చుక్కల భూములకు తొలగిన చిక్కులు
ఒంగోలు మండలం మామిడిపాలెం గ్రామంలోని ఓ రైతుకు చెందిన రెండెకరాల విస్తీర్ణాన్ని వెబ్ల్యాండ్లో చుక్కల భూమిగా చూపడంతో నిషేధిత జాబితాలో చేర్చారు. 2020లో ఆయన కూతురుకు వివాహం కుదిరింది.
జిల్లాలో 17,522 మంది రైతులకు ఉపశమనం
కొత్తపట్నం, న్యూస్టుడే:
ఒంగోలు మండలం మామిడిపాలెం గ్రామంలోని ఓ రైతుకు చెందిన రెండెకరాల విస్తీర్ణాన్ని వెబ్ల్యాండ్లో చుక్కల భూమిగా చూపడంతో నిషేధిత జాబితాలో చేర్చారు. 2020లో ఆయన కూతురుకు వివాహం కుదిరింది. ఆ సమయంలో పెళ్లి ఖర్చుల కింద విక్రయించేందుకు సిద్ధమయ్యారు. చుక్కుల భూమిగా నమోదు కావడంతో రిజిస్ట్రేషన్ నిలిచి పోయింది. రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. దీంతో బాధిత రైతు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది.
భూమి వారిదే. అందుకు సంబంధించిన పత్రాలూ ఉన్నాయి. అయినా హక్కులు సంపాదించుకునేందుకు తహసీల్దార్ కార్యాలయాల దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు కాళ్లరిగేలా తిరిగారు. కారణం నిషేధిత భూముల జాబితాలో నమోదు కావడమే. పిల్లల ఉన్నత చదవుల నిమిత్తమో, అమ్మాయిల వివాహ ఖర్చుల కోసమో, వైద్యచికిత్సల వ్యయానికో ఎవరికైనా అమ్ముదామన్నా... ఇల్లు కట్టుకునేందుకు లేదా పంట రుణం తీసుకోవడానికి బ్యాంకులకు వెళ్లినా నిరాశ ఎదురయ్యేది. ఏళ్ల తరబడి ప్రదక్షిణలు చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం ఏదోఒక సాకుతో కాలయాపన చేయడమో తిరస్కరించడమో చేశారు. వెబ్ల్యాండ్లో చుక్కల భూములుగా చూపుతుండటంతో రైతులు వాటిని అమ్ముకోవాలన్నా రిజిస్ట్రేషన్లు అవ్వక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఈ వెతలు తీరనున్నాయి.
2008 నుంచి రిజిస్ట్రేషన్ల నిలిపివేత...: బ్రిటిష్ పాలకుల ఆధ్వర్యంలో 1902 నుంచి 1906వ సంవత్సరం వరకు రీ సెటిల్మెంట్ రిజిస్టర్(ఆర్ఎస్ఆర్) రూపొందించారు. ఆ సమయంలో సాగులో లేని, యజమానులు అందుబాటులో లేని భూములను ఆర్ఎస్ఆర్లో నమోదు చేసేటప్పుడు సంబంధిత హక్కుదారుల పేర్లకు బదులు చుక్కలు(డాట్స్) పెట్టారు. వీటిని క్రమంగా కొంతమంది తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. మరికొన్ని భూములకు ప్రభుత్వం డీకే పట్టాలిచ్చింది. కాలక్రమేణా వాటికి రిజిస్ట్రేషన్లు చేయడం, రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయడం, రిజిస్ట్రేషన్లు కూడా కావడంతో అవి సాధారణ భూములుగానే మారిపోయాయి. అమ్మడానికి వీల్లేని డీకే పట్టా, గిరిజన, దేవాదాయ, వక్ఫ్బోర్డు, అసైన్డ్ భూముల వివరాలను 1908 భూ చట్టం ప్రకారం 2007లో 22ఏ జాబితాలో చేర్చారు. 2008 తర్వాత భూముల ఆన్లైన్ విధానం రావడంతో ఆర్ఎస్ఆర్లో చుక్కలున్న భూముల రిజిస్ట్రేషన్ను ప్రభుత్వం నిలిపివేసింది. నిషేధిత భూముల జాబితాలను తహసీల్దార్లు సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పంపారు. అప్పటివరకు క్రయవిక్రయాలు సాగినప్పటికీ.. ఆ తర్వాత నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో 2017 జూన్ 13కు ముందు 12 ఏళ్లు అనుభవంలో ఉన్న రైతులకు ఆ భూమిపై శాశ్వత హక్కు కల్పించి వారి పేర్లు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొందరు రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు.
కలెక్టరేట్లో కసరత్తు మొదలు...
ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్లు కాకుండా... జిల్లా వ్యాప్తంగా చుక్కల భూములతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఎట్టకేలకు ఉపశమనం కలగనుంది. తాజాగా జిల్లాలోని చుక్కల భూముల రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు అధికారాలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా జిల్లాలోని 17,522 మంది రైతులకు సుమారు 37 వేల ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి చిక్కులు తొలగనున్నాయి. సదరు భూములపై రెవెన్యూ కార్యాలయాలతో పాటు, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోనూ గెజిట్ ఇవ్వనున్న నేపథ్యంలో వెబ్ల్యాండ్లో పట్టా భూములుగా మారుస్తూ సంబంధిత రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించనున్నారు. ఈ ప్రక్రియ వెంటనే అమలులోకి వచ్చేలా కలెక్టరేట్లోని రెవెన్యూ అధికారులు కసరత్తు ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
[ 20-04-2024]
ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు మిలటరీ కాలనీకి చెందిన రమణమ్మ అనే మహిళ ఇటీవల బిడ్డకు జన్మనిచ్చింది. పదో వారంలో వ్యాక్సిన్ వేయించడానికి పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా.. అక్కడి సిబ్బంది స్టాక్ లేదని చెప్పారు. -
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు
[ 20-04-2024]
ఎన్నికల కోడ్కు ముందు మార్కాపురం మున్సిపాలిటీలోని ఆ కీలక పోస్టు ఖాళీ అయ్యింది. -
కిరాయికి కేటుగాళ్లు
[ 20-04-2024]
ఒకప్పుడు జిల్లాలో విధులు నిర్వహించిన పోలీసు అధికారులు వాళ్లు. ప్రస్తుతం ఉద్యోగ విరమణ చేసి ఖాళీగా ఉన్నారు. ఇటువంటి వారితో అధికార పార్టీ కొత్త కుట్రలకు తెర లేపింది. -
అడవిలో ఇళ్లిచ్చిన అన్న
[ 20-04-2024]
నవరత్నాలు..పేదలందరికీ ఇళ్లు అంటూ జగన్ ప్రకటనతో మురిసిపోయిన వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ముఖ్యమంత్రి చెప్పిన మర్మం అయిదేళ్ల తర్వాత తెలియడంతో వారంతా ఖిన్నులయ్యారు. -
రాజుకున్న ఎన్నికల వేడి
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. నామినేషన్ల పర్వం రెండో రోజైన శుక్రవారం.. భారీ ప్రదర్శనలతో జిల్లా వ్యాప్తంగా సందడి నెలకొంది. -
రగడ.. ఇదేం మర్యాద
[ 20-04-2024]
క్రమశిక్షణకు మారుపేరుగా ప్రభుత్వం చెబుతున్న ట్రిపుల్ఐటీలో పరిస్థితులు అదుపు తప్పాయి. -
వైభవం.. రాములోరి రథోత్సవం
[ 20-04-2024]
శ్రీరామ నవమి నాటి నుంచి మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో నిర్వహిస్తున్న ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. -
ఒట్టు పెడుతున్నాం.. ఓటు వినియోగించుకుంటాం
[ 20-04-2024]
స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మద్దిపాడు మండలం గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్లోని ఉద్యోగులు, కార్మికులకు శుక్రవారం అవగాహన నిర్వహించారు. -
నగదు చోరీలో ఇంటి దొంగలు
[ 20-04-2024]
ఒంగోలు కర్నూలు రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద సీఎంఎస్ వాహనం నుంచి గురువారం చోరీకి గురైన రూ.66 లక్షల నగదు కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ తెలిపారు. -
నామినేషన్ల వేళ.. తీరుమారని వైకాపా
[ 20-04-2024]
గిద్దలూరు నగర పంచాయతీలో శుక్రవారం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కుందురు నాగార్జునరెడ్డి నామినేషన్ సందర్భంగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేపట్టడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. -
‘సొంత చెల్లినే గెంటేసిన వ్యక్తి జగన్’
[ 20-04-2024]
కష్టకాలంలో తనను ఆదుకున్న సొంత చెల్లినే బయటకు గెంటేసిన వ్యక్తి సీఎం జగన్ అని తెదేపా జోన్-4 పరిశీలకుడు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి వివరించారు. -
నామపత్ర సంబరం
[ 20-04-2024]
నామపత్రాల సమర్పణకు శుక్రవారం సుమూహూర్తం కావడంతో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. -
కోలాహలంగా ఎరిక్షన్బాబు నామినేషన్
[ 20-04-2024]
యర్రగొండపాలెం తెదేపా ఉమ్మడి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు శుక్రవారం నామినేషన్ వేశారు. -
వీధిన పడ్డ బతుకులు
[ 20-04-2024]
ఈ అయిదేళ్ల వైకాపా పరిపాలనలో పేద, మధ్య తరగతుల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. -
తెదేపాలో చేరికల ఉత్సాహం
[ 20-04-2024]
దర్శి తెదేపాలో చేరికల జోరు కొనసాగుతోంది. పలువురు నాయకులు, కార్యకర్తలు అధికార వైకాపాను వీడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?