మహమ్మారిపై మళ్లీ పోరు!
మొదటి, రెండో దశలో కొవిడ్ విలయతాండవం చేసింది. జిల్లాలో వేలాది మంది వైరస్ బారిన పడ్డారు. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
25 పీహెచ్సీల్లో పడకల నిర్మాణం
పరీక్షల సంఖ్య పెంచుతూ నిర్ణయం
కొవిడ్ కేసులతో అప్రమత్తం
ఒంగోలు నగరం, న్యూస్టుడే:
జీజీహెచ్లో రోగుల పడకలు
మొదటి, రెండో దశలో కొవిడ్ విలయతాండవం చేసింది. జిల్లాలో వేలాది మంది వైరస్ బారిన పడ్డారు. వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఆసుపత్రుల్లో పడకలు దొరకడమే దుర్భరమైంది. ఆక్సిజన్ అందక ప్రాణాలు ఎందరో రోగుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ బాధితులను వాటిల్లోకి చేర్చడమూ సమస్యగా మారింది. అనంతరం పరిస్థితులు సద్దుమణిగాయి. ప్రస్తుతం కొవిడ్ కేసులు మళ్లీ వెలుగుచూస్తుండటంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశంలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అందిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనుమానితులకు గత వారం రోజులుగా ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నారు.
ఆసుపత్రులకు అనుబంధంగా గదులు...: అనుకోని పరిస్థితులు ఎదురైతే ఎదుర్కొనేందుకు వైద్యశాఖ సన్నద్ధమవుతోంది. బాధితుల కోసం ఎమర్జెన్సీ కొవిడ్ రెస్పాన్స్ ప్రాజెక్టు(ఈసీఆర్పీ) కింద జిల్లాలోని 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అరు పడకలతో ప్రత్యేక గదులు నిర్మించనున్నారు. ఇందుకోసం కేంద్రం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ పనులను ర.భ. శాఖకు అప్పగించారు. ప్రాథమికంగా మొదటి విడతలో రూ.30 లక్షల నిధులు విడుదల చేశారు. ఒక్కో పీహెచ్సీకి రూ.9.83 లక్షలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. భవిష్యత్తులో కొవిడ్ ఉద్ధృతి తలెత్తితే రోగులకు సత్వర సేవలందించడానికి ముందస్తుగా ఈ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటికితోడు టంగుటూరు మండలం కొణిజేడు, పొన్నలూరు మండలం చెరుకూరు, సీఎస్పురం మండలం డీజీ పేట, మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు, సింగరాయకొండ మండలం పాకలలో ఈ ఏడాది కొత్తగా ఆరోగ్య కేంద్రాలు ప్రారంభించారు. దీంతో మొత్తం వీటి సంఖ్య 69కు చేరింది. ప్రతి కేంద్రంలో ముగ్గురు స్టాఫ్నర్సులు, ఇద్దరు వైద్యులు పనిచేస్తున్నారు. కొవిడ్ పడకలు అందుబాటులోకి వచ్చాక ఆ సిబ్బందే అవసరమైన సేవలందిస్తారు.
ఆ 25 కేంద్రాలు ఇవే...: కొవిడ్ పడకలను ఏర్పాటు చేసే కేంద్రాలు 11 గిరిజన ప్రాంతాల్లో, 14 ఇతర ప్రదేశాల్లో ఉన్నాయి. చింతల, కొర్రప్రోలు, పాలుట్లపెంట, వెంకటాద్రిపాలెం, పుల్లలచెరువు, ముటుకుల, పెద్దారవీడు, చెట్లమిట్ట, అర్థవీడు, యాచవరం, కిష్టంశెట్టిపల్లి పీహెచ్సీలు గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. కొత్తపట్నం, త్రిపురాంతకం, సంతనూతలపాడు, బండ్లమూడి, కురిచేడు, తూర్పు గంగవరం, గజ్జలకొండ, ఉప్పలపాడు, కనిగిరి మాచవరం, వెలిగండ్ల, పెట్లూరు, సింగరాయకొండ, బేస్తవారపేట, కొమరోలు కేంద్రాలు ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేక గదులు నిర్మించడంతో పాటు కొవిడ్ రోగులకు వైద్యసేవలందించడానికి అవసరమైన మందులు, ల్యాబ్లు, పరికరాలు సమకూరుస్తారు.
9 మండలాల్లో హెల్త్ హబ్లు...: 15వ ఆర్థిక సంఘం నిధులతో 9 మండలాల్లో హెల్త్ హబ్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కొక్క దానికి రూ.50 లక్షలు కేటాయించారు. ఇందులో అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆన్లైన్ ద్వారా నిపుణుల వైద్యసలహాలు పొందవచ్చు. జిల్లాలో కొమరోలు, పుల్లలచెరువు, కనిగిరి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, చీమకుర్తి, తాళ్లూరు, సీఎస్పురం మండలాల్లో హెల్త్ హబ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పరిపాలనా అనుమతి రావాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందింది.
సన్నద్ధతపై 10, 11 తేదీల్లో మాక్డ్రిల్...
ఇప్పటికే అందిన ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనుమానితులకు ర్యాపిడ్ పరీక్షలు చేస్తున్నారు. బుధ, గురువారాల్లో జిల్లా వ్యాప్తంగా 30 పరీక్షలు చేశారు. వీటిని రోజుకు కనీసం 50కు పెంచాలనేది ఉన్నతాధికారుల ఆదేశాలు. పలుచోట్ల కేసులు నమోదు కావడంతో వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు ఈ నెల 10, 11 తేదీల్లో మాక్డ్రిల్ ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో ఏర్పాట్లు, ఆక్సిజన్, మందులు, ప్రత్యేక పడకలు, ల్యాబ్లు, పరీక్ష కిట్లు, వైద్యసిబ్బంది వివరాలను తెలుపుతూ నివేదికను డీఎంహెచ్వో డాక్టర్ రాజ్యలక్ష్మి ఉన్నతాధికారులకు ఇప్పటికే పంపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇది కాదా.. జగన్నాటకం!
[ 24-04-2024]
అబద్ధపు హామీలు గుప్పించడం.. మాయమాటలు చెప్పడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని మించినవారుండరు. అయిదేళ్లు పట్టించుకోకుండా ఉండటం. -
నామినేషన్ల వేళ మారిన పేర్లు
[ 24-04-2024]
నామినేషన్ల దాఖలు సమయంలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా అభ్యర్థుల మార్పు చోటుచేసుకుంది. గతంలో ప్రకటించిన వారికి కాకుండా కొన్నిచోట్ల ఇతరులకు సీట్లు కేటాయించారు. -
అరవీర ‘రంగు’ మార్తాండ
[ 24-04-2024]
మురుగు కాలువలు లేవు. ఉన్న వాటినైనా శుభ్రం చేయించడానికి సొమ్ముల్లేవు. ఎప్పుడో ఏర్పాటు చేసిన తాగునీటి పైపులైన్లే దిక్కు. పగిలిపోతే మరమ్మతులకు పైసల్లేవు. -
క్యాషియర్ జగన్.. నొక్కవేం బటన్
[ 24-04-2024]
రాష్ట్రంలో సంక్షేమం కోసం తరచూ బటన్లు నొక్కుతున్నాను. ప్రతి గడపకూ సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేరుస్తున్నానంటూ గొప్పలు చెప్పే ముఖ్యమంత్రివన్నీ ఉత్తుతి మాటలేనని అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సర్పంచులపై గురి.. పల్లెలకు ఉరి
[ 24-04-2024]
పల్లెవాసుల ఆశల్ని చిదిమేశారు..పట్టుగొమ్మలనూ నరికేశారు..నిధుల్ని దిగమింగేశారు..చిల్లిగవ్వ కోసం దేబిరించాల్సిన దుస్థితిలోకి పంచాయతీల్ని నెట్టేశారు. -
అయిదో రోజు 46 నామపత్రాల దాఖలు
[ 24-04-2024]
ఒంగోలు పార్లమెంట్తోపాటు, 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అయిదో రోజైన మంగళవారం 46 మంది తమ నామపత్రాలు దాఖలు చేశారు. -
తెదేపాలో చేరికల జోరు
[ 24-04-2024]
తెదేపాలో చేరికలు జోరందుకున్నాయి. మంగళవారం వైకాపా సర్పంచి కోమలి భర్త బొల్లినేని మధు అనుచర గణంతో సహా పార్టీలో చేరారు. -
కరోనాతో ఆర్థికంగా కుదేలై.. మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్య
[ 24-04-2024]
కరోనాతో ఆర్థికంగా కుదేలైన ఓ ఉద్యోగి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం సింగరాయకొండలో చోటు చేసుకుంది. -
చిట్టితల్లి వేడుక చూడకుండానే..
[ 24-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టితల్లి పుష్పాలంకరణ వేడుక చూడకుండానే ఆ తండ్రి దూర తీరాలకు చేరుకున్నారు. సామగ్రి తీసుకొస్తుండగా, కారు చక్రాలు కర్కశంగా ఆయన్ను చిదిమేశాయి. -
ఉత్సవ విగ్రహాల్లా మార్చేశావ్.. జగన్
[ 24-04-2024]
గత ప్రభుత్వ హాయంలో సర్పంచులు అంటే ఎంతో గౌరవంగా ఉండేది. చెక్ పవర్తో నిధులను ఖర్చు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించేవారు. -
రోడ్లు ఛిద్రం.. ఒళ్లు హూనం
[ 24-04-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో గ్రామీణ రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఎక్కడా ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఈ దారుల్లో ప్రయాణిస్తే ఒళ్లు హూనమవుతుందో రామచంద్రా అని ప్రజలు బాధ వెలబోసుకున్న వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. -
భూచోళ్ల అవినీతి రూ.201.33 కోట్లు
[ 24-04-2024]
ఒంగోలులో పేదలకు ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూముల కొనుగోలులో భారీ ఎత్తున కుంభకోణం చోటుచేసుకుందంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని భూ పరిపాలన శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్