logo

కొనసాగిన ప్రజా చైతన్య యాత్ర

తెదేపా అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని మార్కాపురం తెదేపా ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు.

Published : 28 Mar 2023 02:09 IST

కొనకనమిట్ల, న్యూస్‌టుడే: తెదేపా అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని మార్కాపురం తెదేపా ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి, మార్కాపురం జిల్లా ఏర్పాటును కాంక్షిస్తూ ఆయన చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర సోమవారం కొనకనమిట్ల మండలంలో సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే సుమారు రూ. 5వేల కోట్లు అవసరం అవుతాయన్నారు. ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం నామమాత్రంగా రూ.101 కోట్లే కేటాయించిందని విమర్శించారు. యర్రగొండపాలెం తెదేపా ఇన్‌ఛార్జి ఎరిక్షన్‌ బాబు తన సంఘీభావం తెలిపి ఆయనతో కలిసి యాత్రలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని