లారీ ఢీకొని ఒకరి దుర్మరణం
లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన టంగుటూరు 16వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.
జాతీయ రహదారిపై మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
టంగుటూరు, న్యూస్టుడే: లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన టంగుటూరు 16వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు .. కొత్తపట్నం కాంతినగర్కు చెందిన సింగోతు వెంకటేశ్వర్లు (30) గురువారం సాయంత్రం ఏపీ 26 ఏఫ్ 0997 ద్విచక్ర వాహనంపై సింగరాయకొండ నుంచి ఒంగోలుకు వెళ్తున్నారు. 16వ జాతీయ రహదారిపై లారీ అతి వేగంగా వెళుతూ వెంకటేశ్వర్లు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న హైవే పోలీసులు స్థానిక టంగుటూరు పోలీసులకు సమాచారం అందించారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడకుండా హైవే పోలీసులు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి వచ్చిన ఎస్సై ఖాదర్బాషా, సిబ్బంది మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆటోలో ఒంగోలు రిమ్స్కి తరలించారు. ఢీకొట్టిన వ్యక్తి లారీతో సహా పరారయ్యాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి..: హనుమంతునిపాడు : కనిగిరి - కంభం రహదారిలో ఆవులవారిపల్లి క్రాస్రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన ద్విచక్ర వాహన చోదకుడు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లా గోనిగుండ్ల మండలం కనగాలకు చెందిన గోపాల రాజు (30) ద్విచక్ర వాహనంపై కనిగిరి పట్టణానికి వచ్చి బుధవారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. ఆవులవారిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం, పాల ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గోపాల రాజుతో పాటు ఆటో చోదకుడు గాయపడ్డారు. రాజు పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు తరలిస్తుండగా, గురువారం తెల్లవారుజామున మార్గంమధ్యలో మృతిచెందారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని ఎస్సై కృష్ణపావని తెలిపారు. సంఘటనా స్థలాన్ని సీఐ పాపారావు పరిశీలించారు.
రాజు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.