తిరుమలలో గౌరవం ఇవ్వడం లేదు
రుమలలో ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆరోపించారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని అనుచరులతో కలిసి దర్శించుకున్నారు.
గిద్దలూరు శాసనసభ్యుడు అన్నా రాంబాబు
తిరుమల, న్యూస్టుడే: తిరుమలలో ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆరోపించారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని అనుచరులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కనీసం ఎమ్మెల్యే అన్న గౌరవం కూడా లేకుండా అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తనను దించి తనిఖీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నాతో పాటు నా సతీమణి సీఎం కార్యాలయంలోని ధనుంజయరెడ్డి నుంచి సిఫార్సు లేఖ తీసుకొస్తే తనకు ప్రొటోకాల్ దర్శనం ఇచ్చి, భార్యకు జనరల్ బ్రేక్ దర్శనం ఇవ్వడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కనీసం సీఎం కార్యాలయానికి కూడా విలువ లేదా అంటూ ప్రశ్నించారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. సామాన్య భక్తులను బూచిగా చూపుతూ తితిదే ఈవో ధర్మారెడ్డి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, తనకు కావాల్సిన వారికి అన్ని రకాల దర్శనాలు కల్పిస్తూ ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. తనతో పాటు ప్రొటోకాల్ దర్శనానికి 200 మంది వచ్చారని, వారందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులా అంటూ ప్రశ్నించారు. తితిదే ఈవో లాంటి కొందరు చేసే పనులకు సీఎంపై ఎమ్మెల్యేలకు అసంతృప్తి కలుగుతోందన్నారు.
రెండు రోజుల పాటు ఎమ్మెల్యేతో పాటు 28 మందికి దర్శనం
ఆరోపణలపై తితిదే ఉన్నతాధికారులు స్పందించి ‘న్యూస్టుడే’తో మాట్లాడారు. ఎమ్మెల్యే తన అనుచరులు 28 మందితో రెండు రోజుల క్రితం తిరుమలకు వచ్చారన్నారు. తితిదే అదనపు ఈవో కార్యాలయం నుంచి ఎమ్మెల్యేతో పాటు 10 మందికి ప్రొటోకాల్ దర్శనం, మిగిలిన వారికి సాధారణ బ్రేక్ దర్శనాన్ని కల్పించామన్నారు. రెండో రోజు అదే రీతిలో కల్పించామని స్పష్టం చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రొటోకాల్ పరిధిలోని వారు స్వయంగా హాజరైన ఆరుగురికే దర్శనం ఇస్తామని, ఎమ్మెల్యే కావడంతో ఆయన వెంట పదిమందికి ప్రొటోకాల్, మిగిలిన వారికీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించామన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తితిదే అధికారులపై విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం