బలిపీఠంపై బాల్యం
కొత్తపట్నం మండలం అల్లూరు ఎస్సీ కాలనీకి చెందిన 17 సంవత్సరాల బాలికకు గతేడాది టంగుటూరుకు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. ఈ బాల్య వివాహంపై సమాచారం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది చైల్డ్లైన్తోపాటు, పోలీసులకు సమాచారం అందించారు.
18 లోపే పడుతున్న మూడుముళ్లు
జిల్లాలో 37 శాతం నమోదు
* కొత్తపట్నం మండలం అల్లూరు ఎస్సీ కాలనీకి చెందిన 17 సంవత్సరాల బాలికకు గతేడాది టంగుటూరుకు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. ఈ బాల్య వివాహంపై సమాచారం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది చైల్డ్లైన్తోపాటు, పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి నిలిపివేయించారు. ముహూర్తం రోజున వరుడు ఇంటి వద్ద టంగుటూరు పోలీసులను రక్షణగా ఉంచారు. తర్వాతి రోజు బాలికను కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతానికి తీసుకెళ్లి దగ్గరి బంధువులకు ఇచ్చి వివాహం జరిపించారు. సదరు బాలిక గర్భం దాల్చడంతో అల్లూరు తీసుకొచ్చారు. గర్భవతులకు సూచనలు అందించేందుకు ఏఎన్ఎం సచివాలయ రిజిస్టర్లో వయసుతోపాటు, పేరు నమోదు చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా వెళ్లిన కలెక్టర్ దినేష్కుమార్.. రిజిస్టర్ చూసి బాల్య వివాహం పట్ల సిబ్బందిని ప్రశ్నించారు.
* వెలిగండ్ల మండలం ఇమ్మడిచెరువు గ్రామానికి చెందిన 13 సంవత్సరాల బాలికకు వివాహం జరిపించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న చైల్డ్లైన్ సిబ్బంది గత నెల 23న పోలీసుల ద్వారా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. తద్వారా వివాహాన్ని అడ్డుకున్నారు.
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: పాఠశాలలు, కళాశాలల్లో స్వేచ్ఛగా చదువుకోవాల్సిన బాలికల మెడలో పుస్తెల తాళ్లు పడుతున్నాయి. 18 ఏళ్లలోపు పెళ్లి చేస్తే శారీరకంగా, మానసికంగా చిక్కులు ఎదుర్కొంటారని.. తామే ఎదగాల్సిన సమయంలో కడుపులో బిడ్డను మోయడం అనేక సమస్యలకు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నా అనేకమంది పెడచెవిన పెడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చైల్డ్లైన్కు అందే ఫిర్యాదులతో కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. బయటకు తెలియనివి మరెన్నో. బాల్య వివాహాల నియంత్రణపై కలెక్టర్ దినేష్కుమార్ పలు దఫాలు సమీక్షలు నిర్వహించారు. వాటిని అరికట్టేందుకు పదో తరగతి పూర్తయిన తర్వాత సదరు బాలికలు ఇంటర్, ఇతరత్రా కోర్సుల్లో ప్రవేశాలు పొందారా..లేదా అనేది విద్యాశాఖ అధికారులతో సర్వే చేయించారు. ఏదో ఒక ప్రాంతంలో వెలుగు చూస్తూనే ఉన్నాయి.
సర్వే ఏం తేల్చిందంటే..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో భాగంగా నమోదైన కుటుంబాల్లోని వివరాల ప్రకారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 18 సంవత్సరాలు నిండక ముందే 37 శాతం మంది బాలికలకు వివాహాలు జరుగుతున్నాయి మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారుల గణాంకాల ప్రకారం రాష్ట్రంలోనే అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్న జిల్లాల్లో అనంతపురం ప్రథమస్థానంలో ఉండగా, ప్రకాశం ద్వితీయ స్థానంలో ఉంది. 19 సంవత్సరాల లోపువారిలో 15 శాతం మంది గర్భం దాల్చుతున్నారు. తక్కువ వయసులో పెళ్లిళ్లు జరుగుతున్న నేపథ్యంలో వారిలో రక్తహీనత సమస్య అధికంగా ఉంది.
ఎవరికి సమాచారం ఇవ్వాలంటే...
ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసు అధికారులకు టోల్ ఫ్రీ నంబరు 100.. మహిళా, శిశు సంక్షేమశాఖ సంచాలకులు, ఐసీడీఎస్, చైల్డ్లైన్ 1098, మహిళా హెల్ప్లైన్ 181 నంబరుతో పాటు తహసీల్దార్, సీడీపీవో, వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలకు సమాచారం అందించవచ్చు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతారు.
బాల్య వివాహాల నియంత్రణకు చర్యలు
- దినేష్కుమార్, జిల్లా బాలల సంరక్షణ అధికారి
బాల్య వివాహాలు చట్ట రీత్యా నేరం. పెళ్లి చేసినా, ప్రోత్సహించినా రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా ఉంటుంది. ఇటువంటి వివాహాలు జరిపిస్తున్న వారిని ముందే గుర్తించి ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. దురాచారాన్ని రూపుమాపడంలో విద్యా వంతులు భాగస్వాములు కావాలి. తమకు పెళ్లి వద్దు..చదువు కావాలని బాలికలు ప్రశ్నించాలి. 18 ఏళ్లు నిండిన తర్వాతనే ఆడబిడ్డలకు వివాహం చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?