logo

ఆర్థిక సంఘం సభ్యుడిగా పెద కొత్తపల్లి వాసి

రాష్ట్ర అయిదో ఆర్థిక సంఘం సభ్యుడిగా కాకి కృపారావు నియమితులయ్యారు. మద్దిపాడు మండలం పెద కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆయన సాంఘిక సంక్షేమ శాఖ విభాగంలో పలు హోదాల్లో పనిచేశారు.

Published : 21 Mar 2023 06:19 IST

నియామక పత్రాన్ని ఎమ్మెల్యే బాలినేనికి చూపుతున్న కృపారావు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర అయిదో ఆర్థిక సంఘం సభ్యుడిగా కాకి కృపారావు నియమితులయ్యారు. మద్దిపాడు మండలం పెద కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆయన సాంఘిక సంక్షేమ శాఖ విభాగంలో పలు హోదాల్లో పనిచేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెప్మా పీడీగా విధులు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ పొందారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సిఫార్సు మేరకు ఆయన ఆర్థిక సంఘం సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు తన నియామక పత్రాన్ని బాలినేనికి ఒంగోలులో కృపారావు సోమవారం చూపారు. ఈ కార్యక్రమంలో డీపీవో నారాయణరెడ్డి, డ్వామా పీడీ శీనారెడ్డి, డీఆర్డీఏ పీడీ బాబూరావు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి లక్ష్మానాయక్‌, జిల్లా పశుసంవర్ధక శాఖ విశ్రాంత జేడీ రవీంద్రనాథ్‌ఠాగూర్‌, ఏడీ వెంకటరామిరెడ్డి, విద్యుత్తు శాఖ డీఈ వినయకుమార్‌రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని