ఇటు బెట్టింగులు .. అటు దొంగతనాలు
అతను పదేళ్లక్రితం పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. హైదరాబాద్ వెళ్లి ఆటోకాడ్ కోర్సునూ పూర్తి చేసి హైదరాబాద్, ఒంగోలు ప్రాంతాల్లో కొన్ని ఆటోమొబైల్ సంస్థల్లో ఉద్యోగాలు చేశాడు.
ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్టు
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు ఎస్పీ(క్రైమ్స్) శ్రీధర్రావు, చిత్రంలో ఒంగోలు డీఎస్పీ నాగరాజు,
ఒంగోలు ఒకటో పట్టణ, తాలూకా సీఐలు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరెడ్డి
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: అతను పదేళ్లక్రితం పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. హైదరాబాద్ వెళ్లి ఆటోకాడ్ కోర్సునూ పూర్తి చేసి హైదరాబాద్, ఒంగోలు ప్రాంతాల్లో కొన్ని ఆటోమొబైల్ సంస్థల్లో ఉద్యోగాలు చేశాడు. ఆ తర్వాత స్వగ్రామానికి చేరుకుని వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఆన్లైన్ క్రికెట్ బెట్టింగులకు అలవాటుపడి అప్పుల పాలయ్యాడు. వాటిని తీర్చేక్రమంలో ద్విచక్ర వాహన దొంగతనాలకు పాల్పడుతుండటంతో ఒంగోలు ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్దనుంచి రూ.3.95 లక్షల విలువైన 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ(క్రైమ్స్) ఎస్.వి.శ్రీధర్రావు వివరాలను వెల్లడించారు. ఒంగోలు నగరంలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహన చోరీలపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఆదేశాల మేరకు ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు పర్యవేక్షణలో ఒకటో పట్టణ సీఐ టి.వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీహరి తమ సిబ్బందితో నిఘా పెట్టారు. స్థానిక మంగమూరురోడ్డు కళానికేతన్ సమీపంలో అనుమానిత యువకుడ్ని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను తన స్కూటీపై పరారవుతుండగా వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసు విచారణలో సదరు యువకుడు టంగుటూరు మండలం మర్లపాడుకు చెందిన కొణిజేటి సాయిగా గుర్తించారు. ప్రస్తుతం మంగమూరు రోడ్డులోని మర్రిచెట్ల కాలనీలో నివాసం ఉంటూ ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడి అరెస్టు, చోరీసొత్తు రికవరీకి కృషిచేసిన అధికారులు, సిబ్బందిని అదనపు ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ నాగరాజు, ఒంగోలు ఒకటో పట్టణ, తాలూకా సీఐలు టి.వెంకటేశ్వర్లు, వి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీఎస్పీలొస్తుంటారు.. పోతుంటారు ఆ కంత్రీ కానిస్టేబుళ్లు లోకల్
[ 28-03-2024]
పశ్చిమంలోని కీలకమైన పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలో ఇద్దరు కానిస్టేబుళ్లు దీర్ఘకాలికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అధికార పార్టీ నేతలపై ఎనలేని స్వామి భక్తి చాటుకుంటున్నారు. కార్యాలయంలోని కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్నారు. -
కారు, లారీ ఢీ.. ముగ్గురు మృతి
[ 28-03-2024]
టంగుటూరు టోల్ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
తలుపు తట్టనున్న ఓటు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల శంఖం మోగింది. ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. మే 13న పోలింగ్ ఉండనుంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి ఓ సువర్ణావకాశానికి తెర లేపింది. -
రూ.45 లక్షల విలువైన డబ్బు, మద్యం స్వాధీనం
[ 28-03-2024]
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్నట్లుగా అనుమానించిన సుమారు రూ.45 లక్షల విలువైన డబ్బు, మద్యం, ఇతర వస్తువులను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
దర్శి బరిలో నిలిచేదెవరు!
[ 28-03-2024]
జిల్లా రాజకీయాలను ఉత్కంఠతో ఊపేస్తున్న నియోజకవర్గం దర్శి. ఇక్కడి నుంచి తెదేపా కూటమి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. -
త్వరలో మూడు చోట్ల జనసేన సభలు, రోడ్షోలు
[ 28-03-2024]
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జనసేన అధినేత పవన్కల్యాణ్ను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
కీలుబొమ్మల స్వామిభక్తి
[ 28-03-2024]
ప్రజాధనాన్ని తాము వేతనంగా పొందుతున్నామనే విషయాన్ని పలువురు వాలంటీర్లు విస్మరిస్తున్నారు. ఫక్తు వైకాపా కార్యకర్తల అవతారమెత్తారు. -
ఎన్నికల వేళ.. ఎన్ని విచిత్రాలో అన్నా
[ 28-03-2024]
అయిదేళ్లుగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. చిన్నపాటి మరమ్మతులు.. వీధి దీపాల ఏర్పాటు వంటి వాటిని కూడా గాలికొదిలేసిన పాలకులకు ఎన్నికల వేళ జ్ఞానోదయం అయింది. -
ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు
[ 28-03-2024]
ఎన్నికల ప్రచారం, ఇతరత్రా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కొందరు వాలంటీర్లు బేఖాతరు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిపై వేటు చేసినా.. వారు గడిన పడటం లేదు. -
భారీగా అక్రమ మద్యం స్వాధీనం
[ 28-03-2024]
అర్థవీడు మండలం పోతురాజుటూరు- యాచవరం గ్రామాల నడుమ కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఇద్దరి వ్యక్తులను అరెస్టు చేసినట్లు మార్కాపురం సెబ్ డీఎస్పీ దుర్గాప్రసాద్ తెలిపారు. -
ఆక్వాలో ఉపాధికి అపార అవకాశం
[ 28-03-2024]
ఆక్వారంగం నేడు ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదుకుంటోందని, ఇందులో ఉపాధికి అపార అవకాశాలున్నాయని ఆంధ్రకేసరి విశ్వ విద్యాలయం ఉప కులపతి ఎం.అంజిరెడ్డి అన్నారు. -
విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిలకు దేహశుద్ధి
[ 28-03-2024]
పదో తరగతి పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థినులను కొందరు ఆకతాయిలు వేధిస్తుండగా, బాలికల బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
ఒంగోలు ఆర్వోపై కలెక్టర్ ఆగ్రహం
[ 28-03-2024]
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఒంగోలు ఆర్డీవో, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జీవీ.సుబ్బారెడ్డిపై కలెక్టర్ దినేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కమనీయం.. ప్రతిష్ఠా మహోత్సవం
[ 28-03-2024]
శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని సంతనూతలపాడులో బుధవారం కనులపండువగా నిర్వహించారు. -
ముగిసిన పదో తరగతి ప్రధాన పరీక్షలు
[ 28-03-2024]
పదో తరగతి ప్రధాన పరీక్షలు బుధవారంతో ముగిశాయి. సంస్కృతం, వృత్తి విద్యకు సంబంధించినవి ఈ నెల 30 వరకు కొనసాగుతాయి. -
జీజీహెచ్లో రోగుల భోజనంపై విచారణ
[ 28-03-2024]
సర్వజన ఆసుపత్రిలో రోగులకు నాణ్యతలేని భోజనం పెడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై వైద్య విద్య డైరెక్టరేట్ విభాగం అధికారులు స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్