ఇంటింటికీ పంపిణీ చేయలేం..
‘గత రెండు నెలలుగా జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(ఎండీయూ) వాహనాలు నడపలేకున్నాం. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వాహనాలు నిలిపేసి నిరసన తెలుపుతాం...’ ఇదీ డీఎస్వో ఉదయభాస్కర్కు ఎండీయూ ఆపరేటర్లు ఇటీవల అందజేసిన నోటీసులోని సారాంశం.
అందని జీతాలు.. తేలని కమీషన్
ఆందోళనలో ఎండీయూ ఆపరేటర్లు
నేటి నుంచి నిరసనకు సమాయత్తం
కొత్తపట్నం, న్యూస్టుడే:
గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయంలో నిలిపి ఉంచిన ఎండీయూ వాహనాలు
‘గత రెండు నెలలుగా జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్(ఎండీయూ) వాహనాలు నడపలేకున్నాం. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వాహనాలు నిలిపేసి నిరసన తెలుపుతాం...’ ఇదీ డీఎస్వో ఉదయభాస్కర్కు ఎండీయూ ఆపరేటర్లు ఇటీవల అందజేసిన నోటీసులోని సారాంశం.
ప్రజా పంపిణీ దుకాణాలకు వెళ్లకుండానే సంచార వాహనాల ద్వారా నిత్యావసర సరకులను ఇంటికి చేరవేస్తున్నారు. ఇందుకు అవసరమైన వాహనాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల కింద రాయితీపై బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా వాయిదాల పద్ధతిపై అందించారు. వీటిని నడిపే ఆపరేటర్లకు నెలకు రూ.21 వేలు చొప్పున ప్రభుత్వం వేతనంగా అందిస్తోంది. అందులో కొంత నగదును బ్యాంక్ వాయిదాతో పాటు, ఇంధనం, సహాయకుల ఛార్జీలకు వెచ్చించాల్సి ఉంది. మిగతా సొమ్ముతో నిర్వాహకులు జీవనోపాధి పొందుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ క్రమేపీ పరిస్థితులు మారుతున్నాయి. వాహనాలకు బ్యాంకులే బీమా ప్రీమియం చెల్లిస్తాయని తొలుత చెప్పారు.. తర్వాత ఆపరేటర్లే ఆ భారం భరించాలన్నారు. వీటికితోడు ప్రభుత్వం విడుదల చేస్తున్న వేతనాలు ఖాతాల్లో పడుతున్నప్పటికీ అవి ఆపరేటర్ల చేతికి సక్రమంగా అందడం లేదు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
385 వాహనాలు.. 6,59,576 కుటుంబాలు...: జిల్లాలో 385 ఎండీయూ వాహనాలున్నాయి. వీటి ద్వారా ఆపరేటర్తో పాటు, బియ్యం తూకం వేసే సహాయకుడు ఒకరు ఉపాధి పొందుతున్నారు. వీరు ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 17వ తేదీలోపు జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 6,59,576 కుటుంబాలకు ఇంటి వద్దకే బియ్యంతో పాటు, కందిపప్పు, పంచదార సరఫరా చేస్తున్నారు. అందుకు ప్రభుత్వం రూ.21 వేలు జీతం ఇస్తుండగా.. అందులో రూ.3 వేలు వాహన రుణంగా బ్యాంక్ మినహాయించుకుంటుంది. రూ.18 వేలు ఆపరేటర్ చేతికి వస్తోంది. ఇంధనానికి, సహాయకుడికి కలిపి సుమారు రూ.8 వేల వరకు ఖర్చవుతున్నాయి.
అప్పు కింద జీతాల మినహాయింపు...: ఆపరేటర్ల ఖాతాల్లో గత రెండు నెలలుగా జీతాల సొమ్ము పడుతున్నప్పటికీ బ్యాంకులు అప్పు కింద పూర్తి మొత్తాన్ని మినహాయించుకుంటున్నాయి. సదరు ఖాతాలో వ్యక్తిగతంగా దాచుకున్న సొమ్మును తీసుకోవడానికి కూడా అడ్డుపడుతున్నాయి. ఇటీవల అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన బియ్యం, కందిపప్పును చేరవేసే బాధ్యతను ఎండీయూ ఆపరేటర్లకే అప్పగించారు. అందుకు కమీషన్ రూపంలో అదనపు భత్యం చెల్లిస్తామని ఉన్నతాధికారులు గతంలో హామీ ఇచ్చారు. నెలలు గడుస్తున్నా వాటికి సంబంధించి ఒక్క పైసా కూడా ఆపరేటర్లకు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క గత రెండు నెలలుగా జీతాలు చేతికి అందక.. అప్పులు చేసి వాహనాలను నడపాల్సి రావడంతో అవస్థలు పడుతున్నారు.
సమస్యలు పరిష్కరిస్తేనే నడిపేది...
ఏప్రిల్ నెలకు సంబంధించి కార్డుదారులకు సరఫరా నిమిత్తం జిల్లాకు కందిపప్పు 634.98 మెట్రిక్ టన్నులు; పంచదార 338.65 మెట్రిక్ టన్నులు కేటాయించారు. అందులో శుక్రవారం నాటికి కందిపప్పు 572 మెట్రిక్ టన్నులు, పంచదార 330 మెట్రిక్ టన్నుల మేర పౌరసరఫరాల గిడ్డంగులకు చేరింది. డీలర్లు వంద శాతం పంపిణీకి డీడీలు తీశారు. శనివారం నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకులు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే తమ సమస్యలు పరిష్కరించే వరకు వాహనాలను తిప్పబోమని ఆపరేటర్లు మండల తహసీల్దార్ల దృష్టికి తీసుకొచ్చారు. గిద్దలూరు మండలానికి చెందిన ఎండీయూ ఆపరేటర్లు ఇప్పటికే తమ వాహనాలను తహసీల్దార్ కార్యాలయానికి తెచ్చి పెట్టారు. దీంతో శనివారం నుంచి యథావిధిగా సరకుల పంపిణీ ఉంటుందా.. లేదా..? అనే విషయంపై అనిశ్చితి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీఎస్పీలొస్తుంటారు.. పోతుంటారు ఆ కంత్రీ కానిస్టేబుళ్లు లోకల్
[ 28-03-2024]
పశ్చిమంలోని కీలకమైన పోలీస్ సబ్ డివిజన్ కేంద్రంలో ఇద్దరు కానిస్టేబుళ్లు దీర్ఘకాలికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. అధికార పార్టీ నేతలపై ఎనలేని స్వామి భక్తి చాటుకుంటున్నారు. కార్యాలయంలోని కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్నారు. -
కారు, లారీ ఢీ.. ముగ్గురు మృతి
[ 28-03-2024]
టంగుటూరు టోల్ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
తలుపు తట్టనున్న ఓటు
[ 28-03-2024]
సార్వత్రిక ఎన్నికల శంఖం మోగింది. ఈసీ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. మే 13న పోలింగ్ ఉండనుంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈ సారి ఓ సువర్ణావకాశానికి తెర లేపింది. -
రూ.45 లక్షల విలువైన డబ్బు, మద్యం స్వాధీనం
[ 28-03-2024]
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్నట్లుగా అనుమానించిన సుమారు రూ.45 లక్షల విలువైన డబ్బు, మద్యం, ఇతర వస్తువులను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
దర్శి బరిలో నిలిచేదెవరు!
[ 28-03-2024]
జిల్లా రాజకీయాలను ఉత్కంఠతో ఊపేస్తున్న నియోజకవర్గం దర్శి. ఇక్కడి నుంచి తెదేపా కూటమి అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. -
త్వరలో మూడు చోట్ల జనసేన సభలు, రోడ్షోలు
[ 28-03-2024]
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జనసేన అధినేత పవన్కల్యాణ్ను మంగళగిరిలోని కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
కీలుబొమ్మల స్వామిభక్తి
[ 28-03-2024]
ప్రజాధనాన్ని తాము వేతనంగా పొందుతున్నామనే విషయాన్ని పలువురు వాలంటీర్లు విస్మరిస్తున్నారు. ఫక్తు వైకాపా కార్యకర్తల అవతారమెత్తారు. -
ఎన్నికల వేళ.. ఎన్ని విచిత్రాలో అన్నా
[ 28-03-2024]
అయిదేళ్లుగా అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. చిన్నపాటి మరమ్మతులు.. వీధి దీపాల ఏర్పాటు వంటి వాటిని కూడా గాలికొదిలేసిన పాలకులకు ఎన్నికల వేళ జ్ఞానోదయం అయింది. -
ఎన్నికల సంఘం ఆదేశాలు బేఖాతరు
[ 28-03-2024]
ఎన్నికల ప్రచారం, ఇతరత్రా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కొందరు వాలంటీర్లు బేఖాతరు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిపై వేటు చేసినా.. వారు గడిన పడటం లేదు. -
భారీగా అక్రమ మద్యం స్వాధీనం
[ 28-03-2024]
అర్థవీడు మండలం పోతురాజుటూరు- యాచవరం గ్రామాల నడుమ కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకొని ఇద్దరి వ్యక్తులను అరెస్టు చేసినట్లు మార్కాపురం సెబ్ డీఎస్పీ దుర్గాప్రసాద్ తెలిపారు. -
ఆక్వాలో ఉపాధికి అపార అవకాశం
[ 28-03-2024]
ఆక్వారంగం నేడు ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదుకుంటోందని, ఇందులో ఉపాధికి అపార అవకాశాలున్నాయని ఆంధ్రకేసరి విశ్వ విద్యాలయం ఉప కులపతి ఎం.అంజిరెడ్డి అన్నారు. -
విద్యార్థినులను వేధిస్తున్న ఆకతాయిలకు దేహశుద్ధి
[ 28-03-2024]
పదో తరగతి పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థినులను కొందరు ఆకతాయిలు వేధిస్తుండగా, బాలికల బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. -
ఒంగోలు ఆర్వోపై కలెక్టర్ ఆగ్రహం
[ 28-03-2024]
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఒంగోలు ఆర్డీవో, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జీవీ.సుబ్బారెడ్డిపై కలెక్టర్ దినేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కమనీయం.. ప్రతిష్ఠా మహోత్సవం
[ 28-03-2024]
శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని సంతనూతలపాడులో బుధవారం కనులపండువగా నిర్వహించారు. -
ముగిసిన పదో తరగతి ప్రధాన పరీక్షలు
[ 28-03-2024]
పదో తరగతి ప్రధాన పరీక్షలు బుధవారంతో ముగిశాయి. సంస్కృతం, వృత్తి విద్యకు సంబంధించినవి ఈ నెల 30 వరకు కొనసాగుతాయి. -
జీజీహెచ్లో రోగుల భోజనంపై విచారణ
[ 28-03-2024]
సర్వజన ఆసుపత్రిలో రోగులకు నాణ్యతలేని భోజనం పెడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై వైద్య విద్య డైరెక్టరేట్ విభాగం అధికారులు స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా