మృత్యువుతో పోరాడుతూ ఓడిన విద్యార్థిని
అనారోగ్యానికి గురైన కస్తూర్బా విద్యార్థిని చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి
సుప్రియ
దొనకొండ, న్యూస్టుడే: అనారోగ్యానికి గురైన కస్తూర్బా విద్యార్థిని చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు కోల్పోయింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దొనకొండ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన విప్పర్ల సుప్రియ (15)... దొనకొండ కస్తూర్బా విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లిన బాలిక... గత నెల 23న తిరిగి విద్యాలయానికి వచ్చింది. తరువాతి రోజు వాంతులై, జ్వరం రావడంతో పాఠశాల ఏఎన్ఎం మందులు ఇచ్చారు. సమస్య మరింత పెరగడంతో... 27వ తేదీన బాలిక తల్లిదండ్రులకు విద్యాలయం సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు ఆమెను మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఒంగోలు రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో... అదే రోజు రాత్రి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. 29న మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది. వాంతులు అయిన వెంటనే విద్యాలయం సిబ్బంది సమాచారం ఇచ్చి ఉంటే తమ బిడ్డ బతికేదని తల్లిదండ్రులు వాపోయారు. ఈ విషయమై విద్యాలయం ప్రత్యేక అధికారి అరుణ మాట్లాడుతూ... ఏఎన్ఎం మందులు ఇచ్చాక ఆరోగ్యం బాగానే ఉందని విద్యార్థిని చెప్పడంతోనే మూడు రోజులు ఉంచామన్నారు. పరిస్థితి మెరుగు పడకపోవటంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామన్నారు. బాలిక మృతి విషయమై స్టేషన్కు సమాచారం వచ్చిందని... ఘటపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఎస్సై సైదుబాబు తెలిపారు.
ద్విచక్ర వాహనం అదుపు తప్పి యువకుడి మృతి
కొండపి, న్యూస్టుడే: ద్విచక్ర వాహనం అదుపుతప్పిన ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నెన్నూరుపాడుకు చెందిన కొలకలూరి ప్రవీణ్ (21) అనే యువకుడు... ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బజారుకు వెళ్లాడు. స్థానిక సెల్టవర్ సమీపంలో అదుపు తప్పి పడిపోవడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. కుటుంబీకులు అతడిని మొదట కొండపి వైద్యశాలకు, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. చేతికి అందివచ్చిన కుమారుడు ఇలా మృతువాత పడడంతో తల్లిదండ్రులు ఏసురత్నం, ఏసమ్మ కన్నీరుమున్నీరుగా విలపించారు.
రైలు కిందపడి ఆత్మహత్య : ఒంగోలు నేరవిభాగం: రైలు కిందపడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఒంగోలు స్టేషన్కు దక్షిణం వైపున చోటుచేసుకుంది. సుమారు 30 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని యువకుడు రామ్నగర్ ఆరోలైను సమీపంలో రైలు కిందపడి మృతి చెందాడు. సోమవారం ఉదయం రైల్వే సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించి ఒంగోలు జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడ్ని గుర్తించేందుకు సంఘటనాస్థలంలో ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని ఒంగోలు జీజీహెచ్ శవాగారంలో భద్రపరిచారు. జీఆర్పీ ఏఎస్సై ఎ.నర్సింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ