గుదిబండలా.. దేవాదాయ భూములు
దశాబ్దాల క్రితమే శాశ్వత నివాసాలు నిర్మించుకున్న వారి భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో అక్కడివారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
అధికారుల నిర్లక్ష్యంతో నిలిచిన రిజిస్ట్రేషన్లు
ఈసారైనా ముఖ్యమంత్రి పట్టించుకునేనా ?
పాత సింగరాయకొండ నరసింహస్వామి ఆలయం
సింగరాయకొండ గ్రామీణం, న్యూస్టుడే: దశాబ్దాల క్రితమే శాశ్వత నివాసాలు నిర్మించుకున్న వారి భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో అక్కడివారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం .. పాలకుల నిర్వాకంతో స్థానికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. సింగరాయకొండ పరిసరాల్లోని దేవాదాయ భూముల పరిధిలోని వారికి ఇదో ఎడతెగని సమస్యగా మిగిలింది.
2013లో పాత సింగరాయకొండ నరసింహ స్వామి ఆలయ భూములు గుర్తించే క్రమంలో ఇచ్చిన జీవోలో గ్రామాలకు గ్రామాలు దేవాదాయ శాఖ భూముల పరిధిలోకి వస్తాయని తెలపడంతో అప్పటి నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చొరవ చూపాలని స్థానికులంటున్నారు. ప్రధానంగా పాతసింగరాయకొండ, సింగరాయకొండ, సోమరాజుపల్లి, కలికవాయ గ్రామాల్లోని 1,500 ఎకరాలు దేవాదాయ శాఖ భూముల జాబితాలో ఉన్నాయి. దీంతో వాటి క్రయ విక్రయాలపై నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. 2013లో అప్పటి ప్రభుత్వం మండలంలోని కొన్ని భూములను నిషేధిత భూములుగా పేర్కొంటూ జీవో జారీ చేసింది. అప్పటికే దశాబ్దాల క్రితం నివాసాలు నిర్మించుకుని జీవిస్తున్నామని, ఇప్పుడీ షరతులు విధించడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో సీఎంకు విన్నవించినా..
వాస్తవానికి మండలంలో 2,500 ఎకరాలకు ఆంక్షలుండగా, రెండేళ్ల క్రితం వ్యవసాయ, పారిశ్రామికవాడకు చెందిన భూములంటూ 1,000 ఎకరాలకు మినహాయింపునిచ్చారు. అలాగే నివాసాలు ఏర్పరచుకున్న భూములకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. గతేడాది ఒంగోలు సభకు విచ్చేసిన ముఖ్యమంత్రికి స్థానిక నాయకులు కలిసి భూములపై నిషేధాజ్ఞలు తొలగించాలని వినతి పత్రాలు అందజేశారు. వాటి క్రయ విక్రయాలు నిలిచిపోవడంతో పంచాయతీలకు ఆదాయం తగ్గిపోయి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందని ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. గతేడాది శాసనసభ సమావేశాల్లో ప్రస్తుత నెల్లూరు జిల్లా కందుకూరు శాసనసభ్యుడు మహీధర్రెడ్డి ఇదే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించినా పరిష్కారం కాలేదు.
చిల్లిగవ్వ వచ్చే వీలులేక..
ఎన్నో ఏళ్లుగా రూ. లక్షల విలువైన భూములను అమ్ముకునేందుకు వీలుకాక వేలాది కుటుంబాలు విలవిల్లాడుతున్నాయి. ఇటు పిల్లలకు నాణ్యమైన విద్య అందించలేక, ఇంట్లో కనీస అవసరాలు తీర్చలేక మథన పడుతున్నారు. కనీసం ఆ భూములు తనఖా పెట్టి నాలుగు డబ్బులు తీసుకుందామన్నా వీలు కావడం లేదని వారంటున్నారు. ఇళ్లు, స్థలాలపై నిషేధాజ్ఞలు ఉండటంతో బ్యాంకర్లు కూడా రుణాలివ్వడానికి ముందుకు రావడం లేదు. వడ్డీ వ్యాపారులు సైతం అప్పులు ఇవ్వకపోవడంతో అత్యవసర వైద్యసేవలు పొందేందుకు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పిల్లల వివాహాలు చేయడం కూడా తమకు కష్టసాధ్యంగా మారిందని వారు ఆవేదన చెందుతున్నారు. గతంలో పనిచేసిన దేవాదాయ శాఖ అధికారులు చేసిన తప్పిదాల వల్ల తాము మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. సోమవారం జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి తమ సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్