మునక ప్రాంతంలో టేకు దొంగలు
వెలిగొండ ప్రాజెక్ట్ మునక ప్రాంతాల్లో ఉన్న విలువైన టేకు సంపద మాయమైంది. తోటలు, పొలాల గట్లపై గతంలో వందల సంఖ్యలో టేకు చెట్లు ఉండేవి.
పట్టించుకోని ప్రాజెక్ట్ అధికారులు
మాయమైన సర్కారు వారి చెట్లు
అధికారులు గతంలో గుర్తు వేసిన ఓ టేకు చెట్టు
అర్థవీడు, న్యూస్టుడే: వెలిగొండ ప్రాజెక్ట్ మునక ప్రాంతాల్లో ఉన్న విలువైన టేకు సంపద మాయమైంది. తోటలు, పొలాల గట్లపై గతంలో వందల సంఖ్యలో టేకు చెట్లు ఉండేవి. ప్రస్తుతం ఇవేమీ అంతగా కనిపించడం లేదు. వాస్తవానికి పునరావాస ప్రక్రియలో భాగంగా పరిహారం అందించేందుకు గాను ముంపు ప్రాంతంలో ఉన్న టేకు చెట్లనూ అటవీ శాఖ అధికారులు గతంలో లెక్కించారు. తోటలు, పొలాల గట్లపై ఉన్న ఒక్కో చెట్టుకు అడుగుల చొప్పున సంబంధిత రైతులకు 2017లో ప్రభుత్వం పరిహారం అందించింది. అనంతరం వీటిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని ప్రాజెక్ట్ నీటి పారుదల అధికారులకు అప్పగించారు. నిబంధనల ప్రకారం ఈ చెట్లకు వేలం పాట నిర్వహించి ఆ నగదును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను అధికారులు మరిచారు. ఏళ్ల తరబడి పర్యవేక్షణ కూడా లేకపోవడంతో పొలం గట్ల వెంట ఉన్న విలువైన చెట్లు ఇప్పుడు కనిపించకుండా పోయాయి. ఖరీదైన కలపగా పేరొందిన టేకును ఇలా విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ కలప విలువ రూ. లక్షలు...: అర్థవీడు మండల పరిధిలోని సాయినగర్, మొట్టిగొంది, లక్ష్మీపురం, కృష్ణానగర్ సమీప పొలాలు వెలిగొండ ప్రాజెక్ట్ ముంపులో ఉన్నాయి. ఈ నాలుగు గ్రామాల పరిధిలో 425 విలువైన టేకు చెట్లు ఉన్నట్టు 2018లో గుర్తించారు. మార్కాపురం గత డీఎఫ్వో ఖాదర్బాషా నేతృత్వంలో వీటి చుట్టు కొలతలను అటవీ శాఖ సిబ్బంది నమోదు చేశారు. వాటికి అప్పట్లో ఎర్ర రంగుతో సంఖ్యలు కూడా వేశారు. నిబంధనల ప్రకారం ఈ చెట్లకు వేలం నిర్వహించి వచ్చిన నగదును ప్రభుత్వ ఖాతాకు జమ చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ అయిదేళ్లుగా లేకపోయింది. అధికారుల పర్యవేక్షణ కూడా తగ్గిపోయింది. దీంతో నాణ్యమైన చెట్లన్నింటినీ గుర్తు తెలియని వ్యక్తులు నరికి అపహరించారు. ప్రస్తుతం పొలాల గట్లపై ఎండిన, సన్నటి చెట్లు తప్ప నాణ్యమైన, అప్పట్లో గుర్తించి సంఖ్యలు వేసినవీ ఒక్కటంటే ఒక్కటీ కనిపించడం లేదు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో చదరపు అడుగున్న టేకు కలప సుమారు రూ.వెయ్యి పలుకుతోంది. ఈ లెక్కన ఒకొక్క చెట్టు క్వింటాకు పైగా ఉంటుంది. అంటే రూ. లక్షల సొమ్మును ప్రభుత్వం కోల్పోయింది.
టేకు చెట్టు కొలతలు నమోదు చేసే ప్రక్రియను పర్యవేక్షిస్తున్న డీఎఫ్వో ఖాదర్బాషా (పాత చిత్రం)
చెట్ల చోరీపై పోలీసులకు ఫిర్యాదు...
టేకు చెట్ల కొనుగోలుకు మూడుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. బహిరంగ మార్కెట్ విలువతో కాకుండా అటవీ శాఖ విధించే కాంపోనెంట్ విలువతో కలపకు ధర నిర్ణయించడంతో ఆసక్తి చూపలేదు. మరోమారు అటవీ శాఖ ఆధ్వర్యంలో కొలతలు తీసి సరైన ధరలు ప్రకటించాల్సి ఉంది. కొందరు రైతులకు ఇంకా పరిహారం అందలేదు. దీంతో కొందరు రైతులు చెట్లను స్వాధీనం చేసుకోగా.. మరికొన్ని ఎండిపోయాయి. గతంలో గుర్తించిన చెట్లు కొన్ని చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాం.
రమణారెడ్డి, జేఈ, నీటి పారుదల విభాగం, వెలిగొండ ప్రాజెక్ట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.