చేయూతకు ఇదేం వాత?
స్వయం సహాయక సంఘాల సభ్యులకు మరింత ఆర్థిక చేయూతనిచ్చేందుకు దోహదపడాల్సిన మహిళా మార్టు అది.. చేయూత సంగతి అటుంచితే ఒత్తిడి చేసి మహిళలతో కొనుగోళ్లు చేయించడం, సంబంధిత బిల్లులపై గ్రూపు పేరు నమోదు చేయించడం, ప్రతీ ఒక్కరు రూ.500 విలువైన సరకులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేయడం చూసి వారంతా ఆవేదన చెందుతున్నారు.
స్వయం సహాయక సంఘాలపై ఒత్తిడి తెచ్చి సరకుల విక్రయం
టంగుటూరు మహిళా మార్టులో పరిస్థితి
ఇటీవల ఏర్పాటు చేసిన మార్టు
స్వయం సహాయక సంఘాల సభ్యులకు మరింత ఆర్థిక చేయూతనిచ్చేందుకు దోహదపడాల్సిన మహిళా మార్టు అది.. చేయూత సంగతి అటుంచితే ఒత్తిడి చేసి మహిళలతో కొనుగోళ్లు చేయించడం, సంబంధిత బిల్లులపై గ్రూపు పేరు నమోదు చేయించడం, ప్రతీ ఒక్కరు రూ.500 విలువైన సరకులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేయడం చూసి వారంతా ఆవేదన చెందుతున్నారు. గత డిసెంబరులో జిల్లాలోనే మొట్టమొదటిసారిగా టంగుటూరులో ఏర్పాటుచేసిన ‘చేయూత మహిళా మార్టు’లో నెలకొన్న పరిస్థితి ఇది.
టంగుటూరు, న్యూస్టుడే: కార్పొరేట్ కంపెనీలకు దీటుగా తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యావసర సరకులను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో టంగుటూరులో ఈ మార్టును ఏర్పాటుచేశారు. ఈ మండలంలోని 1,840 పొదుపు సంఘాల్లో సుమారు 20 వేల మంది మహిళలు ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి షేర్ క్యాపిటల్ కింద రూ.200 వరకు సేకరించి రూ.35 లక్షల నిధులు మార్టుకు సమకూర్చాలని నిర్దేశించుకున్నా రూ.22 లక్షలే వచ్చాయి. ఇక్కడ పని చేసేందుకు సిబ్బందికి శిక్షణ ఇచ్చి గౌరవ వేతనం అందిస్తున్నారు. మార్టు ప్రారంభ దశలో ఆదాయం బాగానే ఉన్నా ఆ తర్వాత క్రమేణా తగ్గింది. బయటి ధరలతో పోల్చితే కొంచెం ఎక్కువగా ఉండటం కూడా ఓ కారణమన్నది మహిళల అభిప్రాయం.
ప్రతీ ఒక్కరు రూ.500కు కొనుగోలు చేయాల్సిందే..
నిత్యం ఈ మార్టు ద్వారా రూ.లక్ష విలువైన సరకులు అమ్మాల్సి ఉంది. ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.40 వేల మధ్యలో లావాదేవీలు ఉంటున్నాయి. దీంతో అధికారులు ఓ ప్రణాళికను రచించారు. మండలంలోని 18 వేలమంది సభ్యులతో ఒక నెలలో ఒక్కొక్కరిచేత రూ.500 చొప్పున వస్తువులు కొనుగోలు చేయిస్తే రూ.90 లక్షల వరకు విక్రయాలు జరుగుతాయని నిర్ణయించారు. మార్టు నుంచి ప్రతీ మహిళ రూ.500కు తక్కువ లేకుండా వస్తువులు కొనుగోలు చేయాల్సిందేనని షరతు విధించినట్లు సమాచారం. కొనుగోలు చేయనివారికి రుణమాఫీ వర్తించదని, అలానే రుణాలు ఇచ్చేది లేదంటూ స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో గత రెండు మూడు రోజులుగా చేయూత మార్టుకు సంఘాల మహిళలు క్యూ కడుతున్నారు. ఇక్కడ కొనుగోలు చేసినవారు బిల్లుపై ఆయా గ్రూపు పేరు రాయించుకు వెళ్లి ఆ గ్రామ వీవోఏలకు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. బయట దుకాణాలకంటే మార్టులో తక్కువ ధరలకే వస్తువులు అందిస్తే తామే కొనుగోలు చేస్తామని.. ఇలా ఒత్తిడి పెంచాల్సిన అవసరమేముందని పలువురు మహిళలు ప్రశ్నిస్తున్నారు. కాగా మార్టు నిర్వహణకు 12 మందితో ఒక కమిటీ ఏర్పాటుచేశారు. ఏ వస్తువులు ఇక్కడ ఉంచాలనేది వారు నిర్ణయిస్తారు. ఎవరిష్టమొచ్చినట్లు వారు యాప్ల ద్వారా ఆర్డర్లు చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సభ్యులకు అలవాటు కావాలనే..
మార్టులో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులు
మార్టులో బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నారనే అంశంపై చేయూత డీపీఎం సునీత వద్ద ‘న్యూస్టుడే’ ప్రస్తావించింది. సభ్యులను మార్టుకి అలవాటు చేయాలనే ఉద్దేశంతో మాత్రమే చెప్పామని, ఒత్తిడి చేసి కొనుగోలు చేయించమని తెలపలేదన్నారు. ఎవరైనా స్వచ్ఛందంగా కొనుగోలు చేసుకోవచ్చన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)