రగొండపాలెంలోని స్టేట్‌ బ్యాంకు కూడలిలో శనివారం రాత్రి శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. శ్రీశైలం నుంచి వచ్చిన రథంలో ఉత్సవ విగ్రహాలు ఉంచి వేద పండితులు శాస్త్రోక్తంగా ఈ ఘట్టాన్ని నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌లు స్వామి వారికి పట్టు వస్త్రాలను తీసుకొచ్చారు. కార్యక్రమంలో మార్కాపురం శాసన సభ్యుడు నాగార్జునరెడ్డి, శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న, మాజీ బోర్డు సభ్యుడు ఐవీ సుబ్బారావు, ఏఎంసీ ఛైర్మన్‌ శ్రీనివాసరెడ్డి, సర్పంచి అరుణాబాయి, నిర్వాహకులు ఇమ్మడిశెట్టి  సత్యనారాయణ, భక్తులు పాల్గొన్నారు.  

పట్టువస్త్రాలు తీసుకొస్తున్న మంత్రి సురేష్‌, తితిదే ఛైర్మన్‌ సుబ్బారెడ్డి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని