దూసుకొచ్చిన మృత్యువు
అమరావతి-అనంతపురం జాతీయ రహదారిలో సంతమాగులూరు మండలం పాతమాగులూరు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
రైతు, వాహనచోదకుడు దుర్మరణం
ప్రమాదానికి గురైన వాహనం
సంతమాగులూరు, పెద్దారవీడు, న్యూస్టుడే: అమరావతి-అనంతపురం జాతీయ రహదారిలో సంతమాగులూరు మండలం పాతమాగులూరు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. పండించిన మిరపకాయలను గుంటూరు తీసుకువెళ్లి తిరుగు ప్రయాణమైన ఓ రైతు, మినీ వాహనం చోదకుడు ఈ ప్రమాదంలో మృతిచెందారు. ఎస్సై పి.నాగశివారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దారవీడు మండలం కంభంపాడు పంచాయతీ మల్లవరానికి చెందిన మిరప రైతు కోలగొట్ల వెంకటేశ్వరరెడ్డి (52), బోలెరో మినీ వాహనం చోదకుడు దుగ్గెంపూడి వెంకటేశ్వర్లు (35) ఎండు మిరపకాయలను గుంటూరులోని కోల్డ్ స్టోరేజ్లో భద్రపరిచేందుకు మంగళవారం రాత్రి లోడు వేసుకొని వెళ్లారు. పని పూర్తయిన వెంటనే తిరిగి మినీ వాహనంలో స్వగ్రామానికి బయలు దేరారు. బుధవారం తెల్లవారుజామున పాతమాగులూరు సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న గుంతకల్లు డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి వీరి వాహనాన్ని ఢీకొంది. ఇద్దరూ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్సై, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. మృతుని బంధువు కె.వెంకట్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆధారం కోల్పోయిన కుటుంబాలు
రైతు వెంకటేశ్వరరెడ్డి మూడు ఎకరాల్లో మిరప సాగుచేస్తున్నారు. ఎనిమిది క్వింటాళ్ల కాయలను గుంటూరు తీసుకువెళ్లారు. ఇంటికి తిరిగి వస్తున్న ఈ క్రమంలో మృత్యువుకు చిక్కాడని తెలియడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వాహన చోదకుడు వెంకటేశ్వర్లుకు భార్య, కుమారుడు ఉన్నారు. కుటుంబాలకు ఆధారమైనవారు తరలిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఇక తమకు దిక్కెవరంటూ వారు తల్లడిల్లారు.
దుగ్గెంపూడి వెంకటేశ్వర్లు
కోలగొట్ల వెంకటేశ్వరరెడ్డి (పాతచిత్రాలు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా