క్రీడా పోటీలతో నాయకత్వ లక్షణాలు
జేఎన్టీయూకే సెంట్రల్ జోన్ క్రీడా పోటీలు రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న కళాశాల ప్రతినిధులు
ఒంగోలు నగరం, న్యూస్టుడే: జేఎన్టీయూకే సెంట్రల్ జోన్ క్రీడా పోటీలు రైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు సాగే పోటీలను కళాశాల కార్యదర్శి శిద్దా హనుమంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కళాశాలలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో బాస్కెట్బాల్, టెన్నిస్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డైరెక్టర్ శిద్దా సూర్యప్రకాశరావు, గౌరవ ఛైర్మన్ ఇస్కాల రంగమన్నార్ మాట్లాడుతూ... క్రీడా పోటీల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బృందస్ఫూర్తి పెరుగుతాయన్నారు. వర్సిటీ క్రీడా విభాగం కార్యదర్శి జీపీ రాజు, కళాశాల డైరెక్టర్ ఏవీ భాస్కరరావు, ప్రిన్సిపాళ్లు కేవీ సుబ్రహ్మణ్యం, రమేష్, ఫిజికల్ డైరెక్టర్ హిమచంద్రబాబు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం పరిధిలోని అయిదు జిల్లాల్లోని 32 కళాశాలల నుంచి 800 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తొలి రోజు మహిళా విభాగంలో ఖోఖో, బ్యాడ్మింటన్, చెస్; పురుషుల విభాగంలో ఖోఖో, బాస్కెట్ బాల్ మ్యాచ్లు నిర్వహించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Mekapati Chandrashekhar Reddy: టికెట్ కోసం జగన్ను ఐదుసార్లు కలిసినా ప్రయోజనం లేదు: ఎమ్మెల్యే మేకపాటి
-
Movies News
Chiranjeevi: వరుణ్ - లావణ్య.. అద్భుతమైన జోడీ: చిరంజీవి
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nara Lokesh: వైకాపా ఇసుక మాఫియాకు ఇదే ప్రత్యక్షసాక్ష్యం: నారా లోకేశ్ సెల్ఫీ
-
Politics News
Chidambaram: భాజపా అసహనానికి ఇదే నిదర్శనం: చిదంబరం
-
General News
KTR: ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధరణి పోర్టల్: కేటీఆర్