గిరిజనులకు పథకాలు చేరువయ్యేలా చర్యలు
గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభా రవిబాబు ఆదేశించారు.
రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రవిబాబు
దిగువమెట్ట ఎరుకలకాలనీలో బుట్టలు అల్లుతున్న వృద్ధునితో మాట్లాడుతున్న రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా.కె.రవిబాబు, సభ్యులు
గిద్దలూరు పట్టణం, న్యూస్టుడే : గిరిజనులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభా రవిబాబు ఆదేశించారు. ఆయనతో పాటు కమిషన్ సభ్యులు మంగళవారం ఉదయం గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామంలోని ఎరుకలకాలనీ, చెంచుకాలనీలను సందర్శించారు. దిగువమెట్ట రైల్వేస్టేషన్ ఆవల 18 ఎస్టీ కుటుంబాలు ఉన్నప్పటికీ వారికి మౌలిక వసతులు ఎందుకు కల్పించలేకపోయారని అధికారులను ప్రశ్నించారు. చెంచుకాలనీలో సుమారు 72 మంది చిన్నారులు ఉన్నా పాఠశాలకు కేవలం 8 మంది మాత్రమే వస్తున్నారని, మిగతావారు ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలు లేక రాలేకపోతున్నట్లు తెలిసిందన్నారు. వాటిని ఎందుకు అందించలేకపోయారంటూ అధికారులపై అసంతృప్తి వ్యక్తంచేశారు. రాచర్ల మండలం జేపీ చెరువులోని అంబచెరువు ప్రాంతంలో తాము నివాసముంటున్నామని, గతంలో తమకు కేటాయించిన స్థలాలు నేటికీ అప్పగించలేదని చెంచులక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేశారు. రాచర్ల మండల రెవెన్యూ అధికారులకు ఎస్టీ కమిషన్ ద్వారా సమన్లు జారీ చేస్తామని రవిబాబు అన్నారు. మండల ప్రాథమిక వివరాలు లేకుండా ఎలా వచ్చారంటూ తహసీల్దార్, ఎంఈవో, గృహనిర్మాణశాఖ అధికారులను ప్రశ్నించారు. దిగువమెట్టలో కొన్నేళ్లుగా అడవిలో వెదురు బొంగులు సేకరించి జీవనం సాగిస్తున్నామని, అటవీశాఖ అధికారులు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ వై.వి.నరసింహరావు సమాధానమిస్తూ వెదురు బొంగులు ఉండే ప్రాంతాన్ని అభయారణ్య పరిధిలో మినహాయించాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. గిద్దలూరు మండలంలో గిరిజన ఆశ్రమ పాఠశాలకు ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని సంక్షేమ అధికారికి ఛైర్మన్ సూచించారు. ఎస్టీ కమిషన్ సభ్యులు వి.శంకర్నాయక్, జంపరంగి సురేష్ లిల్లీ, మురళీ, జిల్లా గిరిజిన సంక్షేమాధికారి పి.జగన్నాథరావు, గిద్దలూరు ఇన్ఛార్జ్ తహసీల్దార్ రమాదేవి, పంచాయతీరాజ్ ఈఈ రమేష్, పట్టుపరిశ్రమశాఖ జిల్లా అధికారి ఎ.బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా