నగ్నచిత్రాలు తీసి వేధింపులు
మనస్తాపంతో పురుగుల మందు తాగి ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని గత నెలలో ఆత్మహత్య చేసుకోగా.. ఘటన వెనుక ఓ యువకుడి వేధింపులే కారణమన్న అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వెలుగులోకి వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఉదంతం
యువకుడిపై కేసు నమోదు
ముండ్లమూరు, న్యూస్టుడే: మనస్తాపంతో పురుగుల మందు తాగి ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని గత నెలలో ఆత్మహత్య చేసుకోగా.. ఘటన వెనుక ఓ యువకుడి వేధింపులే కారణమన్న అంశం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. ముండ్లమూరు స్టేషన్ ఎస్సై ఎల్.సంపత్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ముండ్లమూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని (17) విశాఖపట్నంలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థిని గత నెల 13వ తేదీన పురుగుల మందు తాగింది. దీంతో ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించగా.. అక్కడి వైద్యుల సూచనతో మెరుగైన చికిత్స కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో 15వ తేదీన విద్యార్థిని మృతిచెందారు. ఇటీవల ఆమె చరవాణిని కుటుంబ సభ్యులు పరిశీలించగా మల్లికార్జునరెడ్డి అనే యువకుడి నంబరు ఉండటంతో అతడిని ప్రశ్నించారు. తాను అదే గ్రామానికి చెందిన సీహెచ్ వెంకటనారాయణరెడ్డి ఫోన్ చేయమంటే విద్యార్థినికి చేశానని మల్లికార్జున్రెడ్డి తెలిపాడు. విజయవాడలో ఇంజినీరింగ్ చదివే వెంకట నారాయణరెడ్డి విశాఖలో విద్యార్థిని ఉంటున్న వసతి గృహం వద్దకు వెళ్లి ఆమెను బయటకు రప్పించాడు. తమ గ్రామానికి చెందినవాడే కావడంతో విద్యార్థిని మాట్లాడారు. మాయమాటలతో సమీపంలోని లాడ్జికి తీసుకువెళ్లి నగ్న చిత్రాలు, వీడియోలు తీసి ఈ విషయం ఎవరికైనా చెబితే యూట్యూబ్లో పెడతానని బెదిరించాడని తెలిపారు. మానసికంగా కుంగిపోయిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. వెంకట నారాయణరెడ్డిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
[ 20-04-2024]
ఎన్నికల కోడ్కు ముందు మార్కాపురం మున్సిపాలిటీలోని ఆ కీలక పోస్టు ఖాళీ అయ్యింది. -
యాక్టర్ జగన్
[ 20-04-2024]
ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు మిలటరీ కాలనీకి చెందిన రమణమ్మ అనే మహిళ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది. పదో వారంలో వ్యాక్సిన్ వేయించడానికి పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది స్టాక్ లేదని చెప్పారు. -
కిరాయికి కేటుగాళ్లు
[ 20-04-2024]
ఒకప్పుడు జిల్లాలో విధులు నిర్వహించిన పోలీసు అధికారులు వాళ్లు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి ఖాళీగా ఉన్నారు. ఇటువంటి వారితో అధికార పార్టీ కొత్త కుట్రలకు తెర లేపింది. -
అడవిలో ఇళ్లిచ్చిన అన్న
[ 20-04-2024]
నవరత్నాలు..పేదలందరికీ ఇళ్లు అంటూ జగన్ ప్రకటనతో మురిసిపోయిన వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ముఖ్యమంత్రి చెప్పిన మర్మం అయిదేళ్ల తర్వాత తెలియడంతో వారంతా ఖిన్నులయ్యారు. -
రాజుకున్న ఎన్నికల వేడి
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. నామినేషన్ల పర్వం రెండో రోజైన శుక్రవారం.. భారీ ప్రదర్శనలతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. -
రగడ.. ఇదేం మర్యాద
[ 20-04-2024]
క్రమశిక్షణకు మారుపేరుగా ప్రభుత్వం చెబుతున్న ట్రిపుల్ఐటీలో పరిస్థితులు అదుపు తప్పాయి. -
వైభవం.. రాములోరి రథోత్సవం
[ 20-04-2024]
శ్రీరామ నవమి నాటి నుంచి మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. -
ఒట్టు పెడుతున్నాం.. ఓటు వినియోగించుకుంటాం
[ 20-04-2024]
స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లోని ఉద్యోగులు, కార్మికులకు శుక్రవారం అవగాహన నిర్వహించారు. -
నగదు చోరీలో ఇంటి దొంగలు
[ 20-04-2024]
ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద సీఎంఎస్ వాహనం నుంచి గురువారం చోరీకి గురైన రూ.66 లక్షల నగదు కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. -
నామినేషన్ల వేళ.. తీరుమారని వైకాపా
[ 20-04-2024]
గిద్దలూరు నగర పంచాయతీలో శుక్రవారం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి నామినేషన్ సందర్భంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేపట్టడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
‘సొంత చెల్లినే గెంటేసిన వ్యక్తి జగన్’
[ 20-04-2024]
కష్టకాలంలో తనను ఆదుకున్న సొంత చెల్లినే బయటకు గెంటేసిన వ్యక్తి సీఎం జగన్ అని తెదేపా జోన్-4 పరిశీలకుడు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి వివరించారు. -
నామపత్ర సంబరం
[ 20-04-2024]
నామపత్రాల సమర్పణకు శుక్రవారం సుమూహూర్తం కావడంతో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. -
కోలాహలంగా ఎరిక్షన్బాబు నామినేషన్
[ 20-04-2024]
యర్రగొండపాలెం తెదేపా ఉమ్మడి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు శుక్రవారం నామినేషన్ వేశారు. -
వీధిన పడ్డ బతుకులు
[ 20-04-2024]
ఈ అయిదేళ్ల వైకాపా పరిపాలనలో పేద, మధ్య తరగతుల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. -
తెదేపాలో చేరికల ఉత్సాహం
[ 20-04-2024]
దర్శి తెదేపాలో చేరికల జోరు కొనసాగుతోంది. పలువురు నాయకులు, కార్యకర్తలు అధికార వైకాపాను వీడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు