చట్ట పరిధిలో అర్జీల పరిష్కారం : ఎస్పీ
జైకిసాన్ అగ్రికల్చర్ వెల్ఫేర్ సొసైటీ అనే సంస్థలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం అనిచెప్పి తనవద్ద రూ.2.50 లక్షలు వసూలుచేసి తొమ్మిదినెలలు ఉద్యోగం చేయించి కేవలం రెండునెలల వేతనం మాత్రమే ఇచ్చారని ఒంగోలుకు చెందిన ఎస్.రాజా ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులపై క్షేత్రస్థాయి అధికారులతో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ మలికా గార్గ్
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే:
* జైకిసాన్ అగ్రికల్చర్ వెల్ఫేర్ సొసైటీ అనే సంస్థలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం అనిచెప్పి తనవద్ద రూ.2.50 లక్షలు వసూలుచేసి తొమ్మిదినెలలు ఉద్యోగం చేయించి కేవలం రెండునెలల వేతనం మాత్రమే ఇచ్చారని ఒంగోలుకు చెందిన ఎస్.రాజా ఫిర్యాదు చేశారు. ఆ బోగస్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
* త్రోవగుంటలోని ఓ ఆటోమొబైల్ కంపెనీ నుంచి బజాజ్ ఫైనాన్స్ ద్వారా 2019లో రూ.1.66 లక్షలతో ఆటో కొనుగోలు చేసి, రూ.2,12,746 చెల్లించినా, ఇంకా రూ.1,66,990 చెల్లించాలని కంపెనీ ప్రతినిధులు వేధిస్తున్నారని ఒంగోలుకు చెందిన యు.రమణయ్య ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఎస్పీ మలికా గార్గ్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీదారులు హాజరయ్యారు. పలువురితో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. వినతులను పరిశీలించి చట్ట పరిధిలో పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు. స్పందనలో 79 ఫిర్యాదులు అందాయి. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఎస్బీ డీఎస్పీ మరియదాసు, దిశ డీఎస్పీ పల్లపురాజు, డీటీసీ డీఎస్పీ రామకృష్ణ, ఐసీసీఆర్ ఇన్స్పెక్టర్ కె.వి.రాఘవేంద్ర, ప్యానెల్ అడ్వకేట్ బి.వి.శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కోతల’రాయుడు
[ 18-04-2024]
పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆచరణలో వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. పథకాల వారీగా ఇప్పటికే కోతలు పెట్టారు. -
కీలక ఘట్టం ఆరంభం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలకఘట్టం ప్రారంభం కానుంది. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల్లోపు ఆర్వోలు నామినేషన్లు స్వీకరించనున్నారు. -
జగనా‘సుర’ కుట్రలు
[ 18-04-2024]
-
వాలంటీర్లతో.. రాజకీయ నాటకాలు
[ 18-04-2024]
ఈ నెల 10న ఒంగోలు సమతానగర్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఒకటో లైన్లో నివసిస్తున్న చప్పిడి ప్రభావతి నివాసానికి వెళ్లారు. -
రాహుల్.. సాధించి చూపెన్
[ 18-04-2024]
దేశంలోనే అత్యున్నత సర్వీస్.. కఠిన పరీక్షగా చెప్పుకొనే సివిల్స్ సాధించడం అంటే అంత సులువేమీ కాదు. కొలువులందరికీ అంత తేలిగ్గా దక్కవు. లక్షల మందికి అదో చిరకాల స్వప్నం.. సాకారం కాని కలగానే మిగిలిపోతుంటుంది మరి. -
నాడు అద్దం.. నేడు అధ్వానం
[ 18-04-2024]
ఒంగోలు నగరంలోని కర్నూలు పై వంతెన నాడు ఆహ్లాదానికి చిరునామాగా ఉండేది. కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వచ్చే వారికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ..ఆంధ్రుల రాజసానికి అద్దంపట్టేలా రూపుదిద్దారు. -
పర్యాటకాన్ని చిదిమేసిన పాలకుడు
[ 18-04-2024]
-
నామపత్రాల ప్రక్రియకు పటిష్ఠ బందోబస్తు
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి నామపత్రాల ప్రక్రియ ప్రారంభం కానున్న తరుణంలో ఆయా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేయాలని గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అధికారులను ఆదేశించారు. -
వేటగాళ్ల ఉచ్చు.. వన్యప్రాణులు బలి
[ 18-04-2024]
నల్లమల అటవీ పరిధి లోయ పల్లెల్లో వేటగాళ్ల దుశ్చర్యలు హద్దు మీరుతున్నాయి. వేటగాళ్లపై అటవీశాఖ నిఘా పూర్తిగా కరువైంది. దీనికి విద్యుత్తు సిబ్బంది సహకారం తోడవడంతో రెండు రోజుల క్రితం రెండు చుక్కల దుప్పులను విద్యుదాఘాతంతో చంపారు. -
వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
రాములోరి కల్యాణం బుధవారం వాడ, వాడలా అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులకు వడపప్పు, పానకం ప్రసాదం పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
అభివృద్ధి మరిచి.. పర్యాటకానికి పాతర
[ 18-04-2024]
-
ప్రమాదవశాత్తూ మంటలంటుకొని రైతు సజీవ దహనం
[ 18-04-2024]
ఎండిపోయిన పంటకు నిప్పంటించగా ప్రమాదవశాత్తూ మంటలు అంటుకొని రైతు సజీవ దహనమైన సంఘటన తాళ్లూరులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.