logo

గుర్తు తెలియని మృతదేహం స్వాధీనం

మండలంలోని పాతసింగరాయకొండ గ్రామ పరిధిలోని పశువుల కుంటలో గుర్తు తెలియని వ్యక్తి(30) మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Published : 28 Mar 2023 02:09 IST

సింగరాయకొండ గ్రామీణం: మండలంలోని పాతసింగరాయకొండ గ్రామ పరిధిలోని పశువుల కుంటలో గుర్తు తెలియని వ్యక్తి(30) మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై ఫిరోజా ఫాతిమా తెలిపిన వివరాల మేరకు ..అయ్యప్ప నగర్‌ శ్మశానవాటిక వెనుక వైపు ఉన్న పశువుల కుంటలో మృతదేహం తేలియాడుతోందని స్థానిక పశువుల కాపరులు తెలపగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక యువనేస్తం సభ్యులతో మృతదేహాన్ని వెలికితీయించి పరిశీలించారు. చనిపోయిన వ్యక్తి వయస్సు ముప్ఫై సంవత్సరాలు ఉంటుందన్నారు. మృతుని శరీరంపై గోధుమ రంగు చొక్కా, నీలం రంగు ఫ్యాంటు ఉన్నాయి. కుడి చేతిపై అమ్మ, త్రిశూలం, సన్నీ, అన్నాచెల్లి అనే పచ్చబొట్లు ఉన్నాయన్నారు. శవ పంచనామా కోసం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు  తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని