వేతనం ఎప్పుడొచ్చేను!
ఒంగోలుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి సొంతిల్లు నిర్మాణ నిమిత్తం బ్యాంకులో రుణం తీసుకున్నారు. ప్రతి నెలా అయిదో తేదీలోపు ఈఎంఐ రూ.40 వేల చొప్పున చెల్లించాలి.
వివిధ శాఖల ఉద్యోగుల ఎదురుచూపులు
ఒంగోలుకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి సొంతిల్లు నిర్మాణ నిమిత్తం బ్యాంకులో రుణం తీసుకున్నారు. ప్రతి నెలా అయిదో తేదీలోపు ఈఎంఐ రూ.40 వేల చొప్పున చెల్లించాలి. ముందస్తుగా ఆయన చెక్కు ఇచ్చారు. గడువులోపు చెల్లించకుంటే అదనంగా రూ.500 జరిమానాతోపాటు, క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. గతేడాదిగా జీతాల సమస్య నెలకొనడంతో స్నేహితుల వద్ద సర్దుబాటు నిమిత్తం తీసుకుని ఖాతాలో నిల్వ ఉంచుతున్నారు. ప్రతి నెలా ఇదో సమస్యగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ఉద్యోగులు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతి నెలా ఒకటో తేదీన వేతనం వస్తుందన్న పరిస్థితి మారిపోయింది. ఈ నెల 8వ తేదీ గడిచినా పలు కీలకశాఖలకు చెందిన ఉద్యోగులకు జమకాలేదు. జిల్లాలో 72 శాఖలకు చెందిన సుమారు 40 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అందులో గరిష్ఠంగా ఏడు వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఆ తర్వాత రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసు, వైద్య, వ్యవసాయ, ఇంజినీరింగ్ విభాగాల్లో ఎక్కువమంది కనిపిస్తారు. వీరందరికీ ప్రతి నెల వేతనాల చెల్లింపు నిమిత్తం సుమారు రూ.200 కోట్ల నిధులు అవసరం. గతేడాదిగా ఉద్యోగులకు జీతాల చెల్లింపులో రోజుల తరబడి జాప్యం జరుగుతూనే ఉంది. ప్రాధాన్యతా క్రమంలో తొలుత ఖజానాశాఖతో పాటు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, పోలీసు, రెవెన్యూ శాఖకు క్రమం తప్పకుండా వేతనాలు జమవుతున్నాయి. ఇప్పటికీ వేతనాలు అందని ఉద్యోగుల్లో ఉపాధ్యాయ, పశు సంవర్ధకశాఖ, పరిశ్రమలు, సెరికల్చర్, ఇంజినీరింగ్, జలవనరులు, జిల్లా యువజన సంక్షేమ, జిల్లా పౌరసరఫరాలు, భూ సేకరణ విభాగం తదితర శాఖలవారు ఉన్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా సుమారు 18 వేల మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. వారికి ఒకటో తేదీనే పెన్షన్లు జమ కావడం కాస్త ఊరట.
రుణం లభించక
బ్యాంకుల నుంచి గృహ, వాహన, వ్యక్తిగత, పిల్లలకు విద్యా రుణాలు తీసుకున్న ఉద్యోగులు ఈంఎఐల చెల్లింపులకు అయిదో తేదీ గడువు పెట్టుకుంటారు. పదో తేదీ దాటే వరకు జీతం రాకపోవడంతో వడ్డీ భారం పడుతుందని వాపోతున్నారు. మరోవైపు ఇంటి అద్దె, పాలు, నిత్యావసరాలు, ఔషధాలు, విద్యుత్తు బిల్లు తదితర ఖర్చులకు చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. రుణాలు దొరకడమూ కష్టమైంది.
ఒకటో తేదీనే చెల్లించాలి
నెలంతా పనిచేస్తాం. ఒకటో తేదీనే వేతనం తీసుకోవడం ఉద్యోగి హక్కు. పదో తేదీ వరకు సగం శాఖలకు చెందిన ఉద్యోగులకు ఇవ్వకపోతే ఇంటి నిర్వహణ ఎలా? పైగా బ్యాంకులో తీసుకున్న గృహ, వ్యక్తిగత రుణాలకు నెలవారీ ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. వాటిపైనా ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో బ్యాంకర్లు రుణం ఇచ్చేందుకు అడ్డంకిగా మారుతుంది.
రోజ్కుమార్, ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ