logo

లారీ ఢీకొని వృద్ధుడి దుర్మరణం

రోడ్డు దాటుతున్న వృద్ధుడిని లారీ ఢీకొనడంతో ఆయన మృతిచెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ..నాగులూరి కోటయ్య (70) గ్రామంలోని జాళ్లపాలెం రోడ్డులో చెరువు వద్ద నివసిస్తున్నారు.

Updated : 05 Feb 2023 05:50 IST

కొండపి, న్యూస్‌టుడే: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని లారీ ఢీకొనడంతో ఆయన మృతిచెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ..నాగులూరి కోటయ్య (70) గ్రామంలోని జాళ్లపాలెం రోడ్డులో చెరువు వద్ద నివసిస్తున్నారు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులకు చెప్పి రిక్షా తీసుకొని బయల్దేరిన కొంతసేపటికే ఎదురుగా వచ్చిన లారీ కిందపడి చనిపోయారు. లారీని స్టేషన్‌కు తరలించారు. ఎస్సై కె.రామకృష్ణ కేసు నమోదు చేశారు.


మనస్తాపంతో...: కొండపి: మనస్తాపంతో వృద్ధుడు ఆత్మహత్య చేసుకొన్న సంఘటన మండలంలోని పెరిదేపిలో శనివారం చోటుచేసుకొంది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ... గ్రామంలోని ఆది ఆంధ్రావాడకు చెందిన ఎ.యోహాను (58) భార్య ఇటీవల చనిపోవడం ..ఇద్దరు కుమార్తెలకు వివాహం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. శనివారం ఇంట్లోని శ్లాబుకు తాడుతో ఉరేసుకొని చనిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని