అవినీతిపై ఫిర్యాదు చేస్తే చంపుతామంటున్నారు
సింగరాయకొండ పంచాయతీ కార్యాలయంలో మూడేళ్లుగా చోటుచేసుకున్న అక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినందుకు తనను చంపుతామంటూ వైకాపా నాయకులు బెదిరిస్తున్నారని జనసేన మండల అధ్యక్షుడు రాజేష్ అన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న రాజేష్.. పక్కన జనసేన నాయకులు
సింగరాయకొండ గ్రామీణం, న్యూస్టుడే: సింగరాయకొండ పంచాయతీ కార్యాలయంలో మూడేళ్లుగా చోటుచేసుకున్న అక్రమాలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినందుకు తనను చంపుతామంటూ వైకాపా నాయకులు బెదిరిస్తున్నారని జనసేన మండల అధ్యక్షుడు రాజేష్ అన్నారు. సింగరాయకొండలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగంతో పాటు పంచాయతీలో సుమారు రూ. 14 లక్షల ప్రజాధనాన్ని దారి మళ్లించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల స్పందనలో కలెక్టర్కు ఫిర్యాదు అందించినట్టు తెలిపారు. దీనికి స్పందించిన ఆయన అధికారులతో విచారణ చేయించారని.. బాధ్యులుగా గుర్తిస్తూ పంచాయతీ కార్యదర్శి శరత్బాబు, జూనియర్ సహాయకురాలు శైలజ, కంప్యూటర్ ఆపరేటర్ సురేష్లపై చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. విషయం తెలుసుకున్న వైకాపా స్థానిక నాయకులు తనపై కక్ష పెంచుకున్నారన్నారు. చరవాణిలో అసభ్యకరంగా మాట్లాడటంతో పాటు చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ముప్ఫై మంది వ్యక్తులు తన దుకాణం, ఇంటి వద్దకు వచ్చి దుర్భాషలాడారని ఆందోళన వెలిబుచ్చారు. తనకు ప్రాణహాని ఉన్నందున బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కందుకూరు రోడ్డు కూడలిలో జనసేన నాయకులు, కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. పోలీసు స్టేషన్కు వెళ్లి నిందితులపై చర్యలు తీసుకోవాలని ఎస్సై ఫిరోజ్ఫాతిమాకు ఫిర్యాదు చేశారు. ఆయా కార్యక్రమాల్లో జనసేన పొన్నలూరు మండల అధ్యక్షుడు మనోజ్కుమార్, నాయకులు శ్రీనివాస్, చాన్బాషా, నాగరాజు, రాధిక, మాధురి, రజని తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీఎస్పీలొస్తుంటారు.. పోతుంటారు ఆ కంత్రీ కానిస్టేబుళ్లు లోకల్
[ 28-03-2024]
పశ్చిమంలోని కీలకమైన పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలో ఇద్దరు కానిస్టేబుళ్లు దీర్ఘకాలికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అధికార పార్టీ నేతలపై ఎనలేని స్వామి భక్తి చాటుకుంటున్నారు. కార్యాలయంలోని కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్నారు. -
కారు, లారీ ఢీ.. ముగ్గురు మృతి
[ 28-03-2024]
టంగుటూరు టోల్ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
తలుపు తట్టనున్న ఓటు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల శంఖం మోగింది. ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. మే 13న పోలింగ్ ఉండనుంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి ఓ సువర్ణావకాశానికి తెర లేపింది. -
రూ.45 లక్షల విలువైన డబ్బు, మద్యం స్వాధీనం
[ 28-03-2024]
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్నట్లుగా అనుమానించిన సుమారు రూ.45 లక్షల విలువైన డబ్బు, మద్యం, ఇతర వస్తువులను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
దర్శి బరిలో నిలిచేదెవరు!
[ 28-03-2024]
జిల్లా రాజకీయాలను ఉత్కంఠతో ఊపేస్తున్న నియోజకవర్గం దర్శి. ఇక్కడి నుంచి తెదేపా కూటమి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. -
త్వరలో మూడు చోట్ల జనసేన సభలు, రోడ్షోలు
[ 28-03-2024]
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జనసేన అధినేత పవన్కల్యాణ్ను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
కీలుబొమ్మల స్వామిభక్తి
[ 28-03-2024]
ప్రజాధనాన్ని తాము వేతనంగా పొందుతున్నామనే విషయాన్ని పలువురు వాలంటీర్లు విస్మరిస్తున్నారు. ఫక్తు వైకాపా కార్యకర్తల అవతారమెత్తారు. -
ఎన్నికల వేళ.. ఎన్ని విచిత్రాలో అన్నా
[ 28-03-2024]
అయిదేళ్లుగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. చిన్నపాటి మరమ్మతులు.. వీధి దీపాల ఏర్పాటు వంటి వాటిని కూడా గాలికొదిలేసిన పాలకులకు ఎన్నికల వేళ జ్ఞానోదయం అయింది. -
ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు
[ 28-03-2024]
ఎన్నికల ప్రచారం, ఇతరత్రా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కొందరు వాలంటీర్లు బేఖాతరు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిపై వేటు చేసినా.. వారు గడిన పడటం లేదు. -
భారీగా అక్రమ మద్యం స్వాధీనం
[ 28-03-2024]
అర్థవీడు మండలం పోతురాజుటూరు- యాచవరం గ్రామాల నడుమ కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఇద్దరి వ్యక్తులను అరెస్టు చేసినట్లు మార్కాపురం సెబ్ డీఎస్పీ దుర్గాప్రసాద్ తెలిపారు. -
ఆక్వాలో ఉపాధికి అపార అవకాశం
[ 28-03-2024]
ఆక్వారంగం నేడు ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదుకుంటోందని, ఇందులో ఉపాధికి అపార అవకాశాలున్నాయని ఆంధ్రకేసరి విశ్వ విద్యాలయం ఉప కులపతి ఎం.అంజిరెడ్డి అన్నారు. -
విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిలకు దేహశుద్ధి
[ 28-03-2024]
పదో తరగతి పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థినులను కొందరు ఆకతాయిలు వేధిస్తుండగా, బాలికల బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
ఒంగోలు ఆర్వోపై కలెక్టర్ ఆగ్రహం
[ 28-03-2024]
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఒంగోలు ఆర్డీవో, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జీవీ.సుబ్బారెడ్డిపై కలెక్టర్ దినేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కమనీయం.. ప్రతిష్ఠా మహోత్సవం
[ 28-03-2024]
శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని సంతనూతలపాడులో బుధవారం కనులపండువగా నిర్వహించారు. -
ముగిసిన పదో తరగతి ప్రధాన పరీక్షలు
[ 28-03-2024]
పదో తరగతి ప్రధాన పరీక్షలు బుధవారంతో ముగిశాయి. సంస్కృతం, వృత్తి విద్యకు సంబంధించినవి ఈ నెల 30 వరకు కొనసాగుతాయి. -
జీజీహెచ్లో రోగుల భోజనంపై విచారణ
[ 28-03-2024]
సర్వజన ఆసుపత్రిలో రోగులకు నాణ్యతలేని భోజనం పెడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై వైద్య విద్య డైరెక్టరేట్ విభాగం అధికారులు స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
-
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
-
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!