మేలుకోకుంటే విస్తరిస్తుంది..!
సకాలంలో గుర్తిస్తే నివారణ ఎంత సులభమో.. నిర్లక్ష్యం చేస్తే అంతే చేటు తెచ్చే వ్యాధి ‘క్షయ’. దీనిని పూర్తిగా రూపుమాపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విభాగాలను నిర్వహిస్తూ రూ.కోట్లు వ్యయం చేస్తున్నాయి.
జిల్లాలో ఇప్పటికే 1729 క్షయ కేసులు
జీజీహెచ్లో మొండి క్షయ నిర్ధారణకు వినియోగించే సీబీనాట్ పరీక్ష యంత్రం
ఒంగోలు నగరం, న్యూస్టుడే: సకాలంలో గుర్తిస్తే నివారణ ఎంత సులభమో.. నిర్లక్ష్యం చేస్తే అంతే చేటు తెచ్చే వ్యాధి ‘క్షయ’. దీనిని పూర్తిగా రూపుమాపడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విభాగాలను నిర్వహిస్తూ రూ.కోట్లు వ్యయం చేస్తున్నాయి. 2025 కల్లా నివారణే లక్ష్యం పెట్టుకున్నాయి. అయినా ఆశించినరీతిలో ఫలితాలు కనిపించడంలేదు. ప్రజల్లో అవగాహన లోపం, లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రాకపోవడం మూలంగా కేసుల సంఖ్య తగ్గడం లేదు. జిల్లాలో ప్రస్తుతం యంత్రాంగం గుర్తించిన గణాంకాల ప్రకారం 1729 మంది క్షయతో బాధపడుతున్నారు. శుక్రవారం ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం.. ఈ సందర్భంగా ఇక్కడి పరిస్థితిని పరిశీలిస్తే..
జిల్లాలో ప్రస్తుతం వ్యాధితో బాధపడుతున్నవారికి వైద్యశాఖ సిబ్బంది ద్వారా వారి ఇళ్లకు వెళ్లి ఉచితంగా మందులు అందజేస్తున్నారు. పౌష్టికాహారం కోసం ప్రభుత్వం నెలకు రూ.500 ఇస్తుండగా, తాజాగా దాతల సాయంతో రూ.700 విలువైన పోషకాహార కిట్ ఇస్తున్నారు. ఇప్పటివరకు 645 మందికి కందిపప్పు, మినపపప్పు, నూనె, వేరుశనగ, శనగ, నువ్వుల ఉండలు అందిస్తున్నారు. గ్లాండ్ ఫార్మా సంస్థ 500 మందిని, భారత్ బయోటెక్ 25 మంది, జిల్లా అధికారుల సంఘం 30. ఇతరులు 50 మందికి ఈ కిట్లు అందజేస్తున్నారు. 17 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోల క్షయ పరీక్షలు, రెండు సీబీనాట్ కేంద్రాలలో మొండి క్షయ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. సాధారణ క్షయకు క్రమం తప్పకుండా మందులు వాడితే ఆరునెలల్లో తగ్గిపోతుంది. మొండి క్షయకు మాత్రం 9 నుంచి 20 నెలల వరకు వాడాలి. ఎక్కడ కేసు నమోదైనా ప్రభుత్వ ఆసుపత్రికి తెలియజేస్తే ఉచితంగా మందులు ఇస్తారు. అదే విధంగా ప్రైవేటు ఆసుపత్రులవారు గుర్తించి అధికారులకు తెలియజేస్తే ఒక్కో కేసుకు రూ.500 పారితోషికం అందిస్తారు.
నాడు పెరిగిన మరణాలు..: క్షయ ఉన్నవారికి కొవిడ్ సోకడం సులభం. మరణాలూ ఎక్కువే. సాధారణ రోజుల్లో ఏడాదికి ఒకశాతం టీబీ మరణాలు నమోదవుతుండగా 2020-21 కొవిడ్ సమయంలో రెండుశాతం పెరిగాయి. 132 మంది మృతి చెందారు. ప్రస్తుతం మొండి క్షయకు ఔషధాలు వాడేవారు 75 మంది ఉన్నారు.
దాతల సాయంతో పౌష్టికాహార కిట్ల అందజేత
ఇవీ వ్యాధి లక్షణాలు
రెండువారాలు మించి దగ్గు, జ్వరం, గత మూడు నెలల కాలంలో పదిశాతం బరువు తగ్గడం, దగ్గినప్పుడు కళ్లెలో రక్తం పడటం వంటివి ఉంటే పరీక్ష చేయించుకోవాలి. మధుమేహంతో బాధపడేవారు.. పొగ, మద్యం తీసుకునేవారు, పోషకాహార లోపం, హెచ్ఐవీ బాధితులు, గనుల్లో పనిచేసేవారు, మురికివాడల్లో నివసించేవారికి వ్యాధిసోకే అవకాశం ఉంది.
ఎక్కడికక్కడ వివరాల నమోదు
మొండి క్షయతో బాధపడేవారికి ఒక్కొక్కరికి ఇచ్చే మందుల విలువ రూ.10లక్షలు. ప్రైవేటుగా కొనడం కష్టం. రోగం నిర్ధారణ అయిన వెంటనే ఔషధాలు వాడటం మొదలుపెడితే నివారణ సులభం. ఆరునెలలు ఇవి వాడకపోతే మళ్లీ మొదటి నుంచి కోర్సు ప్రారంభించాలి. రోగులను గుర్తించడానికి ప్రైవేటు ఆసుపత్రులు, ఔషధ దుకాణాల్లో మందులు తీసుకునేవారి పేర్లు, చరవాణి నంబర్లు నమోదు చేయాలని ఆదేశాలిచ్చాం.
డాక్టర్ సురేష్కుమార్, జిల్లా క్షయనివారణ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్