కేంద్రం సరే... ధాన్యం కొనుగోళ్లేవీ?
ప్రతికూల పరిస్థితులను అధిగమించి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వరి సాగు చేసిన రైతులు... ఇప్పుడు ఆ పంటను అమ్ముకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు.
ధాన్యాన్ని ఆరబోస్తున్న రైతు స్వామిరెడ్డి
ప్రతికూల పరిస్థితులను అధిగమించి, ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వరి సాగు చేసిన రైతులు... ఇప్పుడు ఆ పంటను అమ్ముకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. మరోవైపు ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురుస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. కనపర్తి ఎత్తిపోతల పథకం కింద ఈ ఏడాది సుమారు 3,200 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. మంచి దిగుబడులూ వచ్చాయి. ఈ పరిధిలో రెండు రైతు భరోసా కేంద్రాలు ఉండగా ఒక్క కొనుగోలు కేంద్రాన్ని మాత్రమే ఏర్పాటు చేశారు. నెల రోజుల క్రితమే దీనిని ప్రారంభించినా... కొనుగోళ్లు మాత్రం తూతూమంత్రంగా సాగుతున్నాయి. ఈ పరిధిలో 500 లారీలకు పైగా ధాన్యం దిగుబడి వచ్చినట్లు అంచనా కాగా... ఇప్పటి వరకు ఇరవై లారీల ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. దీనిని బట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పంట మొత్తం కల్లాలు, రహదారులపైనే ఆరబోశారు. గత కొద్ది రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉండడం... తరచూ చిరు జల్లులు పడుతుండడంతో ధాన్యాన్ని కాపాడుకొనేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లలో నిల్వ చేసే పరిస్థితి లేదని... భారీ వర్షం పడితే మొత్తం నష్టపోక తప్పదని ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా... అధికారుల దృష్టికి సమస్య తీసుకువెళ్లినా ఫలితం లేకపోతోందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి... త్వరితగతిన కొనుగోళ్లు జరిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
న్యూస్టుడే, నాగులుప్పలపాడు
కొనుగోలు కేంద్రం వద్ద రైతుల పడిగాపులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరితెగింపు నేతలు.. ప్రలోభాల్లో తోపులు
[ 29-03-2024]
ఎన్నికల కోడ్ను అధికార వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. -
ఎన్నికల వేళ.. చిల్లర పనులు
[ 29-03-2024]
గద్దెనెక్కింది మొదలు వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసింది. చేసిన పనులకు చెల్లింపులు లేకపోవడంతో కొత్తగా చేయడానికి గుత్తేదారులు ముందుకురాలేదు. -
అంబా అని అరిచినా ఆలకించరేం
[ 29-03-2024]
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. -
నెత్తురోడ్డాయి..
[ 29-03-2024]
జిల్లాలోని రోడ్లు గురువారం నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ఘటనలు, ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. పెళ్లి బృందంతో వస్తున్న కారు.. -
రాజకీయ నేపథ్య ఖైదీలపై ప్రత్యేక దృష్టి
[ 29-03-2024]
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున లైసెన్స్లు కలిగిన ఆయుధాలను తిరిగి డిపాజిట్ చేయించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. -
యుద్ధానికి నేనూ సిద్ధం
[ 29-03-2024]
వైకాపాలోనే ఉంటూ ఆ పార్టీ నేతల అవినీతి అక్రమాలపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు ఆక్రమిస్తున్నారంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేశారు. -
తెర పైకి మద్దిశెట్టి పేరు
[ 29-03-2024]
దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే తెదేపా కూటమి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లా నేతల అండదండలతో ఇప్పటికే పలువురు తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
రూ.లక్షల వ్యయం.. తీరని దాహం
[ 29-03-2024]
మూగజీవాల దాహార్తి తీర్చేందుకు రూ. లక్షలు ఖర్చు చేసి గ్రామాల్లో నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి. ఐడబ్ల్యూఎంపీ పథకంలో భాగంగా పశ్చిమంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో దానికి రూ. 13 వేలు వెచ్చించి కట్టారు. -
కనిష్ఠ స్థాయికి రామతీర్థం
[ 29-03-2024]
ఒంగోలు ప్రాంత వరప్రదాయిని రామతీర్థం జలాశయం అడుగంటి పోయింది. రిజర్వాయర్లో నీటిమట్టం కనిష్ఠానికి చేరుకోవడంతో గురువారం సాయంత్రం నుంచి దిగువకు నీటి ప్రవాహం నిలిచిపోయింది. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగు ప్రయాణమయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం