కన్నీటి గాథ.. వెంటాడే వ్యధ
పొదిలి మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజుపాలెం గ్రామమది.. కొన్నేళ్లుగా వేధిస్తున్న ఫ్లోరైడ్ భూతంతో అనేకమంది తల్లడిల్లుతున్నారు.
పీడిస్తున్న ఫ్లోరోసిస్ భూతం
రాజుపాలెంలో బాధితుల ఆవేదన
ఈనాడు డిజిటల్, ఒంగోలు, న్యూస్టుడే, పొదిలి : పొదిలి మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజుపాలెం గ్రామమది.. కొన్నేళ్లుగా వేధిస్తున్న ఫ్లోరైడ్ భూతంతో అనేకమంది తల్లడిల్లుతున్నారు. అనారోగ్యం, నడిచేందుకు సైతం ఓపిక లేక, కాయకష్టం చేసుకునే సత్తువ లేక ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. భూగర్భంలో ఉన్న ఫ్లోరైడ్తో కూడిన నీళ్లు తాగకుండా ప్రభుత్వం శుద్ధజలం పంపిణీ తలపెట్టినా నిర్వహణ కరవై, ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ‘న్యూస్టుడే’ ఈ పల్లెను పరిశీలించింది.
రాజుపాలెం గ్రామం
రాజుపాలెం గ్రామంలో 250 కుటుంబాలు ఉండగా వెయ్యిమంది జనాభా కనిపిస్తారు. ఇక్కడి నీటిలో ఫ్లోరైడ్ 7పీపీఎం ఉందని ఏళ్ల క్రితమే గుర్తించారు. అప్పటి గవర్నర్ కుముద్బెన్జోషి గ్రామంలో పర్యటించి ఫ్లోరైడ్ తీవ్రతను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించారు. చేతి పంపులు, బావుల్లోని నీళ్లు తాగకూడదని సూచించారు. అందరికీ శుద్ధజలం పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తక్షణమే దర్శి నుంచి సాగర్ జలాలను అందించే ఏర్పాటు చేశారు. గ్రామ ప్రవేశమార్గం వరకు నీళ్లు వచ్చినా ఇంటింటికీ మాత్రం అవి చేరలేదు. నాలుగైదు రోజులకు ఒకసారి, ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. వచ్చినప్పుడు ఎగువన ఉన్న గృహస్థులు అక్కడికి వచ్చి నీళ్లు పట్టుకెళ్లాలంటే యుద్ధమే చేయాలి. కొన్నేళ్లుగా సకాలంలో నీళ్లు రావడం లేదు. తాగునీటి కుళాయి కనెక్షన్లు లేవు. చేతిపంపులు, బావుల్లో నీరు వాడుకలకు వినియోగిస్తున్నారు. పశువులకూ వాటినే తాగిస్తున్నారు. ఏళ్ల క్రితం అవగాహన లేక ఈ నీళ్లు వాడినవారి దంతాలు రంగుమారి గారతో కనిపిస్తున్నాయి. ఎముకలు, కీళ్ల నొప్పులతో సతమతమవుతున్నారు. సరిగా నడవలేక, మంచాలకే పరిమితమైనవారు ఉన్నారు.
నిత్యం రక్షిత జలాలను అందిస్తేనే..
ప్రస్తుతం గ్రామంలో 40 నుంచి 50 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కీర్తి వెంకటస్వామి మాట్లాడుతూ కాళ్లు చచ్చుబడి ఇంటికే పరిమితమయ్యానని తెలిపారు. పనులకు వెళ్లలేక, కుటుంబాన్ని పోషించుకోలేక నైరాశ్యంతో ఉన్నామన్నారు. డబ్బయ్యేళ్ల కీర్తి అయ్యన్న మాట్లాడుతూ ఫ్లోరైడ్ సమస్య ఉందని తెలియక ఈ నీళ్లు తాగామని.. వాటి పర్యవసానాలతో అవస్థలు పడుతున్నామన్నారు. కర్ర సాయంతో నాలుగడుగులు వేయడం తప్ప ఎక్కడికీ వెళ్లలేనన్నారు. గ్రామంలోని ఓవర్హెడ్ ట్యాంకుకు పూర్తిస్థాయిలో నీళ్లు ఎక్కించాలని, పైపులైన్లు విస్తరించి ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటుచేసి సాగర్ జలాలను అందించాలని స్థానికులు కోరుతున్నారు.
అక్కాచెల్లెళ్ల దైన్యం
రాజుపాలెం గ్రామానికి చెందిన చల్లా పెద్దయోగమ్మ (70), చల్లా చిన్న యోగమ్మ (65) అక్కాచెల్లెళ్లు. వీరిలో పెద్దయోగమ్మకు నలుగురు పిల్లలు పుట్టి వివిధ కారణాలతో చనిపోయారు. చెల్లెలకు కుమార్తె ఉన్నారు. ఫ్లోరైడ్ భూతం వీరిని వెంటాడింది. మంచాలకే పరిమితమయ్యారు. అటూ ఇటూ కదలాలన్నా...నీళ్లు, భోజనం కావాలన్నా ఎవరో ఒకరు సాయం చేయాల్సిందే. ఒకప్పుడు బాగా బతికిన తాము తెలియక ఫ్లోరైడ్ నీళ్లు తాగి ఇలా మంచాన పడ్డామని, తమలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని వారు కన్నీటి పర్యంతమయ్యారు.
మందులు పనిచేయవు
ఈ చిత్రంలో ఉన్న గద్యా రత్తమ్మ(80) కాళ్లు, చేతులు చచ్చుబడి పూర్తిగా నడవలేరు. నాడు తనకు అవగాహన లేక ఫ్లోరైడ్ నీళ్లు తాగానని.. ఇంటిలోుంచి బయటకు, లోనికి పాకుతూ వెళ్లాల్సి వస్తుందని ఆవేదన చెందారు. గత 40ఏళ్లుగా ఇలానే నొప్పులతో అవస్థలు పడుతున్నానని.. సూది మందులు, మందుబిళ్లలు పనిచేయడంలేదని వాపోయారు. .
అవస్థలు పడుతున్నాం
అరవై అయిదేళ్ల చల్లా వెంకటేశ్వర్లు కాళ్లు వంకరపోయి నొప్పులతో అవస్థలు పడుతున్నారు. గ్రామంలో నీళ్లు మంచివికావని, గరళమని ఆయన వాపోయారు. పశువులు కూడా అవే నీళ్లు తాగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామానికి నాలుగైదు రోజులకోసారి మంచి నీళ్లు వచ్చినా ఎగువ ప్రాంతానికి అందడంలేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇట్లుంటది జగన్ తోని.. ఒంగోలు బ్రాండ్కే బ్యాండ్
[ 23-04-2024]
రాజసానికి మారు పేరైన ఒంగోలు గిత్త.. వేల మందికి ఉపాధి చూపిన ఒంగోలు డెయిరీ.. ఈ రెండూ జిల్లాకు ఓ బ్రాండ్లు. ఆ పేర్లు తలుచుకుంటే ప్రకాశం వాసుల మది పులకరిస్తుంది. ఎనలేని సంతోషం, ఉత్సాహం కలుగుతుంది. -
జన బలం జాతర..
[ 23-04-2024]
జన బలానికి.. ప్రలోభాల పర్వానికి ఈ రెండు చిత్రాలే నిలువెత్తు నిదర్శనం. జిల్లావ్యాప్తంగా సోమవారం నామినేషన్ల దాఖలు సందడి నెలకొంది. -
అయిదేళ్లు గుడ్డి గుర్రాల పళ్లు తోమారా!
[ 23-04-2024]
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తామని చెప్పిన జగన్.. అయిదేళ్లలో ఉత్తుత్తి పనులు చేసి చివరిలో శిలాఫలకాలు వేశారు. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండు గేట్లు కొట్టుకుపోయి రెండేళ్లవుతున్నా కనీసం మరమ్మతులు చేయించలేని జగన్ వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు’... అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
పడుతూ లేస్తూ పది ఫలితాలు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా గత అయిదేళ్లుగా పడుతూ లేస్తూ వస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 73.74 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ప్రస్తుతం ఆ శాతం 91.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. -
89.97 శాతం ఉత్తీర్ణత
[ 23-04-2024]
2023-24 విద్యా సంవత్సరానికి గాను పదో తరగతి ఫలితాల్లో 89.97 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా 60 ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో మొత్తం 887 మంది విద్యార్థులుండగా, అందులో 798 మంది ఉత్తీర్ణులయ్యారు. -
పసివారి పైనా పాలకుడి పడగ
[ 23-04-2024]
పసి వారిపైనా ముఖ్యమంత్రి జగన్ పగబట్టారు. ఆయన నిర్ణయంతో ఈ భావి సంపద నీరుగారిపోతోంది. ‘పది రూపాయలు’ మిగుల్చుకుందామని అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేసే దుస్సాహసానికి ఒడిగట్టారు. -
తాగు.. తూలు.. జైకొట్టు
[ 23-04-2024]
‘బాబ్బాబూ.. నామినేషన్ వేస్తున్నాం. కాస్తంత అక్కడి వరకు వచ్చిపోండి. ఊరకనే కాదు అయిదొందల నోటు, క్వార్టర్ సీసా ఇస్తాం. పసందైన బిర్యానీ కూడా పెట్టిస్తాం. మందు తాగి మా పార్టీ జెండా పట్టుకుని జేజేలు కొడితే చాలు’ ఇదీ ప్రస్తుతం నామినేషన్ల సందర్భంగా వైకాపా అభ్యర్థుల ప్రదర్శనల్లో నాయకుల బతిమలాటలు. -
బాబ్బాబు.. రాజీనామా చేయరూ..!
[ 23-04-2024]
వైకాపా నేతలు తమ సైన్యం అనుకున్న వాలంటీర్లు ఇప్పుడు వారి మాట వినడం లేదు. రాజీనామా చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని దొనకొండ మండల సచివాలయాల కన్వీనర్ గుంటు పోలయ్య తమ గ్రూపులో సోమవారం విజ్ఞప్తి చేశారు. -
నాలుగో రోజు 42 మంది నామపత్రాల దాఖలు
[ 23-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, జిల్లా వ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు సంబంధించి నాలుగో రోజైన సోమవారం 42 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. -
చోరీ కేసు నిందితుడి విషాదాంతం
[ 23-04-2024]
చిన్న పొరపాటు నిర్ణయంతో ఓ యువకుడి జీవితం విషాదాంతమైంది. తోటి ఉన్నతోద్యోగులు డబ్బు ఆశ చూపడంతో చోరీ చేసి పట్టుబడి, మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
ఏరులై పారిన మద్యం
[ 23-04-2024]
మార్కాపురంలో సోమవారం వైకాపా అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు నామినేషన్ సందర్భంగా మద్యం ఏరులైపారింది. డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేశారు.పట్టణంతో పాటు చుటుపక్కల మండలాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులకు రూ.500 నగదు పంపిణీ చేశారు. -
జగనన్న కాలనీలా.. చిట్టడవులా!
[ 23-04-2024]
‘రాష్ట్రంలో ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నా’మంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న జగనన్న కాలనీలు చిన్నపాటి అడవులను తలపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్