ఒంగోలు పోస్టులపై పొరుగు కళ్లు
ఒంగోలు నగరంలో సీఐల నియామకంపై తలెత్తిన సందిగ్ధతకు ఇంకా తెర పడలేదు. ఇటీవల వరకు రెండో పట్టణ సీఐగా పనిచేసిన ఎన్.రాఘవరావు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బదిలీ అయ్యారు.
నేతల చుట్టూ పోలీసుల ప్రదక్షిణలు
భర్తీపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే:
ఒంగోలు నగరంలో సీఐల నియామకంపై తలెత్తిన సందిగ్ధతకు ఇంకా తెర పడలేదు. ఇటీవల వరకు రెండో పట్టణ సీఐగా పనిచేసిన ఎన్.రాఘవరావు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి బదిలీ అయ్యారు. తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి గ్రామీణ సర్కిల్కు బదిలీ కావడంతో ఈ పోస్టు కూడా ఖాళీ అయ్యింది. ఒంగోలు ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్ను కూడా బదిలీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో జిల్లా కేంద్రంలోని మూడు స్టేషన్లకూ కొత్త సీఐలు వచ్చే అవకాశం ఉంది. ఈ పోస్టులపై పలువురి కళ్లు పడ్డాయి. వీటిని దక్కించుకునేందుకు ప్రస్తుతం వీఆర్లో ఉన్న పలువురు సీఐలతో పాటు పొరుగునే ఉన్న గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి కూడా పలువురు అధికారులు పోటీ పడుతున్నారు. రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండటం, పలువురి నుంచి ప్రతిపాదనలు వెల్లువెత్తుతుండటంతో అధికారులకూ ఏంచేయాలో పాలుపోవడం లేదు. ఈ నేపథ్యంలో ఎవరు మెరుగు అనే అంశంపై దృష్టి సారించారు. దీంతో ఒంగోలులోని స్టేషన్లలో ముఖ్యమైన పోస్టుల భర్తీపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. వీటిపై త్వరలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
గ్రామీణ సీఐగా శ్రీనివాసరెడ్డి..!: ప్రస్తుతం ఒంగోలు తాలూకా సీఐగా పనిచేస్తున్న వి.శ్రీనివాసరెడ్డిని ఒంగోలు గ్రామీణ సీఐగా బదిలీ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ డాక్టర్ సి.ఎం.త్రివిక్రమ వర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. సుమారు నెల రోజులకు పైగా ఒంగోలు గ్రామీణ సర్కిల్ ఖాళీగా ఉంది. దీంతో సింగరాయకొండ సీఐ రంగనాథ్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానాన్ని శ్రీనివాసరెడ్డితో భర్తీ చేసినట్లైంది. ప్రస్తుతం జిల్లా పోలీసు కేంద్రంలోని ఐసీసీఆర్లో ఉన్న కె.వి.రాఘవేంద్రను పొదిలి సీఐగా, రేంజ్ వీఆర్లో ఉన్న ఎ.శివరామకృష్ణారెడ్డిని కనిగిరి సీఐగా నియమించినట్టు తెలిసింది. అక్కడ పనిచేస్తున్న యు.సుధాకర్రావు, బి.పాపారావులను వీఆర్కు పంపారు. దీనిపై మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్