అప్పుల బాధ తాళలేక..
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు యత్నించిన రైతన్న చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మార్కాపురం మండలంలోని గజ్జలకొండ పంచాయతీ మాలపాటిపల్లెలో చోటు చేసుకుంది.
ఆత్మహత్యకు యత్నించిన రైతు మృతి
కోటిరెడ్డి (పాత చిత్రం)
మార్కాపురం, న్యూస్టుడే: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు యత్నించిన రైతన్న చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మార్కాపురం మండలంలోని గజ్జలకొండ పంచాయతీ మాలపాటిపల్లెలో చోటు చేసుకుంది. బంధువులు, మార్కాపురం గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. మాలపాటిపల్లెకి చెందిన గొలమారి కోటిరెడ్డి (51) తనకున్న నాలుగు ఎకరాలతో పాటు స్థానికుల నుంచి మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిరప పంటలు సాగు చేశారు. సాగు నీరందించేందుకు పొలాల్లో అయిదు బోర్లు తవ్వించగా, నాలుగింటిలో నీరు పడలేదు. పొలం, కుటుంబ అవసరాల కోసం సుమారు రూ.13 లక్షల వరకు అప్పులు చేశారు. దిగుబడులు నామమాత్రంగా రావడంతో అప్పులు తీర్చే దారి లేక తీవ్ర మనస్తాపానికి గురైన రైతు కోటిరెడ్డి ఈ నెల 9న పురుగు మందు తాగి పొలంలో పడిపోయారు. గుర్తించిన సహచర రైతులు, కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని మార్కాపురంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలులోని కిమ్స్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందినట్లు చెప్పారు. ఒంగోలులో శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. రైతు కుటుంబాన్ని జడ్పీటీసీ సభ్యుడు నారు బాపనరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మాలపాటి శ్రీనివాసరెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు, రెవెన్యూ అధికారులు పరామర్శించి వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు గ్రామీణ ఎస్సై ఆర్.సుమన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM