logo

సీఎం వద్దంటే పోటీ నుంచి వైదొలుగుతా...

తమ తల్లికి నివాళి అర్పించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి రావడాన్ని ఓర్వలేని కొందరు బురదజల్లే కుట్రలకు తెర తీశారని వైకాపా కొండపి నియోజకవర్గ బాధ్యుడు వరికూటి అశోక్‌బాబు విమర్శించారు.

Published : 30 Mar 2023 02:33 IST

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైకాపా కొండపి నియోజకవర్గ బాధ్యుడు వరికూటి అశోక్‌బాబు,
డాక్టర్‌ అమృతపాణి.. చిత్రంలో నాయకులు

ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్‌టుడే: తమ తల్లికి నివాళి అర్పించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి రావడాన్ని ఓర్వలేని కొందరు బురదజల్లే కుట్రలకు తెర తీశారని వైకాపా కొండపి నియోజకవర్గ బాధ్యుడు వరికూటి అశోక్‌బాబు విమర్శించారు. ఒంగోలులోని వైకాపా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన సోదరుడు డాక్టర్‌ అమృతపాణితో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలో ఏ నియోజకర్గంలోనూ లేనివిధంగా కేవలం కొండపిలోనే నాయకుల మధ్య వర్గపోరు ఉన్నట్టు కొందరు చిత్రీకరిస్తున్నారని అన్నారు. తనను ఎమ్మెల్యేగా చూడటం అనేది తన తల్లి కోరికని, అందుకు సీఎం జగన్‌ హామీ ఇచ్చారని చెప్పారు. తన అభ్యర్థితాన్ని ఆయన వద్దనుకుంటే పోటీ నుంచి వైదొలగడానికి సిద్ధమని వరికూటి తెలిపారు. ఈ మేరకు తెల్లకాగితంపై సంతకం చేసి ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు తెదేపా హయాంలోనూ చోటుచేసుకున్నాయన్నారు. దళితుల ఇళ్లకు సీఎం రావడాన్ని కొందరు సహించలేక పోతున్నారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో కొండపి నియోజకవర్గానికి చెందిన పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని