డబ్బులిస్తారా! కోర్టు మెట్లెక్కించమంటారా!!
‘కారుకు రూ.ఏడు వేలు, పందెం పుంజుకు రూ.40 వేలు ఇవ్వండి. డబ్బులిస్తేనే వాటిని వదిలిపెడతాం.. లేదంటే కేసు కట్టి న్యాయస్థానంలో ప్రవేశపెడతాం. ఆ తర్వాత కార్లు తీసుకోవటం అంత సులభం కాదు.
న్యాయస్థానానికి అప్పగిస్తే మీకే నష్టం
చర్చనీయాంశంగా ఓ పోలీసు వ్యవహారం
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే: ‘కారుకు రూ.ఏడు వేలు, పందెం పుంజుకు రూ.40 వేలు ఇవ్వండి. డబ్బులిస్తేనే వాటిని వదిలిపెడతాం.. లేదంటే కేసు కట్టి న్యాయస్థానంలో ప్రవేశపెడతాం. ఆ తర్వాత కార్లు తీసుకోవటం అంత సులభం కాదు. రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలు విలువజేసే కోళ్లను కోర్టులో పెడితే మీకే నష్టం. అందుకే మేం అడిగినంతా ఇచ్చి తీసుకెళ్తారో.. లేదంటే న్యాయస్థానంలో ప్రవేశపెట్టమంటారో.. మీరే తేల్చుకోండి’ అంటూ జూదరులకు ఓ పోలీసు అధికారి హుకుం జారీ చేశారు. చేసేదేమీ లేక అడిగినంత చెల్లించి బయటపడ్డారు ఆ జూదగాళ్లు. ఈ ఉదంతం ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.
దొరికిన పొరుగు జిల్లాల వాసులు...: జిల్లా కేంద్రానికి సమీపంలోని ఒక తీర ప్రాంత గ్రామంలో భారీస్థాయిలో కోడిపందేల శిబిరం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం పోలీసు అధికారులకు అందింది. దీంతో జిల్లా కేంద్రం నుంచి ఒక అధికారి సిబ్బందితో వెళ్లి దాడి చేశారు. పెద్దసంఖ్యలో కోళ్లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జూదరులు పట్టుబడ్డారు. వీరిలో స్థానికులు మాత్రమే కాకుండా పొరుగు జిల్లాలకు చెందినవారు కూడా ఉన్నారు. పట్టుబడిన పందెంకోళ్లు, వాహనాలు, జూదగాళ్లను స్థానిక పోలీసులకు అప్పగించారు.
బేరసారాలకు తెర లేపి...: దాడి.. అప్పగింత అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆ పోలీసు అధికారి జూదరులతో బేరసారాలకు తెర లేపారు. దొరికిన కార్లను విడిచి పెట్టాలంటే ఒక ధర, కోడిని న్యాయస్థానంలో హాజరుపర్చకుండా ఉండాలంటే మరో ధర చెల్లించాలంటూ మాట్లాడారు. కారుకు రూ.ఏడు వేలు, కోడికి రూ.40 వేలు చెల్లిస్తేనే సంప్రదింపులుంటాయని, లేదంటే న్యాయస్థానంలోనే తేల్చుకోవాలంటూ హుకుం జారీ చేశారు. పట్టుబడిన వాటిని ఒక్కసారి కోర్టులో ప్రవేశపెడితే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో తెలుసుకోవాలంటూ హెచ్చరించారు. పట్టుబడినవారిలో అత్యధికులు పొరుగు జిల్లాలవారు ఉండటంతో చేసేదేమీలేక అడిగినంత ముట్టజెప్పి కోళ్లు, కార్లను తీసుకెళ్లారు.
ఉన్నతాధికారుల అంతర్గత విచారణ...: తన చేతికి డబ్బులు అందడంతో దాడిలో పట్టుబడిన వాహనాల్లో సుమారు ఎనిమిదింటిని ఆ అధికారి పక్కకు తప్పించేశారు. కేవలం ఒక ట్రాక్టర్, ఒక ఆటోతో పాటు మరికొన్ని ద్విచక్ర వాహనాలు మాత్రమే దొరికినట్టు చూపారు. పట్టుబడిన పందెంకోళ్ల విలువ రూ. లక్షల్లో ఉండటంతో ఒక్కో దానికి రూ.40 వేలు వసూలు చేశారు. అనంతరం సాధారణ నాటుకోళ్లను కేసులో చూపి మమ అనిపించారు. ఈ మొత్తం ఉదంతంలో కీలకమైన కోడిపందేల శిబిరం నిర్వాహకుడిని కూడా మార్చి అతని స్థానంలో వేరొకరిని నిందితుడిగా చూపారనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారడంతో ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేశారు. ఆ అధికారి చేతివాటం నిజమేనని నిర్ధారించుకున్నట్టు తెలిసింది. త్వరలో అతనిపై చర్యలకు ఉపక్రమించనున్నట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
[ 19-04-2024]
మనసున్న డాక్టరమ్మ ఓ వైపు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తూనే.. తనలోని వైద్యురాలి మనసును చాటుకున్నారు తెదేపా కూటమి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. -
పంచాయతీలకు ‘దొంగ’ దెబ్బ
[ 19-04-2024]
పల్లెలు పచ్చగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. స్వయంప్రతిపత్తి కలిగిన పాలనా యూనిట్లుగా గ్రామాలను ఎదగనిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయని జాతి నిర్మాతలు ఆశించారు. -
నడిచినప్పుడు గొప్పలు.. గద్దెనెక్కి కోతలు
[ 19-04-2024]
నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీలని ప్రతి సభలోనూ పదే పదే పలికే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. ఆయా వర్గాల్లోని తమకు తీవ్ర అన్యాయం చేశారని 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో పాదయాత్ర చేస్తున్న జగన్ను నిరుద్యోగులు కలిసి తమ సమస్య విన్నవించారు. -
ఇంత బరితెగింపు ఏమిటన్నా!
[ 19-04-2024]
ఎన్నికల వేళ వైకాపా నాయకులు బరితెగిస్తున్నారు. కోడ్ అమలులో ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. -
అభ్యర్థి ప్రమాణపత్రం.. కారాదు ప్రత్యర్థికి అస్త్రం
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి గురువారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం మొదలైంది. మొదటిరోజు ఒంగోలు ఎంపీ స్థానానికి 4, కనిగిరి, గిద్దలూరు, కొండపి, సంతనూతలపాడు, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలకు తొమ్మిది మంది చొప్పున మొత్తం 13 మంది తమ నామపత్రాలు సమర్పించారు. -
‘సారా’క్షసులు
[ 19-04-2024]
జగన్ ఏలుబడిలో తయారవుతున్న కల్తీ మద్యం, సారా పచ్చని కుటుంబాల్ని ఛిద్రం చేస్తున్నాయి. నాసిరకం ‘జె’ బ్రాండ్లకు కొనుగోలు చేయలేని వారు ఈ ‘నాటు’ కాటుకు బలవుతున్నారు. -
పనులు ఆపేసి.. మూసీలా మార్చేసి
[ 19-04-2024]
పేరుకే జిల్లా కేంద్రం..సొగసు చూస్తే దుర్భరం. ఇదీ ఒంగోలు పరిస్థితి. నగరంలో మురుగంతా తరలించే పోతురాజు కాలువ నవీకరణ బాగోతం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. -
మొదలైన ఎన్నికల సందడి
[ 19-04-2024]
జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. గురువారం కనిగిరి, దర్శి వైకాపా అభ్యర్థులు దద్దాల నారాయణ యాదవ్, బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామపత్రాలు దాఖలు చేశారు. -
ఆంక్షలతో అష్టకష్టాలు
[ 19-04-2024]
ఒంగోలులోని కలెక్టరేట్లో పార్లమెంట్ స్థానానికి, ఎదురుగా ఉన్న రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి ఈ నెల 25వ తేది వరకు నిర్వహించనున్న నామపత్రాల ప్రక్రియను గురువారం ప్రారంభించారు. -
బావను హత్య చేసి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
[ 19-04-2024]
మద్యానికి బానిసై తన అక్కను వేధిస్తున్నాడనే కోపంతో సొంత బావను అంబులెన్స్ వాహనంతో ఢీకొట్టి హత్య చేసి దాన్ని రహదారి ప్రమాదంగా చిత్రీకరించిన నిందితుడిని పోలీసులు గురువారం కోర్టులో హాజరు పరిచారు. -
శివారు.. అంటేనే చిరాకు..!
[ 19-04-2024]
పట్టణంలోని శివారు కాలనీలపై ఇటు అధికారులు, అటు పాలకులు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఆ కాలనీలు కనీస వసతులకు నోచుకోలేదు. -
జగనూ.. తాగించి చిదిమేస్తావా?
[ 19-04-2024]
ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఒక పక్క చెబుతూనే వైకాపా ప్రభుత్వం విచ్చలవిడిగా అమ్మకాలకు అనుమతులు ఇచ్చింది. నియంత్రణ లేకపోవడంతో మద్యం అమ్మకాలకు అడ్డే లేకుండా పోయింది. -
తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 19-04-2024]
రాష్ట్రాభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని మార్కాపురం నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. పొదిలి మండలంలోని వేలూరు, టి.సళ్లూరు, తలమల్ల, గోగినేనివారిపాలెం, ఉప్పలపాడు గ్రామాల్లో గురువారం మాగుంట రాఘవరెడ్డితో కలిసి పర్యటించారు.