ఆంధ్రకేసరి వర్సిటీని తీర్చిదిద్దుతా
ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయాన్ని అన్ని విధాల తీర్చిదిద్ది ప్రత్యేక గుర్తింపు సాధించడానికి కృషి చేస్తానని ఉపకులపతి ఎం.అంజిరెడ్డి తెలిపారు.
ఉప కులపతి అంజిరెడ్డి
మాట్లాడుతున్న ఉపకులపతి అంజిరెడ్డి, హాజరైన కళాశాల ప్రతినిధులు
ఒంగోలు నగరం, న్యూస్టుడే: ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయాన్ని అన్ని విధాల తీర్చిదిద్ది ప్రత్యేక గుర్తింపు సాధించడానికి కృషి చేస్తానని ఉపకులపతి ఎం.అంజిరెడ్డి తెలిపారు. బుధవారం ఉమ్మడి ప్రకాశంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్తో సమావేశం నిర్వహించారు. సీడీసీ డీన్ డాక్టర్ డి.వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. జిల్లాకు విశ్వ విద్యాలయం రావడం ఏళ్ల నాటి కల అని, అది సాకారం అయిందన్నారు. త్వరగా నిధులు సమీకరించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఉప కులపతి మాట్లాడుతూ తాను ప్రకాశం వాసిగా యూనివర్సిటీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈ బాధ్యతలు స్వీకరించానన్నారు. త్వరలో నిధులు సమకూర్చుకొని పేర్నమిట్ట వద్ద భవన నిర్మాణం చేపడతామన్నారు. అన్ని విభాగాలకు బాధ్యులను నియమించామన్నారు. త్వరలో యూనివర్శిటీ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేస్తామని, దాతల సహకారం తీసుకుంటామన్నారు. జిల్లాలో ఆక్వా, మైనింగ్, అటవీ పరిశ్రమలు ఎక్కువుగా ఉన్నందున వాటిలో ఉద్యోగావకాశాలు పొందడానికి వీలుగా విభిన్న కోర్సులు ప్రవేశపెడతామన్నారు. పేర్నమిట్ట వద్ద నిర్మించిన భవనాల్లో అకడమిక్ బ్లాక్ ప్రారంభిస్తామని, ముందుగా అక్కడికి రహదారి సౌకర్యం కల్పిస్తామన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి డిగ్రీ కళాశాలల గుర్తింపు విశ్వ విద్యాలయం ద్వారా ఇస్తామన్నారు. రిజస్ట్రార్ హరిబాబు మాట్లాడుతూ ప్రస్తుతం విశ్వ విద్యాలయానికి స్థానికంగా మూడు రెగ్యులర్ బిల్డింగ్స్, మూడు షెడ్లు ఉన్నాయన్నారు. డీన్ వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని కళాశాల యాజమాన్యాల సహకారంతో త్వరగా అభివృద్ధి చేస్తామన్నారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డి.సోమశేఖర మాట్లాడుతూ ఏపీ పీజీ సెట్ నోటిఫికేషన్ వెలువడిందని, డిగ్రీ విద్యార్థులు ప్రవేశపరీక్ష రాసేలా యాజమాన్యాలు ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ హర్షప్రీతమ్దేవ్, కళాశాల యాజమాన్యాల సంఘం నుంచి బి.సూర్యనారాయణ, గుండా రెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం ఉప కులపతిని సత్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విచ్ఛిన్నం చేసేందుకే విలీనం
[ 25-04-2024]
వైకాపా సర్కార్ అంగన్వాడీ వ్యవస్థలను విచ్ఛిన్నం చేసేందుకు విలీన ప్రక్రియను చేపట్టింది. -
ఊరూరా ఇసుక తోడేళ్ల గుంపు
[ 25-04-2024]
‘రాష్ట్రంలో వనరులను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మట్టి, ఇసుక, రాయి ఏదీ ఉండదు. చివరికి గుడిలో దేవుడు కూడా ఉండడు..’ -
విధులు వీడి.. అదే బరితెగింపు
[ 25-04-2024]
ఎన్నికల సంఘం ఎంతగా చెబుతున్నా.. ఎందరిపై చర్యలు తీసుకుంటున్నా.. కొందరి తీరు ఏమాత్రం మారడం లేదు. -
దాసుల తప్పు ఖాకీలెక్కలతో సరి
[ 25-04-2024]
దర్శిలోని కేబీ బార్ అండ్ రెస్టారెంట్లో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు ఇటీవల తనిఖీ చేశారు. -
భజన బృందం మాట్లాడదేం!
[ 25-04-2024]
పశ్చిమ ప్రకాశంలోని వై.పాలెం నియోజకవర్గం తాగు, సాగునీటి ఇబ్బందులకు కరవు కాటకాలకు పెట్టింది పేరు. -
కూటమి.. కలిసి సమరానికి కదిలి
[ 25-04-2024]
ఎక్కడ చూసినా జనం.. ఎటువైపు చూసినా పసుపు, తెలుపు, కాషాయమయం.. ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల నామినేషన్లను పురస్కరించుకుని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బుధవారం కనిపించిన దృశ్యాలివి. -
వాలంటీర్ల బలవంతపు రాజీనామాలు
[ 25-04-2024]
వైకాపా నేతలు బెదిరింపులకు దిగుతుండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వాలంటీర్లు వరుసగా రాజీనామాలు సమర్పిస్తున్నారు. -
నాడు రైతన్నలా ఠీవి నేడు తిండిగింజల్లేని కూలీ
[ 25-04-2024]
ప్రకృతి కనికరించక.. పాలకులు పట్టించుకోక అభాగ్యులు తల్లడిల్లుతున్నారు. తెలుగుదేశం హయాంలో పలు ప్రోత్సాహకాలు, తగినంత విద్యుత్తు సరఫరాతో సాగు సాఫీగా సాగిపోయింది. -
ఓటర్లను బెదిరిస్తే చర్యలు తప్పవు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ కోరారు. -
వైకాపా నేతలు తరలిస్తున్న మద్యం పట్టివేత
[ 25-04-2024]
వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నేతలు తరలిస్తున్న 180 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
అధికారానికి సలాం.. తెదేపాపై జులుం
[ 25-04-2024]
పోలీసులు వైకాపా సేవలో తరిస్తూ..ప్రతిపక్ష నేతలపై జులుం ప్రదర్శిస్తున్నారు. మొన్న బాలినేని నామినేషన్ సందర్భంగా నిబంధనలు కాలరాసినా నోరెత్తని వారు బుధవారం దామచర్ల నామపత్రం దాఖలు సందర్భంగా అడ్డగించడం వివాదాస్పదమైంది. -
రూ. 2.12 లక్షల నగదు పట్టివేత
[ 25-04-2024]
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న నగదును పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?