వాలంటీర్లు ప్రచారం చేయడం లేదనే గృహ సారథులు
‘ప్రస్తుతం వాలంటీర్లు వచ్చిన తర్వాత పథకాలు ఎవరిస్తున్నారో ప్రజలకు చెప్పడంలేదు. అందుకోసమే గృహ సారథులను నియమిస్తున్నాం.
కనిగిరి ఎమ్మెల్యే బుర్రా వ్యాఖ్య
పీసీపల్లి, న్యూస్టుడే: ‘ప్రస్తుతం వాలంటీర్లు వచ్చిన తర్వాత పథకాలు ఎవరిస్తున్నారో ప్రజలకు చెప్పడంలేదు. అందుకోసమే గృహ సారథులను నియమిస్తున్నాం. వారు ప్రతి ఇంటికీ వెళ్లి పథకాలు వివరిస్తారు’ అంటూ కనిగిరి శాసనసభ్యుడు బుర్రా మధుసూదన్యాదవ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. పీసీపల్లిలోని వెలుగు కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన పార్టీ గృహ సారథుల శిక్షణ కార్యక్రమానికి బుర్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. అలాగే వెలిగండ్ల ఎంపీడీవో కార్యాలయం పైన సమావేశమందిరంలో నిర్వహించిన ఇదే తరహా కార్యక్రమంలోనూ ఆయన మాట్లాడుతూ గృహసారథులు, కన్వీనర్లు, వాలంటీర్లు సైన్యంలా పని చేసి రాబోయే ఎన్నికల్లో రెండోసారి జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. వాలంటీర్లు పూర్తిగా ప్రభుత్వం తరపున పనిచేసేవారే అయినా పార్టీ కార్యకర్తల మాదిరి వారిని భావించడం చర్చకు తావిచ్చింది. ఇక గుంటుపల్లిలో వైకాపాలోని ఇరువర్గాల మధ్య వివాదం నలుగుతుండటంతో పీసీపల్లి ఎంపీపీ కార్యాలయంలో వారితో బుర్రా సమావేశమయ్యారు. అక్కడి సచివాలయంలో పని చేస్తున్న ఓ అధికారి అసైన్మెంట్ స్థలానికి పట్టాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఎమ్మెల్యేకు వారు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అత్యాల జఫన్య, జట్పీటీసీ సభ్యురాలు లక్ష్మీకాంతం, వైకాపా నాయకులు బొర్రారెడ్డి, ఓకేరెడ్డి, సతీష్, జయరామిరెడ్డి, నరసింహం, వెంకటేశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మీరు ఎస్సైకి చెప్పండి.. ఇసుక తెచ్చుకుంటాం
‘అయ్యా, ఎమ్మెల్యే గారూ మీరేమీ అనుకోనంటే ఓ మాట చెబుతాం. ఇళ్లు కట్టుకోవాలంటే అందుబాటులో ఇసుక లేదు. నెల్లూరు నుంచి తెచ్చుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నాం. మీరు ఓ మాట ఎస్సై గారికి చెబితే... దగ్గరలోని వాగుల్లోంచి తెచ్చుకుంటాం.’...అని బుర్రా మధుసూదన్ యాదవ్తో పీసీపల్లి వైకాపా నాయకులు పేర్కొన్నారు. గతంలో అందుబాటులో ఉన్న ప్రాంతం నుంచి ఇసుక తెచ్చుకుని నిర్మాణాలు చేపట్టేవారమని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. వాగుల్లోంచి ఇసుక తెస్తే అధికారులు జరిమానాలు విధిస్తున్నారని తెలిపారు. పీసీపల్లికి దగ్గర్లో ఎక్కడా గుర్తింపు ఉన్న రీచ్ లేక... అధిక ధర వెచ్చించి నెల్లూరు నుంచి తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోయారు. మీరు (ఎమ్మెల్యే)... ఎస్సై, అధికారులకు చెబితే దగ్గర్లోని వాగుల నుంచి తెచ్చుకుంటామని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే ఎటువంటి సమాధానం ఇవ్వలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు