నేర వార్తలు
కన్న తల్లిని హత్య చేసిన కేసులో నిందితుడైన కుమారుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు.
తల్లిని హత్యచేసిన కేసులో కుమారుడికి జైలు శిక్ష
మార్కాపురం నేర విభాగం: కన్న తల్లిని హత్య చేసిన కేసులో నిందితుడైన కుమారుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించారు. కేసు పూర్వాపరాలిలా ఉన్నాయి. దోర్నాల మండలం హసనాబాద్కు చెందిన నూనే దేవమ్మ, అచ్చయ్య దంపతుల కుమారుడు యోహాను. భార్య కుమారితో కలిసి యోహాన్ వేరుగా కాపురముంటున్నాడు. అతను మద్యానికి బానిసై భార్యపై తరచూ దాడికి పాల్పడుతుండేవాడు. 2016 మార్చి 10న యోహాను భార్యపై పదునైన ఆయుధంతో దాడి చేస్తుండగా, తల్లి దేవమ్మ అట్టుపడింది. సహనం కోల్పోయిన యోహాన్ కన్న తల్లిపై ఆయుధంతో దాడిచేయగా, ఆమె తీవ్రంగా గాయపడి వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీనిపై తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దోర్నాల పోలీసులు యోహానుపై హత్య కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. మార్కాపురం ఆరో అదనపు జిల్లా న్యాయమూర్తి టి రాజావెంకటాద్రి సాక్షులను విచారించారు. నేరం రుజువు కావడంతో నిందితునికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెలువరించినట్లు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. కేసులో నిందితుడికి శిక్ష పడే విధంగా దర్యాప్తు చేసిన అప్పటి సీఐ రవికుమార్, ఎస్సై నాగరాజు, సిబ్బందిని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ ఓ ప్రకటనలో అభినందించారు.
మహిళ హత్య కేసులో...: ఒంగోలు గ్రామీణం: మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు పడటంలో కీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులను ఎస్పీ మలికా గార్గ్ గురువారం అభినందించారు. 2022 జనవరి 27న కనిగిరికి చెందిన మువ్వా వెంకటలక్ష్మిపై అదే పట్టణానికి చెందిన పెరుబోయిన శివకృష్ణ కర్రతో దాడిచేసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టి సాక్ష్యాధారాలు రూపుమాపిన సంఘటనలో పోలీసులు కేసు నమోదు చేయగా, సీఐ పాపారావు దర్యాప్తు చేశారు. నిందితుడికి జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ.భారతి తీర్పు చెప్పారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ గార్గ్ అభినందించారు.
గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు
సింగరాయకొండ గ్రామీణం: గంజాయి విక్రయిస్తున్న ముఠా సభ్యులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ రంగనాథ్, ఎస్సై ఫిరోజా ఫాతిమా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం అలగాయపాలేనికి చెందిన కోడూరి రాములమ్మ పాత సింగరాయకొండ పరిధిలోని బాలిరెడ్డినగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు గురువారం దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకుని 20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆమె నుంచి వివరాలు రాబట్టి కందుకూరు పట్టణం శ్రీనగర్ కాలనీకి చెందిన కట్టా రంగయ్య, కట్టా కుమారి, కట్టా జీవన్కుమార్లను కావలి పట్టణం ఇందిరమ్మ కాలనీలో అరెస్టు చేశారు. వారంతా పాడేరు పరిసరాల నుంచి గంజాయిని తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి మరో 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మొత్తం గంజాయి విలువ సుమారు రూ.6 లక్షలుంటుందని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాలంటీర్ల మెడపై వైకాపా కత్తి
[ 24-04-2024]
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో వైకాపా నేతలు, ఆ పార్టీ అధినేతను మించిన వారుండరు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. -
అన‘కొండలు’ తిన్న మన్ను.. రూ.860 కోట్లు
[ 24-04-2024]
తవ్వుకు‘న్నోళ్ల’కు తవ్వుకున్నంత.. మేసి‘నోళ్ల’కు మేసినంత. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో సహజ వనరుల విధ్వంసం యథేచ్ఛగా సాగింది. నేతల ముసుగులో ఉన్న గుంట నక్కలు బరితెగించాయి. -
ఇది కాదా.. జగన్నాటకం!
[ 24-04-2024]
అబద్ధపు హామీలు గుప్పించడం.. మాయమాటలు చెప్పడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని మించినవారుండరు. అయిదేళ్లు పట్టించుకోకుండా ఉండటం. -
నామినేషన్ల వేళ మారిన పేర్లు
[ 24-04-2024]
నామినేషన్ల దాఖలు సమయంలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రకటించిన వారికి కాకుండా కొన్నిచోట్ల ఇతరులకు సీట్లు కేటాయించారు. -
అరవీర ‘రంగు’ మార్తాండ
[ 24-04-2024]
మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు. -
క్యాషియర్ జగన్.. నొక్కవేం బటన్
[ 24-04-2024]
రాష్ట్రంలో సంక్షేమం కోసం తరచూ బటన్లు నొక్కుతున్నాను. ప్రతి గడపకూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేరుస్తున్నానంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రివన్నీ ఉత్తుతి మాటలేనని అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సర్పంచులపై గురి.. పల్లెలకు ఉరి
[ 24-04-2024]
పల్లెవాసుల ఆశల్ని చిదిమేశారు..పట్టుగొమ్మలనూ నరికేశారు..నిధుల్ని దిగమింగేశారు..చిల్లిగవ్వ కోసం దేబిరించాల్సిన దుస్థితిలోకి పంచాయతీల్ని నెట్టేశారు. -
అయిదో రోజు 46 నామపత్రాల దాఖలు
[ 24-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అయిదో రోజైన మంగళవారం 46 మంది తమ నామపత్రాలు దాఖలు చేశారు. -
తెదేపాలో చేరికల జోరు
[ 24-04-2024]
తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. మంగళవారం వైకాపా సర్పంచి కోమలి భర్త బొల్లినేని మధు అనుచర గణంతో సహా పార్టీలో చేరారు. -
కరోనాతో ఆర్థికంగా కుదేలై.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య
[ 24-04-2024]
కరోనాతో ఆర్థికంగా కుదేలైన ఓ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం సింగరాయకొండలో చోటు చేసుకుంది. -
చిట్టితల్లి వేడుక చూడకుండానే..
[ 24-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పుష్పాలంకరణ వేడుక చూడకుండానే ఆ తండ్రి దూర తీరాలకు చేరుకున్నారు. సామగ్రి తీసుకొస్తుండగా, కారు చక్రాలు కర్కశంగా ఆయన్ను చిదిమేశాయి. -
ఉత్సవ విగ్రహాల్లా మార్చేశావ్.. జగన్
[ 24-04-2024]
గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అంటే ఎంతో గౌరవంగా ఉండేది. చెక్ పవర్తో నిధులను ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. -
రోడ్లు ఛిద్రం.. ఒళ్లు హూనం
[ 24-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఎక్కడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ దారుల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనమవుతుందో రామచంద్రా అని ప్రజలు బాధ వెలబోసుకున్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. -
‘భూ’చోళ్ల అవినీతి రూ.201.33 కోట్లు
[ 24-04-2024]
ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని భూ పరిపాలన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్