logo

వాహనం ఢీకొని దుప్పి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీ కొని దుప్పి మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది.

Published : 30 Mar 2023 02:33 IST

రోడ్డు పక్కన దుప్పి కళేబరం

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: గుర్తు తెలియని వాహనం ఢీ కొని దుప్పి మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. అటవీ శాఖాధికారులు తెలిపిన వివరాల మేరకు .. సంతనూతలపాడు-చీమకుర్తి మధ్యనున్న టపా చెట్టు వద్ద కర్నూల్‌ రోడ్డును దాటుతున్న దుప్పిని గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఫారెస్టు రేంజ్‌ అధికారి నాగేంద్రబాబు, సెక్షన్‌ అధికారి మోహన్‌రావు, బీట్ అధికారి శశిభూషణ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో దుప్పికి చీమకుర్తిలోని పశువైద్యశాలలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం చీమకుర్తి సమీపంలోని అటవీ ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు  అటవీ శాఖాధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని