logo

మీటరు ఏర్పాటు చేసేందుకు లంచం

ఓ దుకాణానికి మీటరు ఏర్పాటుకు లంచం తీసుకుంటూ సచివాలయం ఎనర్జీ అసిస్టెంట్‌ అనిశాకు చిక్కాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.

Published : 24 Mar 2023 03:49 IST

అనిశాకు చిక్కిన ఎనర్జీ అసిస్టెంట్‌

పట్టుబడిన చెన్నకేశవులు (కూర్చున్న వ్యక్తి)

మద్దిపాడు, న్యూస్‌టుడే: ఓ దుకాణానికి మీటరు ఏర్పాటుకు లంచం తీసుకుంటూ సచివాలయం ఎనర్జీ అసిస్టెంట్‌ అనిశాకు చిక్కాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిపాడు మండలం గుండ్లాపల్లి సచివాలయంలో విద్యుత్తు శాఖ ఎనర్జీ అసిస్టెంట్‌గా చెన్నకేశవులు విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కుంచాల మోహన్‌రావు తన అల్పాహార దుకాణానికి విద్యుత్తు మీటరు కావాలంటూ గత రెండు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. రూ.10 వేలు లంచం ఇస్తే రేపటి లోగా మీటరు బిగిస్తానని ఎనర్జీ అసిస్టెంట్‌ చెన్నకేశవులు తెలిపారు. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, బిగించిన వెంటనే ఇస్తానని పలుమార్లు మోహన్‌రావు తెలిపినా స్పందన లేదు. అనిశా అధికారులకు మోహన్‌రావు ఫిర్యాదు చేయడంతో గురువారం రూ.7 వేల నగదును ఇస్తుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేశారు. అనిశా దాడుల్లో డీఎస్పీ టీవీవీ ప్రతాప్‌కుమార్‌, సీఐలు శేషు, శ్రీనివాసరావు, అపర్ణ.. ఎస్సైలు ప్రసాదు, షరీఫ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని