logo

సమష్టి కృషితో లోక్‌ అదాలత్‌లు విజయవంతం

ఈ నెల 11న జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ లోక్‌ అదాలత్‌ విజయవంతానికి సమష్టిగా కృషి చేద్దామని ఇన్‌ఛార్జి జిల్లా జడ్జి ఆర్‌. శివకుమార్‌ తెలిపారు.

Published : 08 Feb 2023 03:01 IST

జిల్లా జడ్జి ఆర్‌.శివకుమార్‌

ఒంగోలు న్యాయ విభాగం, న్యూస్‌టుడే: ఈ నెల 11న జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ లోక్‌ అదాలత్‌ విజయవంతానికి సమష్టిగా కృషి చేద్దామని ఇన్‌ఛార్జి జిల్లా జడ్జి ఆర్‌. శివకుమార్‌ తెలిపారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ నిర్దేశం మేరకు లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నామన్నారు. న్యాయస్థానాలలో అపరిష్కృతంగా ఉన్న అన్ని రకాల సివిల్‌, రాజీ పడదగిన క్రిమినల్‌, మోటారు వాహన ప్రమాద పరిహారం కేసులు, చెల్లని చెక్కు కేసులు ఉంటాయన్నారు. ఇరువర్గాల కక్షిదారుల ఆమోదంతో పరిష్కరిస్తామన్నారు. దీనిపై న్యాయవాదులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర విభాగాల అధికారులతో సమావేశాలు నిర్వహించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని