logo

సాయం కోసం మాతృ హృదయం ఆరాటం

గిద్దలూరులోని పొదలకుంటపల్లికి చెందిన ఈ మాతృమూర్తి మునీశ్వరమ్మ తన బిడ్డకు దారిచూపేందుకు ఆరాటపడుతున్నారు.

Published : 21 Mar 2023 06:19 IST

గిద్దలూరులోని పొదలకుంటపల్లికి చెందిన ఈ మాతృమూర్తి మునీశ్వరమ్మ తన బిడ్డకు దారిచూపేందుకు ఆరాటపడుతున్నారు. భర్తను కోల్పోయినా.. వస్తున్న కొద్దిపాటి పింఛన్‌కు తోడు కూలి పనులకు వెళ్లి స్వేదం చిందించి తన ముగ్గురు కుమారులను పోషిస్తున్నారు. దివ్యాంగుడైన రంగయ్యకు వికలాంగ పింఛన్‌ కోసం దరఖాస్తు చేశారు. ఆరు నెలలైనా మంజూరు కాకపోవడంతో తన మొర వినిపించేందుకు సోమవారం కలెక్టరేట్‌ వచ్చి మండుటెండలో ఇలా సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ఈనాడు,ఒంగోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని