నాడు-నేడు పనులు వేగవంతం చేయండి
జిల్లాలో నాడు-నేడు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవన్ నుంచి అన్ని మండలాల అధికారులతో మంగళవారం వీక్షణ సమావేశం నిర్వహించారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ దినేష్కుమార్.. చిత్రంలో డ్వామా పీడీ శీనారెడ్డి, అధికారులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: జిల్లాలో నాడు-నేడు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవన్ నుంచి అన్ని మండలాల అధికారులతో మంగళవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. పాఠశాలలకు కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలన్నారు. నిర్మాణాలకు సంబంధించిన సామగ్రి అవసరాన్ని బట్టి ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు ఇవ్వాలని సూచించారు. బిల్లులను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు. స్పందనలోని అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. గడప, గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల షెడ్లను మండల అధికారులు తనిఖీలు చేయాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన విద్యార్థులంతా ప్రతి రోజూ హాజరయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు. హాజరు తక్కువగా ఉన్న పాఠశాలలను పర్యవేక్షకులు తనిఖీలు చేసి అందుకు గల కారణాలపై నివేదిక పంపాలని ఆదేశించారు. సీపీవో వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ శీనారెడ్డి, గృహనిర్మాణశాఖ జిల్లా అధికారి పేరయ్య, డీఈవో విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు...
రెవెన్యూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలోని మండల, డివిజన్ అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. ఇళ్ల పట్టాల ఆడిట్, సాదా బైనామాలు, వ్యవసాయేతర భూమిగా మార్పిడి, 22(ఏ) భూ సమస్యల పరిష్కారంలో నిబంధనల మేరకు పనిచేయాలన్నారు. మార్కాపురం ఉపకలెక్టర్ సేతు మాధవన్, డీఆర్వో ఓబులేసు, ఎస్డీసీ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు