పశ్చిమంలో మట్టి మాఫియా
అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ భూములు, కుంటలు, దేవస్థానం స్థలాల్లో మట్టి తవ్వకాలు చేసి ఆర్జిస్తున్నారు.
కరిగిపోతున్న కొండలు, మాయమవుతున్న కుంటలు
కోలభీమునిపాడు సమీప ముద్దసానమ్మగండి వద్ద తవ్వకాలతో కొండ ఇలా..
మార్కాపురం, న్యూస్టుడే:
అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ భూములు, కుంటలు, దేవస్థానం స్థలాల్లో మట్టి తవ్వకాలు చేసి ఆర్జిస్తున్నారు. ఈ ఉదంతాలపై ఫిర్యాదులు చేస్తే అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. మార్కాపురం మండలంలోని వేములకోట- నికరంపల్లె ఆయకట్టు చెరువు, గోగులదిన్నె శివారులోని ప్రభుత్వ భూములు, తర్లుపాడు మండలం సీతానాగులవరం కొండ ప్రాంతం.. పోతలపాడు, గానుగపెంట గ్రామాల సమీపంలో అక్రమ మట్టి వ్యాపారం జోరుగా సాగుతోంది. రాయవరం, నాయుడుపల్లె చెరువులు, దరిమడుగు- ఇడుపూరు ఇలాకాలోని మహమ్మద్ సాహెబ్ కుంట, కోలభీమునిపాడు దరి ముద్దసానమ్మగండి వద్ద ఉన్న కొండ, కలనూతల పునరావాస గ్రామ సమీపంలోని కొండ చూస్తుండగానే ధ్వంసమవుతున్నాయి. రాత్రి 10 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 6 వరకు టిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. రోజూ రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సంపాదిస్తున్నారు. దీంతో కొండలు కరిగిపోతుండగా చెరువులు రూపు కోల్పోతున్నాయి. ఎక్కడికక్కడ ప్రమాదకరంగా గుంతలు కనిపిస్తున్నాయి.
టిప్పర్కు రూ.5 వేలు..
మార్కాపురం పట్టణంతో పాటు మండలంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తి వెంచర్లు అధికంగా ఉన్నాయి. వీటితో పాటు ఇళ్ల నిర్మాణాలు చేసేవారి కోసం అక్రమార్కులు ఒప్పందాలు కుదుర్చుకొని మట్టి అందిస్తున్నారు. చెరువు మట్టి అయితే టిప్పర్కు రూ.3 వేలు, కొండ మట్టికి రూ.5వేలు వసూలు చేస్తున్నారు. అదే చెరువు మట్టి ట్రాక్టరు లోడుకు రూ.1500 తీసుకుంటున్నారు. మార్కాపురం భూగర్భగనులశాఖ కార్యాలయంలో ఏడీ, ఒక్క ఆర్ఐ మాత్రమే ఉన్నారు. దాడులు చేయడానికి తగిన సిబ్బంది లేరు. పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారం కోరినప్పుడు వారు సకాలంలో స్పందించకపోవడంలో అక్రమార్కులు సులువుగా తప్పించుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూగర్భ గనులశాల ఏడీ అశోక్కుమార్ మాట్లాడుతూ ఎక్కడ నుంచి ఫిర్యాదులు వచ్చినా దాడులు చేస్తున్నామన్నారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు రూ.1.50 కోట్ల అపరాధ రుసుము విధించినట్లు తెలిపారు. మట్టి సరఫరాకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు