అంతిమ యాత్రలోనూ అవే అసంతృప్తులు
వైకాపా కొండపి నియోజకవర్గ బాధ్యుడు వరికూటి అశోక్బాబు తల్లి కోటమ్మ(82) అంత్యక్రియలను టంగుటూరు మండలం కారుమంచిలో సోమవారం నిర్వహించతలపెట్టారు.
కొండపి నియోజకవర్గంలో ఆరని వర్గపోరు కుంపట్లు
సీఎం వచ్చినా హాజరవ్వని అసమ్మతి నాయకులు
ఈనాడు డిజిటల్, ఒంగోలు, న్యూస్టుడే, జరుగుమల్లి:
అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. చిత్రంలో కలెక్టర్ దినేష్ కుమార్, జేసీ అభిషిక్త్ కిషోర్, ఎస్పీ మలికా గార్గ్
వైకాపా కొండపి నియోజకవర్గ బాధ్యుడు వరికూటి అశోక్బాబు తల్లి కోటమ్మ(82) అంత్యక్రియలను టంగుటూరు మండలం కారుమంచిలో సోమవారం నిర్వహించతలపెట్టారు. భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు దాదాపు అందరూ హాజరయ్యారు. సీఎం పర్యటన ముగిసే వరకు వేచి ఉండి అనంతరం కొద్దిసేపు ముచ్చటించుకుని వెళ్లారు. నియోజవకర్గంలోని అన్ని మండలాల నుంచి కార్యకర్తలూ తరలివచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ... అంతిమయాత్రలోనూ అసంతృప్తులు దూరంగా ఉండటం.. ఓ వర్గం నాయకులు హాజరు కాకపోవడం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఆశించినదొక్కటీ.. అయినదొక్కటి...: కొండపి నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కొంతకాలంగా అధికార పార్టీని కలవర పెడుతూనే ఉన్నాయి. వర్గాలుగా విడిపోవడంతో పాటు ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి తరచూ ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారింది. జిల్లా, రాష్ట్ర స్థాయిలోని ముఖ్య నేతలు ఎన్నిసార్లు పంచాయితీలు నిర్వహించినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోయింది. గత మూడేళ్లుగా ఇవే దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి. ఈ నేపథ్యంలో వరికూటి అశోక్బాబు తల్లి కోటమ్మ అంతిమయాత్రకూ ఓ వర్గం దూరంగానే ఉండిపోయింది. వాస్తవానికి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వస్తుండటంతో అందరూ హాజరవుతారని.. పార్టీలోని అన్ని వర్గాలు ఏకం అవుతాయని, విబేధాలకు తెర పడుతుందని అధిష్ఠానం ఆశించింది. సీఎం పరామర్శ పర్యటన ప్రశాంతంగా ముగిసినప్పటికీ.. పార్టీ అధిష్ఠానం ఆశించిన విధంగా నియోజకవర్గంలో వర్గపోరుకు తెర పడకపోవడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.
పలకరింపునకూ రాలేదు...: సీఎం పర్యటన సందర్భంగా నియోజకవర్గంలో ఆరు మండలాల నుంచి నాయకులు, కార్యకర్తలు కారుమంచికి వచ్చారు. అయితే ఇంతకుముందు బాధ్యుడిగా పనిచేసిన మాదాసి వెంకయ్య వర్గం మాత్రం ఎక్కడా కనిపించలేదు. టంగుటూరుకు చెందిన రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ ఛైర్పర్సన్ బొడ్డపాటి అరుణ, రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షుడు బొట్ల రామారావు, రీజినల్ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, సహకార సంఘం అధ్యక్షుడు నిడమానూరు రమణారెడ్డి ఎక్కడా కనిపించలేదు. అలాగే వైకాపా వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు భక్తుల అశోక్కుమార్రెడ్డి, ఆర్టీసీ నెల్లూరు రీజినల్ ఛైర్పర్సన్ బత్తుల సుప్రజారెడ్డి, సింగరాయకొండ ఎంపీపీ కట్టా శోభారాణి, జడ్పీ వైస్ ఛైర్పర్సన్ ఎన్నాబత్తిన అరుణ కూడా హాజరు కాలేదు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ పల్లెల నరసింహారెడ్డి, మర్పిపూడి జడ్పీటీసీ సభ్యుడు వెంకట్రావు, మర్రిపూడి సహకార సంఘం అధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డి, ఎంపీపీ బోధ రమణారెడ్డి, కొండపి సొసైటీ ఛైర్మన్ బొక్కిసం ఉపేంద్ర చౌదరి, జరుగుమల్లి ఎంపీపీ బెల్లం నిర్మల, జడ్పీటీసీ సభ్యురాలు మాతంగి చంద్రలేఖ పర్యటనకు దూరంగా ఉండిపోయారు. కార్యక్రమం నిర్వహిస్తున్న కారుమంచి గ్రామంలోని వరికూటి అశోక్బాబు వ్యతిరేక వర్గానికి చెందిన నీరుకొండ సింగయ్య, సిరిపురపు భాస్కర్రెడ్డి, ఇతర నాయకులు కూడా రాలేదు.
పోలీసు వలయంలో కారుమంచి
వాహనంలోని ముఖ్యమంత్రి జగన్ను కంచెకు అవతల నిల్చుని చూస్తున్న గ్రామస్థులు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కారుమంచి గ్రామాన్ని పోలీసులు సోమవారం తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. వైకాపా కొండపి నియోజకవర్గ బాధ్యుడు వరికూటి అశోక్బాబు తల్లి కోటమ్మ మృతదేహానికి నివాళి అర్పించేందుకు సీఎం రానున్నారనే సమాచారం ఆదివారం మధ్యాహ్నం జిల్లా యంత్రాంగానికి అందింది. దీంతో పోలీసులు ఆగమేఘాల మీద బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అదనపు ఎస్పీలు నాగేశ్వరరావు(అడ్మిన్) శ్రీధర్రావు(క్రైమ్స్), అశోక్బాబు(ఏఆర్)తో కలిసి ఎస్పీ మలికా గార్గ్ గ్రామంలో అదేరోజు పర్యటించి బందోబస్తు ప్రణాళిక రచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని హెలిప్యాడ్తో పాటు సీఎం కాన్వాయ్ ప్రయాణించే మార్గాన్ని పరిశీలించారు. జిల్లాలోని 1,200 మంది సిబ్బందిని హుటాహుటిన కారుమంచి రప్పించారు. సీఎం కాన్వాయ్ సాగే మార్గంలో ఉన్న కాలనీలను పూర్తిగా బ్యారికేడ్లతో మూసేశారు. స్థానికులు ఎవరూ ఆ వైపు రాకుండా నిరోధించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విధులు నిర్వహించిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
ఆవేదన తెలిపేందుకూ అడ్డగింతలు...
కారుమంచి గ్రామ యువత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
‘నలభై ఏళ్ల పాటు క్రికెట్ ఆడేందుకు వినియోగించుకుంటున్నాం. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మైదానంలా తీర్చిదిద్దుకున్నాం.. నాయకులు నమ్మకద్రోహం చేశారు. మా క్రికెట్ మైదానాన్ని మాకు కాకుండా చేశారు. సీఎం గారూ.. మీరైనా మాకు న్యాయం చేయండి. మైదానం దక్కేలా చూడండి’ అంటూ కారుమంచి గ్రామ యువత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తమ ఆవేదనను నివేదించేందుకు ప్రయత్నించారు. క్రికెట్ మైదానాన్ని తాము తీర్చిదిద్దుకున్న తీరు, ప్రస్తుతం దాని దుస్థితిని తెలిపేలా ఛాయాచిత్రాలతో భారీ ఫ్లెక్సీ తయారుచేశారు. సీఎం కాన్వాయ్ సాగే మార్గంలో ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని చివరి నిమిషంలో గుర్తించిన బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు ఫ్లెక్సీ స్వాధీనం చేసుకుని పక్కనపెట్టారు. ప్రదర్శించేందుకు ప్రయత్నించిన యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.
న్యూస్టుడే, ఒంగోలు క్రీడావిభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీఎస్పీలొస్తుంటారు.. పోతుంటారు ఆ కంత్రీ కానిస్టేబుళ్లు లోకల్
[ 28-03-2024]
పశ్చిమంలోని కీలకమైన పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలో ఇద్దరు కానిస్టేబుళ్లు దీర్ఘకాలికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అధికార పార్టీ నేతలపై ఎనలేని స్వామి భక్తి చాటుకుంటున్నారు. కార్యాలయంలోని కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్నారు. -
కారు, లారీ ఢీ.. ముగ్గురు మృతి
[ 28-03-2024]
టంగుటూరు టోల్ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
తలుపు తట్టనున్న ఓటు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల శంఖం మోగింది. ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. మే 13న పోలింగ్ ఉండనుంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి ఓ సువర్ణావకాశానికి తెర లేపింది. -
రూ.45 లక్షల విలువైన డబ్బు, మద్యం స్వాధీనం
[ 28-03-2024]
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్నట్లుగా అనుమానించిన సుమారు రూ.45 లక్షల విలువైన డబ్బు, మద్యం, ఇతర వస్తువులను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
దర్శి బరిలో నిలిచేదెవరు!
[ 28-03-2024]
జిల్లా రాజకీయాలను ఉత్కంఠతో ఊపేస్తున్న నియోజకవర్గం దర్శి. ఇక్కడి నుంచి తెదేపా కూటమి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. -
త్వరలో మూడు చోట్ల జనసేన సభలు, రోడ్షోలు
[ 28-03-2024]
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జనసేన అధినేత పవన్కల్యాణ్ను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
కీలుబొమ్మల స్వామిభక్తి
[ 28-03-2024]
ప్రజాధనాన్ని తాము వేతనంగా పొందుతున్నామనే విషయాన్ని పలువురు వాలంటీర్లు విస్మరిస్తున్నారు. ఫక్తు వైకాపా కార్యకర్తల అవతారమెత్తారు. -
ఎన్నికల వేళ.. ఎన్ని విచిత్రాలో అన్నా
[ 28-03-2024]
అయిదేళ్లుగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. చిన్నపాటి మరమ్మతులు.. వీధి దీపాల ఏర్పాటు వంటి వాటిని కూడా గాలికొదిలేసిన పాలకులకు ఎన్నికల వేళ జ్ఞానోదయం అయింది. -
ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు
[ 28-03-2024]
ఎన్నికల ప్రచారం, ఇతరత్రా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కొందరు వాలంటీర్లు బేఖాతరు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిపై వేటు చేసినా.. వారు గడిన పడటం లేదు. -
భారీగా అక్రమ మద్యం స్వాధీనం
[ 28-03-2024]
అర్థవీడు మండలం పోతురాజుటూరు- యాచవరం గ్రామాల నడుమ కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఇద్దరి వ్యక్తులను అరెస్టు చేసినట్లు మార్కాపురం సెబ్ డీఎస్పీ దుర్గాప్రసాద్ తెలిపారు. -
ఆక్వాలో ఉపాధికి అపార అవకాశం
[ 28-03-2024]
ఆక్వారంగం నేడు ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదుకుంటోందని, ఇందులో ఉపాధికి అపార అవకాశాలున్నాయని ఆంధ్రకేసరి విశ్వ విద్యాలయం ఉప కులపతి ఎం.అంజిరెడ్డి అన్నారు. -
విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిలకు దేహశుద్ధి
[ 28-03-2024]
పదో తరగతి పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థినులను కొందరు ఆకతాయిలు వేధిస్తుండగా, బాలికల బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
ఒంగోలు ఆర్వోపై కలెక్టర్ ఆగ్రహం
[ 28-03-2024]
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఒంగోలు ఆర్డీవో, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జీవీ.సుబ్బారెడ్డిపై కలెక్టర్ దినేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కమనీయం.. ప్రతిష్ఠా మహోత్సవం
[ 28-03-2024]
శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని సంతనూతలపాడులో బుధవారం కనులపండువగా నిర్వహించారు. -
ముగిసిన పదో తరగతి ప్రధాన పరీక్షలు
[ 28-03-2024]
పదో తరగతి ప్రధాన పరీక్షలు బుధవారంతో ముగిశాయి. సంస్కృతం, వృత్తి విద్యకు సంబంధించినవి ఈ నెల 30 వరకు కొనసాగుతాయి. -
జీజీహెచ్లో రోగుల భోజనంపై విచారణ
[ 28-03-2024]
సర్వజన ఆసుపత్రిలో రోగులకు నాణ్యతలేని భోజనం పెడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై వైద్య విద్య డైరెక్టరేట్ విభాగం అధికారులు స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం